డేంజర్ స్పాట్…..

డేంజర్ స్పాట్……..!?

◆-: నిమ్జ్ ఎక్స్ రోడ్డుపై తరచూ
ప్రమాదాలు

◆-: తండ్రి, కొడుకులకు విరిగిన కాళ్లు

◆-: పట్టించుకోని అధికారులు

◆-: నివారణకు చర్యలు తీసుకోండి:
వాహనదారులు

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఝరాసంగం: సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం బర్దిపూర్, ఎల్లోయి, చిలేపల్లి గ్రామ శివారులో నిమ్ పరిశ్రమల కోసం ఉగ్గేలి నుంచి బర్దిపూర్ గ్రామ శివారుకు నూతనంగా నిర్మించిన రహదారి ప్రమాణాలకు నిలయంగా మారింది. మాచ్చూర్ కేంద్రీయ విద్యాలయం క్రాస్ రోడ్ వద్ద తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఉగ్గేలి. కృష్ణాపూర్ నుంచి వచ్చే వాహనాలు, జహీరాబాద్ నుంచి ఝరాసంగం వైపు వెళ్లే వాహనదారులు ఈ మార్గంలో ప్రమాదాలకు గురవుతున్నారు. ఇటీవల మాచ్నూర్ గ్రామానికి చెందిన తండ్రి, కొడుకులు

 

ప్రమాదానికి గురై ఇద్దరి కాళ్లు విరగడంతో ఆసుపత్రి పాలయ్యారు. బర్దిపూర్, ఝరాసంగం గ్రామాలకు చెందిన పలువురు కూడా ఇదే ప్రాంతంలో ప్రమాదా లకు గురైనట్లు తెలిసింది. కేంద్రీయ విద్యాలయ సమీపంలో నాలుగు రోడ్లు కలిసే కూడలి వద్ద ఎక్కువ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. నూతన రోడ్డుపై రేడియం స్టిక్కర్లు వేసినప్పటికీ వాహనదారులు వాటిని పట్టించుకోవడం లేదు.. దీనికి తోడు ఝరాసంగం వైపు, అటు పస్తాపూర్ వైపు వెళ్లే రహదారులపై వాహనాలు అధిక వేగంతో ప్రయాణిస్తున్నాయి. నాలుగు రోడ్ల కూడలి వద్దకు

 

 

 

రాగానే వేగం అదుపుతప్పడంతో ప్రమాదాలు జరు గుతున్నాయి. రెండు వైపులా ట్రాఫిక్ సిగ్నల్, స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేస్తే ప్రమాదాలను నివారించవ చ్చని ప్రయాణికులు కోరుతున్నారు. ఇదిలా ఉంటే కుప్పానగర్ సమీపంలో ఏడు ప్రమాదకరమైన రోడ్డు మలుపులు ఉన్నాయి. కుప్పానగర్ శివాజీ విగ్రహం సమీపంలో ఇప్పటికే ఇద్దరు వ్యక్తులు ప్రమాదాల్లో మృతి చెందారు. అనేక మూగజీవులు ప్రాణాలు కోల్పోయాయి. కుప్పానగర్ శివారులోని జట్టప్ప బా వి మూల, మల్లన్న గుట్ట క్రాస్ రోడ్, శివాజీ విగ్రహం. ప్రభుత్వ పాఠశాల, హైమద్ దర్గా, గొల్ల రవి పాలం వద్ద ప్రమాదకరమైన మలుపులు ఉన్నా యి. ఇప్పటికైనా అధికారులు స్పందించి రోడ్డు ప్రమాదాలన్నీ నివారణ చర్యలు చేపట్టాలని ప్రయాణి కులు, వాహనదారులు ప్రభుత్వానికి అధికారులకు విజ్ఞప్తి చేశారు.

ప్రజా పిర్యాదుల పరిష్కార వేదికకు 46 వినతులు..

ప్రజా పిర్యాదుల పరిష్కార వేదికకు 46 వినతులు..

తిరుపతి(నేటిధాత్రి)అక్టోబర్ 13:

 

నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు 46 వినతులు వచ్చాయని కమిషనర్ ఎన్. మౌర్య తెలిపారు. సోమవారం తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో డయల్ యువర్ కమిషనర్, ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాలను నిర్వహించారుఈ కార్యక్రమంలో 36 మంది కార్యాలయంకు నేరుగా వచ్చి వినతులు సమర్పించగా,10 మంది ఫోన్ ద్వారా తమ సమస్యలు తెలిపారు. కాగా డిప్యూటీ మేయర్లు ముద్ర నారాయణ, ఆర్.సి. మునికృష్ణ, కార్పొరేటర్ దూది కుమారితమ వార్డుల్లో సమస్యలను పరిష్కరించాలని కోరారు. లక్ష్మీపురం కూడలి పనులు,పుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని కార్పొరేటర్ ఎస్.కె.బాబు ఫోన్ ద్వారా కోరారు. యాదవ వీధిలో త్రాగునీటిలో మురుగు నీరు కలుస్తున్నాయి పరిష్కరించాలని,పింఛన్ ఇప్పించాలని, కోర్లగుంట రోడ్డులో స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని, మురుగునీటి కాలువలు శుభ్రం చేయాలని, యాదవ వీధిలో రోడ్డు నిర్మించాలని, కూరపాటి లే అవుట్ వద్ద రోడ్డు నిర్మాణం చేపట్టాలని, కోర్లగుంట మారుతీ నగర్ లో వర్షపు నీరు నిలిచి పోతున్నది పరిష్కరించాలని,ఏ ఆర్ హాస్పిటల్ రోడ్డులో అనధికారిక నిర్మాణాలు అడ్డుకోవాలని, కుక్కల సమస్య పరిష్కరించాలని,ఎల. ఎస్. నగర్ నందు కాలువలు మరమ్మత్తు చేయాలని, నగరంలోని ఓపెన్ డ్రైన్స్ లో చెత్త వేయకుండా గ్రిల్స్ ఏర్పాటు చేయాలని కోరారు. ఆయా సమస్యలను అధికారులకు పంపామని త్వరగా పరిష్కరించాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ అమరయ్య, సూపరింటెండెంట్ ఇంజినీర్ శ్యాంసుందర్, మునిసిపల్ ఇంజినీర్లు తులసి కుమార్, గోమతి,హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, రెవిన్యూ అధికారులు సేతుమాదవ్, రవి,ఫైర్ ఆఫీసర్ శ్రీనివాసులు, వెటర్నరీ ఆఫీసర్ గుణశేఖర్, డి.ఈ.లు, ఏసీపీ లు, శానిటరీ సూపర్ వైజర్లు, తదితరులు ఉన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version