గుండి గ్రామాన్ని సందర్శించిన జిల్లా పంచాయతీ అధికారి వనం జగదీశ్వర్…

గుండి గ్రామాన్ని సందర్శించిన జిల్లా పంచాయతీ అధికారి వనం జగదీశ్వర్

కరీంనగర్, నేటిధాత్రి:

 

 

కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలో బుధవారం నుండి ప్రారంభం కానున్న సమ్మక్క జాతర ఏర్పాట్లను పరిశీలించి రామడుగు మండలంలో ప్రసిద్ధి చెందిన గుండి గ్రామంలోని సమ్మక్క జాతర విశేషాలను గ్రామస్థులను అడిగి తెలుసుకున్న అనంతరం గుడి ప్రాంగణంలో సమ్మక్క గద్దే వద్ద కొబ్బరికాయ కొట్టి పారిశుధ్య పనులను, జంపన్న వాగును పరిశీలించి లైటింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, జాతరకు వచ్చే భక్తుల కోసం తాగునీటి సదుపాయం ఏర్పాటు గురించి అడిగి తెలుసుకుని జాతరకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లను పూర్తి చేయాలనీ అధికారులను ఆదేశించారు. అనంతరం ఇటీవలే మరణించిన గ్రామ పంచాయతీ సఫాయి కార్మికులు పోచయ్య కుటుంబాన్ని పరామర్శించి వారి కుటుంబంలో ఒకరిని గ్రామ పంచాయతీ ఉద్యోగం వచ్చేలా తగిన చర్యలు తీసుకుంటాం అని వారి కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు. ఈకార్యక్రమంలో మండల పంచాయతీ అధికారి శ్రావణ్ కుమార్, గ్రామ సర్పంచ్ గుమ్మడి మల్లేశం, పంచాయతి కార్యదర్శి శ్రీనివాస్, వార్డు సభ్యులు, గౌడ సంఘం అధ్యక్షులు శ్రీనివాస్, గ్రామస్థులు, రామస్వామి, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్

తెలంగాణ సాయుధ పోరాట చరిత్రను పాఠ్యపుస్తకాలలో పాఠ్యంశంగా చేర్చాలి

సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్

కరీంనగర్, నేటిధాత్రి:

 

 

తెలంగాణ సాయుధ పోరాట చరిత్రను పాఠ్యపుస్తకాలలో పాఠ్యంశంగా చేర్చాలని సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వార్షికోత్సవాల సందర్భంగా కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గుండి గ్రామంలో రైతాంగ సాయుధ పోరాట అమరులు గుండి దామోదర్ రావు చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈసందర్బంగా పంజాల శ్రీనివాస్ మాట్లాడుతూ భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం జరిగిందని, నాలుగు వేల ఐదు వందల మంది అమరుల ప్రాణత్యాగంతో నిజాం నిరంకుశ పాలన నుండి తెలంగాణకు స్వాతంత్రం సిద్ధించిందని, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో పాల్గొన్న అమరులను స్మరించుకుంటూ వారి యొక్క పోరాట స్ఫూర్తితో యువ కమ్యూనిస్టులు పాలక ప్రభుత్వాల విధానాలపైన పోరాటాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఈకార్యక్రమంలో సిపిఐ పార్టీ మండల కార్యదర్శి ఉమ్మెంతుల రవీందర్ రెడ్డి, ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి మచ్చ రమేష్, సిపిఐ పార్టీ సీనియర్ నాయకులు గంటే రాజేశం, గుండి గ్రామ ఉపసర్పంచ్ మేడి శ్రీనివాస్, ముంజాల ప్రవీణ్ గౌడ్, మేకల నాగరాజు, దికొండ కుమారస్వామి, మచ్చ నరసయ్య ,ఏగుర్ల మల్లేశం, మచ్చ హరీష్ ,ఎండి అజీమ్, మహబూబ్ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version