నూతన గ్రామ కమిటీ ఎన్నిక అధ్యక్షుడిగా ఏకగ్రీవ ఎన్నిక.

కాంగ్రెస్ పార్టీ నూతన గ్రామ కమిటీ ఎన్నిక అధ్యక్షుడిగా ఏకగ్రీవ ఎన్నిక గంగాధర్ రాజు

మొగుళ్ళపల్లి నేటి ధాత్రి

 

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మొగుళ్ళపల్లి మండలం గుడి పహాడ్ గ్రామ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు కట్టంగూరి రవీందర్ రెడ్డి తెలిపారు భూపాలపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

జిల్లా అధ్యక్షులు అయిత ప్రకాశ్ రెడ్డి ఆదేశాల మేరకు గుడి పహాడ్ గ్రామ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు అధ్యక్షులుగా గంగాధర్ రాజు, ఉపాధ్యక్షులుగా మచ్చిక రమేష్, ప్రధాన కార్యదర్శిగా పాశం పర్వతాలు, కోశాధికారిగా బుర్ర సమ్మయ్య, ప్రచార కార్యదర్శి సమ్మోయి కొమురయ్య, కార్యదర్శి పాశం కిరణ్, సహాయ కార్యదర్శి ములుకోజు సదానందం, కార్యవర్గ సభ్యులు బుర్ర మొగిలి, కోడారి సంపత్, జనప నరసయ్య, బుర్ర కుమారస్వామి, వీరగోని రాజీరు, గంగాధర్ సాంబయ్య, కుమ్మరి కోటి, పాశం ఓదేలు, నకిర్త కుమారస్వామి, వీరగోని పద్మ, గోపు స్వప్న, ములుకోజు రాజమౌళి, బండారి సమ్మయ్య, పాశం రాజు లింగు లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

అనంతరం నూతన అధ్యక్షులు గంగాధర్ రాజు మాట్లాడుతూ నాపై నమ్మకం ఉంచి నన్ను కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులుగా ఎన్నుకున్నందుకు సర్వదా ఎల్లప్పుడూ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని పార్టీ

ఏ ఆదేశాలు ఇచ్చిన అందరికీ అందుబాటులో ఉండి ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తానని రాబోయే స్థానిక ఎలక్షన్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించే దిశగా కృషి చేస్తానని తెలిపారు ఈ సందర్భంగా తెలిపారు.

నాపై నమ్మకం ఉంచి నన్ను గ్రామ అధ్యక్షులుగా ఎన్నుకున్నందుకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version