మహిళలను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం: బీజేపీ చీఫ్ నితిన్ నబిన్…

మహిళలను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం: బీజేపీ చీఫ్ నితిన్ నబిన్

 

మహబూబ్‌నగర్‌లోని ఎంవీఎస్ కాలేజీ గ్రౌండ్‌లో బుధవారం బీజేపీ విజయ సంకల్ప సమ్మేళనం పేరిట భారీ బహిరంగ సభ జరిగింది. ఈ సమావేశానికి పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీలు డీకే అరుణ, లక్ష్మణ్ తదితరులు హాజరయ్యారు.

మహబూబ్‌నగర్, ఫిబ్రవరి 04: తెలంగాణలో రాజకీయాలు చాలా దయనీయంగా ఉన్నాయని.. మనదేశ సంస్కృతి సంప్రదాయాలపై సీఎం రేవంత్ రెడ్డి దాడి చేస్తున్నారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ సిన్హా విమర్శించారు. బుధవారం నాడు మహబూబ్ నగర్‌లోని ఎంవిఎస్ కాలేజీ గ్రౌండ్‌లో బీజేపీ విజయ సంకల్ప సమ్మేళనం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రసంగించిన నితిన్ నబీన్.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ఎండగట్టారు. కాంగ్రెస్ పార్టీ అంటే ముస్లింల పార్టీ అని స్వయంగా ముఖ్యమంత్రే ప్రకటించారని గుర్తు చేశారు. ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన బడ్జెట్ నిధులను మైనార్టీలకు బదలాయించారని ఆరోపించారు. రాష్ట్రంలో 77 వేల ఎకరాల భూమి వక్ఫ్ బోర్డుకు ఉందని గుర్తు చేశారు. ముస్లింల ఓట్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోందని విమర్శించారు నితిన్ నబీన్.
రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో అనేక హిందూ దేవాలయాలను కూల్చారంటూ మండిపడ్డారు నితిన్ నబీన్. ఆలయాలపై రాజకీయం చేస్తే.. బీజేపీ చూస్తూ ఊరుకోదన్నారు. అవసరమైతే తాము ప్రాణ త్యాగానికైనా సిద్ధమని ప్రకటించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తన విధానాలు మార్చుకోకపోతే.. ఎక్కువ రోజులు ఉండబోదంటూ హెచ్చరించారు. ప్రధాని మోదీ.. మహిళలను లక్షాధికారులను చేయాలని చూస్తే.. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం మహిళలను పూర్తిగా మోసం చేసిందన్నారు. రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు అధికమయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. మహిళలపై జరుగుతున్న అన్యాయాలను ప్రతి ఇంటికి వెళ్లి వివరించాలని కార్యకర్తలకు నితిన్ నబీన్ సూచించారు.

మేడ్చల్ జిల్లాలో బీజేపీలో భారీ చేరికలు

బీజేపీ లో చేరికలు

మేడ్చల్ జిల్లా ప్రతినిధి, నేటిధాత్రి :

మునిసిపల్ ఎన్నికల్లో బీజేపీ దే విజయమని ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. మూడు చింతలపల్లి మాజీ మండల అధ్యక్షులు నందాల శ్రీనివాస్, బీజేపీ అర్బన్ జిల్లా అధ్యక్షుడు చింతల మాణిక్యం రెడ్డి ఆధ్వర్యంలో కొల్తూరు గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు కొండ నరసింహరావు, టిఆర్ఎస్ పార్టీ నాయకులు గళ్ళ మహేష్, వెంక గళ్ళ బాలయ్య, వెనుక గళ్ళ అనూష , కొల్తూరు ముదిరాజ్ సోదరులు కే నర్సింగారావు, కే అశోక్,కే సుధాకర్, కే భూపాల్, జే బాల నరసింహ,ఏ అశోక్,ఏ బిక్షపతి రాజు, జి జంగాలు ఎస్ వెంకట స్వామి, జె రమేష్, మూడుచింతలపల్లి మున్సిపాలిటీ కొల్తూరు 17, 18, 19, వార్డుల్లోని కాంగ్రెస్ బిఆర్ఎస్ నేతలు బిజెపిలో చేరారు. వారికీ శనివారం పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్బంగా ఎంపీ మాట్లాడుతూ మునిసిపల్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యం గా పని చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి బూత్ అధ్యక్షులు పి సురేందర్ రెడ్డి, ఎస్ మల్లేష్ యాదవ్, ఏ ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.

జవహర్ నగర్ జిహెచ్ఎంసి లో విలీనం పై బీజేపీ నేతల అభ్యంతరాలు…

జవహర్ నగర్ జిహెచ్ఎంసి లో విలీనం పై బీజేపీ నేతల అభ్యంతరాలు
* సంబంధిత అధికారికి లిఖితపూర్వకంగా అభ్యంతరాలు అందజేత

మేడ్చల్ జిల్లా ప్రతినిధి, నేటిధాత్రి 15 :

 

లక్ష్య ఓటర్లు కలిగిన జవహర్ నగర్ ను కేవలం 2 డివిజన్ లకే పరిమితం చేయడం సరికాదని జవహర్ నగర్ బీజేపీ తూర్పు శాఖ అధ్యక్షులు కర్లపూడి జోగారావు డిమాండ్ చేశారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ జవహర్ నగర్ కార్పొరేషన్ ను జిహెచ్ఎంసి లో విలీనం చేసిన సందర్భంగా సోమవారం బిజెపి పార్టీ ఆధ్వర్యంలో అభ్యంతరాలు తెలపడం జరిగింది. సుమారు లక్ష ఓటర్లు ఉన్న జవహర్ నగర్ ను కేవలం రెండే రెండు డివిజన్ లుగా మార్చడం సరికాదన్నారు. దీంతో ప్రజలకు చాలా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని కాబట్టి దీనిని కనీసం మూడు లేదా నాలుగు డివిజన్లుగా చేయాలని కోరడం జరిగిందన్నారు. అంతేకాకుండా గతంలో ఒక డివిజన్లోని ఓట్లను 28 డివిజన్ లలో ఉండడం వల్ల ఓటు వేసే ప్రజలకు అటు కార్పొరేటర్ గా నిలబడిన అభ్యర్థులకు డివిజన్ అభివృద్ధికి ఆటంకంగా నిలవడమే కాకుండా అనేక సమస్యలకు గందరగోళానికి దారితస్తుధన్నారు. కాబట్టి ఇప్పటికైనా ఏ డివిజన్లోని ఓట్లు ఆదే డివిజన్లోనే ఉండేట్లుగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని
జిహెచ్ఎంసి సంబంధిత అధికారులకు లిఖితపూర్వకంగా అభ్యంతరాలు తెలపడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ రూరల్ జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షుడు మహేందర్ యాదవ్ గారు, వేపుల సన్నీ, అనిల్ గుప్తా, మైపాల్ రెడ్డి, గిరి కత్తుల వెంకన్న, మందుల శ్రీధర్, మల్లికార్జున్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version