దేశ రాజధానిలో వీధి కుక్కల సమస్యపై సుప్రీం కోర్టు సోమవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఢిల్లీ మున్సిపల్ సంస్థ stray dogsను ఎనిమిది వారాల్లో పట్టుకుని, వాటిని శాశ్వతంగా షెల్టర్లకు తరలించాలని, ముందుగా వాటిని స్టెరిలైజ్ చేయాలని ఆదేశించింది.
రాజధానిని సురక్షితంగా ఉంచేందుకు ఈ చర్యలను కఠినంగా అమలు చేయాలని కోర్టు స్పష్టంచేసింది. ఈ ప్రక్రియలో ఎవరైనా వ్యక్తి లేదా సంస్థ అడ్డంకిగా మారితే, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.