మేడ్చల్ జిల్లాలో బీజేపీలో భారీ చేరికలు

బీజేపీ లో చేరికలు

మేడ్చల్ జిల్లా ప్రతినిధి, నేటిధాత్రి :

మునిసిపల్ ఎన్నికల్లో బీజేపీ దే విజయమని ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. మూడు చింతలపల్లి మాజీ మండల అధ్యక్షులు నందాల శ్రీనివాస్, బీజేపీ అర్బన్ జిల్లా అధ్యక్షుడు చింతల మాణిక్యం రెడ్డి ఆధ్వర్యంలో కొల్తూరు గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు కొండ నరసింహరావు, టిఆర్ఎస్ పార్టీ నాయకులు గళ్ళ మహేష్, వెంక గళ్ళ బాలయ్య, వెనుక గళ్ళ అనూష , కొల్తూరు ముదిరాజ్ సోదరులు కే నర్సింగారావు, కే అశోక్,కే సుధాకర్, కే భూపాల్, జే బాల నరసింహ,ఏ అశోక్,ఏ బిక్షపతి రాజు, జి జంగాలు ఎస్ వెంకట స్వామి, జె రమేష్, మూడుచింతలపల్లి మున్సిపాలిటీ కొల్తూరు 17, 18, 19, వార్డుల్లోని కాంగ్రెస్ బిఆర్ఎస్ నేతలు బిజెపిలో చేరారు. వారికీ శనివారం పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్బంగా ఎంపీ మాట్లాడుతూ మునిసిపల్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యం గా పని చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి బూత్ అధ్యక్షులు పి సురేందర్ రెడ్డి, ఎస్ మల్లేష్ యాదవ్, ఏ ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.

భక్తులతో పోటెత్తిన దేవాలయాలు

భక్తులతో పోటెత్తిన దేవాలయాలు
* వివిధ ఆలయాలను దర్శించుకున్న ఎంపీ ఈటెల, డిసిసి ప్రెసిడెంట్ వజ్రేష్ యాదవ్

మేడ్చల్ జిల్లా ప్రతినిధి, నేటిధాత్రి 30 :

 

 

వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులతో దేవాలయాలు కిటకిటలాడాయి. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని జిహెచ్ఎంసి ఘట్కేసర్, మూడు చింతలపల్లి మున్సిపల్ పరిధిలోని ఉద్దేమర్రి శ్రీ శివాలయంలో ఎంపీ ఈటెల రాజేందర్, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, డిసిసి అధ్యక్షుడు వజ్రేష్ యాదవ్, డిసిసి మాజీ అధ్యక్షుడు హరివర్ధన్ రెడ్డి, నక్క ప్రభాకర్ గౌడ్, బీజేపీ జిల్లా అధ్యక్షులు బుద్ధి శ్రీనివాస్, మాజీ అధ్యక్షులు విక్రమ్ రెడ్డి, ఏనుగు సుదర్శన్ రెడ్డి,

 

డీసీఎంఎస్ వైస్ చైర్మన్ మధుకర్ రెడ్డి, మాజీ సర్పంచులు జాము రవి, విష్ణువర్ధన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దోసకాయల వెంకటేష్, ఆలయ కమిటీ చైర్మన్, డైరెక్టర్లు, వివిధ పార్టీలకు చెందిన నేతలు, భక్తులు స్వామివారిని ఉత్తర ద్వారం గుండా దర్శించుకున్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version