వారి వల్లే ఇది సాధ్యమైంది

వారి వల్లే ఇది సాధ్యమైంది

 

‘హరిహర వీరమల్లు’ చిత్రం ఈ శుక్రవారం విడుదలవుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా దర్శకుడు క్రిష్‌ ఎక్స్‌ వేదికగా స్పందించారు. ‘‘ఇప్పుడువీరమల్లు ప్రపంచంలోకి అడుగుపెడుతున్నాడు. నిశ్శబ్దంగా కాదు, ఓ గొప్ప చరిత్రను మీకు పరిచయం చేయాలన్న ఆశయంతో. ఈ సినిమా ఇద్దరు లెజెండ్స్‌ వల్లే సాధ్యమైంది. వారు సినిమా విషయంలోనే కాదు నిజజీవితంలోనూ ఎందరికో స్ఫూర్తి. అందులో ఒకరు, పవన్‌కల్యాణ్‌. ఆయన ఓ అసాధారణమైన శక్తి. నిత్యం రగిలే అగ్నికణం. ఆయనలోని తపనని ఏ కెమెరా క్యాప్చర్‌ చేయలేదు. నిరంతరం స్ఫూర్తినిస్తుంటారు. ఈ చిత్రానికి వెన్నెముకలా నిలిచి ప్రాణం పోశారు. మరో వ్యక్తి ఏ.ఎమ్‌.రత్నం. ఎన్నో అద్భుతమైన భారతీయ చిత్రాల వెనకున్న శిల్పి ఆయన. ఈ సినిమా ఆయన ధృడ సంకల్పం వల్లే సాధ్యమైంది. ఈ చిత్రం నాకు చాలా ప్రత్యేకం. కేవలం దర్శకుడిగానే కాదు, మరిచిపోయిన చరిత్రను తెలుసుకోవాలనే కుతూహలం ఉన్న వ్యక్తిగా. సంవత్సరాలుగా వేచి చూసిన సమయం ఆసన్నమైంది. ఇది అందరికీ గుర్తుండిపోయే సినిమా అవుతుంది. పవన్‌కల్యాణ్‌, ఏ.ఎమ్‌.రత్నంలకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు’’ అని పేర్కొన్నారు. కాగా, ఈ చిత్రానికి మొదట క్రిష్‌ దర్శకత్వం వహించారు. కొన్ని కారణాల వల్ల ఆయన వైదొలగడంతో జ్యోతికృష్ణ దర్శకత్వ బాధ్యతలు తీసుకున్నారు.

 

 

హరిహర వీరమల్లును డిస్ట్రబ్‌ చేయం నాగవంశీ కామెంట్స్‌..

హరిహర వీరమల్లును డిస్ట్రబ్‌ చేయం.. నాగవంశీ కామెంట్స్‌

తన సినిమాల గురించి విష ప్రచారం చేసే వారిపై సోషల్‌ మీడియా వేదికగానో, ఇంటర్వ్యూ లోనో ఘాటుగా స్పందిస్తుంటారు నిర్మాత సూర్యదేవర నాగవంశీ. మాటకుమాటకు అన్నట్లు ఆయన సమాధానం ఉంటుంది.

తన సినిమాల గురించి విష ప్రచారం చేసే వారిపై సోషల్‌ మీడియా వేదికగానో, ఇంటర్వ్యూలోనో  ఘాటుగా స్పందిస్తుంటారు నిర్మాత సూర్యదేవర నాగవంశీ (Naga Vamsi). మాటకుమాటకు అన్నట్లు ఆయన సమాధానం ఉంటుంది. దాంతో ట్రోలింగ్‌కు గురవుతుంటారు. ఏం జరిగినా, ఎవరు ఏం మాట్లాడినా ఆయన చెప్పాలనుకున్నది మాత్రం సూటిగా చెబుతారు.

తాజా తన చిత్రాలు గురించి ఫెయిల్యూర్స్‌ (Naga Vamsi Failures) గురించి ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. కథల విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, కొన్నిసార్లు పరాజయం పాలవుతాయని ఆయన అన్నారు. ప్రస్తుతం ఆయన విజయ్‌ దేవరకొండ, భాగ్యశ్రీ బోర్సే జంట గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో ‘కింగ్డమ్‌’ సినిమా చేస్తున్నారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా జులై 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా సినిమాల పరంగా చేసిన తప్పులు, హరిహర వీరమల్లు సినిమా తదితర విషయాల్లో నాగవంశీ తన అభిప్రాయాలు వ్యక్తం చేశారు.

‘హరి హర వీరమల్లు’ (harihara Veeramallu) చాలా పెద్ద సినిమా. కల్యాణ్‌గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత వస్తున్న సినిమా ఇది. ఒక నగరంలో 10 థియేటర్లు ఉంటే, వీరమల్లు విడుదలైన రోజున అన్ని థియేటర్లలో ఆడుతుంది. తర్వాత వారానికి కనీసం నాలుగైదు థియేటర్లలో వేరే సినిమా వేసుకునే అవకాశం ఉంటుంది.  మాకు ఆ నాలుగు థియేటర్లు చాలు. నేను ‘హరి హర వీరమల్లు’ సినిమాను డిస్ట్రబ్‌ చేయను. ఇప్పటికే మా సినిమా కింగ్డమ్‌ విడుదల చాలా వాయిదాలు పడింది.. మరీ ఆలస్యం చేస్తే ఓటీటీకి ఇబ్బంది అవుతుంది’

ఆ రెండు సినిమాలు తీయకుండా ఉంటే సరిపోయేది..
‘మా బ్యానర్‌లో తెలిసి చేసిన తప్పు ‘రణరంగం’ (Rana rangam) సినిమా తీయడం. శర్వానంద్‌కు ఏజ్డ్‌ క్యారెక్టర్‌ కరెక్ట్‌ కాదని బాబాయ్‌ చెప్పినా నేనూ సుధీర్‌ వినిపించుకోలేదు. అయినా రిస్క్‌ చేసి సినిమా చేశాం.  రవితేజ లాంటి నటుడు చేసి ఉంటే బాగుండేదేమో. ఫస్ట్‌ సీన్‌లో శర్వాను డాన్‌గా చూపించాం. అతడు డాన్‌ ఎలా అయ్యాడన్నది తెలుసుకోవాలన్న ఆసక్తి ప్రేక్షకుడికి ఏం ఉంటుంది? అని ఒక విమర్శకుడు అడిగారు. కరెక్టే కదా అనిపించింది.  ఆ తర్వాత అలాంటి తప్పులు చేయకూడదని కథల విషయంలో నిర్మొహమాటంగా ఉండే వారితో చర్చలు జరుపుతుండేవాడిని. అయినా మళ్లీ దెబ్బ తిన్నాం. ‘ఆది కేశవ’ ఫ్లాఫ్‌ అయింది. అవుట్‌పుట్‌ చూసుకున్న తర్వాత రిపేర్‌ చేయడానికి ప్రయత్నించాం. కానీ రోజురోజుకీ స్టోరీ జానర్‌ మారిపోతుంది. ప్రేక్షకులు ఓ పట్టాన యాక్సెప్ట్‌ చేయడం లేదు. దాంతో రిపేర్లు చేయడం కూడా వృథా అనిపించింది. ఈ రెండు సినిమాలు మా బ్యానర్‌లో చాలా ఖరీదైన తప్పులు.

ఆ స్టార్ హీరోపై నిధి అగర్వాల్ పొగడ్తల వర్షం..

ఆ స్టార్ హీరోపై నిధి అగర్వాల్ పొగడ్తల వర్షం..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) హీరోగా నటిస్తున్న తాజా సినిమా ‘హరిహర వీరమల్లు’. ఈ చిత్రానికి క్రిష్ జాగర్లమూడి, జ్యోతికృష్ణ దర్శకత్వం వహించారు. నిధి అగర్వాల్ (Nidhi Agarwal) హీరోయిన్ గా నటించిన ఈ మూవీలో.. బాబి డియోల్, అనుపమ్ ఖేర్, సత్యరాజ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. తొలి భాగం ‘హరి హర వీరమల్లు: పార్ట్ 1- స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ పేరుతో విడుదల కానుండగా.. ఇందులో పవన్ చారిత్రక యోధుడిగా మునుపెన్నడూ చూడని శక్తిమంతమైన పాత్రలో కనిపించనున్నారు. అయితే ఈ చిత్రం ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకు రాసుంది. ఈ సందర్భంగా గురువారం నిధి అగర్వాల్ విలేకరులతో సినిమా సంగతుల్ని పంచుకుంది.

ఆమె మాట్లాడుతూ.. ‘పవన్ కల్యాణ్ వంటి తిరుగులేని స్టార్డమ్ ఉన్న హీరోతో కలిసిన నటించడం గొప్ప అదృష్టం. ఆయనతో ఒక్క సినిమా చేసినా అది వంద సినిమాలతో సమానం. ఈ సినిమాలో నా పాత్ర పేరు పంచమి. తను చాలా శక్తివంతురాలు. ఎలాంటి సవాలునైనా స్వీకరించేందుకు సిద్ధంగా ఉండే ధైర్యశాలి. నా పాత్ర భిన్న కోణాలతో ఆసక్తికరంగా సాగుతుంది. మొఘల్ సామ్రాజ్య నేపథ్యంలో ఓ కల్పిత పాత్రను తీసుకొని ఈ కథను రాశారు. ఇందులో పవన్కల్యాణ్ రాబిన్ హుడ్ తరహా పాత్రలో కనిపిస్తారు. సినిమాలో భరతనాట్యం నేపథ్యంలో ఓ సన్నివేశం ఉంటుంది. అందులో అభినయించడం ఛాలెంజింగ్గా అనిపించింది’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

హరిహర వీరమల్లు గర్జించేది అప్పుడే…

హరిహర వీరమల్లు గర్జించేది అప్పుడే అభిమానులకు పండగే.

 

నేటి ధాత్రి:

 

 

 

పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం  ‘హరి హర వీరమల్లు'(hari hara Veera mallu) . 

ఈ సంవత్సరం విడుదల కానున్న భారీ భారతీయ చిత్రాలలో ఇదొకటి. 

భారీ అంచనాలు ఉన్న ఏ చిత్రం కోసం అభిమానులు ప్రేక్షకులు ఎంతో ఆతురతగా ఎదురు చూస్తున్నారు.

పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం  ‘హరి హర వీరమల్లు'(hari hara Veera mallu) . 
ఈ సంవత్సరం విడుదల కానున్న భారీ భారతీయ చిత్రాలలో ఇదొకటి. 
భారీ అంచనాలు ఉన్న ఏ చిత్రం కోసం అభిమానులు ప్రేక్షకులు ఎంతో ఆతురతగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, రెండు పాటలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. మూడవ పాటను ట్రైలర్‌తో పాటు ఆవిష్కరించడానికి చిత్ర బృందం సిద్ధమవుతోంది. ‘హరి హర వీరమల్లు’ చిత్రం షూటింగ్ తుదిదశకు చేరుకుంది. నిర్మాణాంతర కార్యక్రమాలు జోరుగా జరుగుతున్నాయి. వీఎఫ్ఎక్స్, సౌండ్ డిజైన్, డబ్బింగ్ పనులతో మెరుపు వేగంతో తుది మెరుగులు దిద్దుకుంటోంది. ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఎ. దయాకర్ రావు నిర్మిస్తున్న ఈ  చిత్రం, జూన్ 12న బాక్సాఫీస్ దగ్గర గర్జించనుంది.  ఈ మేరకు మేకర్స్ ఓ ప్రకటన విడుదల చేశారు.  జూన్ 12న సినిమాను విడుదల చేయనున్నట్లు తెలిపారు. చారిత్రాత్మక యోధుడు వీరమల్లు పాత్రలో పవన్ కళ్యాణ్ కనువిందు చేయనున్న ఈ చిత్రంలో పలువురు ప్రముఖ నటీనటులు భాగమయ్యారు. మొఘల్ చక్రవర్తిగా బాబీ డియోల్ నటిస్తున్నారు. నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో సత్యరాజ్, జిషు సేన్‌గుప్తా కీలక పాత్రలు పోషిస్తున్నారు. (Harihara veeramallu Release Date)

ఆలస్యాల మధ్య పగ్గాలు చేపట్టిన దర్శకుడు ఎ.ఎం. జ్యోతి కృష్ణ, కొద్ది నెలలుగా అవిశ్రాంతంగా పనిచేస్తున్నారు. ప్రతి విభాగాన్ని పర్యవేక్షిస్తూ, వెండితెరపై మునుపెన్నడూ చూడని అద్భుతమైన అనుభూతిని ప్రేక్షకులకు అందించడానికి కృషి చేస్తున్నారు. ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ‘మాట వినాలి’, ‘కొల్లగొట్టినాదిరో’ గీతాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ప్రముఖ ఛాయగ్రాహకుడు మనోజ్ పరమహంస కెమెరా బాధ్యతలు నిర్వహిస్తున్న ఈ సినిమాకి, లెజెండరీ కళా దర్శకుడు తోట తరణి అద్భుతమైన సెట్ లను రూపొందించారు. చిత్ర బృందం ఎక్కడా రాజీ పడకుండా, ప్రపంచం మెచ్చే గొప్ప చిత్రంగా మలచడానికి కృషి చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో భారీ ఎత్తున విడుదల కానున్న ‘హరి హర వీరమల్లు’ సినిమా.. ప్రేక్షకుల హృదయాలను, బాక్సాఫీస్‌ను గెలుచుకోవడానికి సిద్ధంగా ఉంది.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version