భక్తులతో పోటెత్తిన దేవాలయాలు
* వివిధ ఆలయాలను దర్శించుకున్న ఎంపీ ఈటెల, డిసిసి ప్రెసిడెంట్ వజ్రేష్ యాదవ్
మేడ్చల్ జిల్లా ప్రతినిధి, నేటిధాత్రి 30 :
వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులతో దేవాలయాలు కిటకిటలాడాయి. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని జిహెచ్ఎంసి ఘట్కేసర్, మూడు చింతలపల్లి మున్సిపల్ పరిధిలోని ఉద్దేమర్రి శ్రీ శివాలయంలో ఎంపీ ఈటెల రాజేందర్, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, డిసిసి అధ్యక్షుడు వజ్రేష్ యాదవ్, డిసిసి మాజీ అధ్యక్షుడు హరివర్ధన్ రెడ్డి, నక్క ప్రభాకర్ గౌడ్, బీజేపీ జిల్లా అధ్యక్షులు బుద్ధి శ్రీనివాస్, మాజీ అధ్యక్షులు విక్రమ్ రెడ్డి, ఏనుగు సుదర్శన్ రెడ్డి,
డీసీఎంఎస్ వైస్ చైర్మన్ మధుకర్ రెడ్డి, మాజీ సర్పంచులు జాము రవి, విష్ణువర్ధన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దోసకాయల వెంకటేష్, ఆలయ కమిటీ చైర్మన్, డైరెక్టర్లు, వివిధ పార్టీలకు చెందిన నేతలు, భక్తులు స్వామివారిని ఉత్తర ద్వారం గుండా దర్శించుకున్నారు.
