పాఠశాలలో టై,బెల్ట్,ఐడి కార్డు,డైరీల పంపిణీ…
నడికూడ,నేటిధాత్రి:
మండలంలోని చౌటుపర్తి మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు మోడెం రాజేందర్ బాబు అద్యక్షతన జరిగిన సమావేశంలో మండల విద్యాశాఖాధికారి కునుసోతు హనుమంతరావు ముఖ్యఅతిధిగా పాల్గొని విద్యార్థులకు టై, బెల్ట్.ఐడి కార్డు,డైరీలు పంపిణీ చేసి తదనంతరం మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలు కార్పోరేట్ పాఠశాలలకు ధీటుగా విద్యా బోధన జరుగుతున్నది.కావున విద్యార్థుల తల్లి దండ్రులు గ్రామంలో వున్న ప్రతి విద్యార్థిని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి నాణ్యమైన విద్యను అందుకోవాలని,ప్రభుత్వము విద్యార్థులకు అందిస్తున్న ఉచిత పుస్తకాలు,మధ్యాహ్న భోజనం,స్కూల్ యూనిఫామ్స్,వినియోగించుకోవాలని,ప్రభుత్వ పాఠశాలల్లోనే మంచి నైపుణ్యంతో బోధించే ఉపాధ్యాయులచే బోధన జరుగుతుంది.కాబట్టి గ్రామంలోని విద్యార్థుల తల్లిదండ్రులు అందరూ కలిసి పాఠశాలలోని విద్యార్థుల నమోదును పెంచుటకు కృషి చేయాలని కోరారు
ఈ సమావేశంలో అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్. గూడెం రమ్య,పాఠశాల ఉపాధ్యాయులు సదానందం,రామయ్య జగదీశ్వర్,నాగరాజు, విద్యార్థుల తల్లిదండ్రులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.