రజతోత్సవ సభను విజయవంతం చేసిన మాజీ ఎమ్మెల్యే.

రజతోత్సవ సభను విజయవంతం చేసిన మాజీ ఎమ్మెల్యే పెద్దికి సన్మానం.

ఉద్యమ సారధిని సన్మానించిన మండల పార్టీ అధ్యక్షుడు బానోత్ సారంగపాణి.

నల్లబెల్లి  నేటి ధాత్రి:

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అహర్నిశలు కృషిచేసి రథసారధి కేసీఆర్ అడుగుజాడలో నడుస్తూ వెన్నుదన్నుగా నిలిచి తెలంగాణ ప్రజల గొంతును కేంద్ర ప్రభుత్వాలపై పోరాడిన వ్యక్తి నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అని ఆయన అన్నారు. ఉద్యమ పార్టీగా పుట్టి రాజకీయ పార్టీగా అవతరించి దేశ రాజకీయాలను శాసించే శక్తిగా ఎదిగిన భారత రాష్ట్ర సమితి పార్టీ 25వ వసంతాల రజతోత్సవ సభను తన భుజస్కందాలపై మోస్తూ సభను విజయవంతం చేయడంలో తన మార్కు చూపించిన పెద్దికి మండల పార్టీ ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా శాలువతో సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కక్కర్ల శ్రీనివాస్ గౌడ్, నాయకులు గందే శ్రీనివాసులు గుప్తా, మామిండ్ల మోహన్ రెడ్డి, ఊరటి అమరేందర్ రెడ్డి, భగీరథ, రాజు తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా వాసవి మాత జన్మదిన మహోత్సవం.!

ఘనంగా వాసవి మాత జన్మదిన మహోత్సవం.

కల్వకుర్తి నేటి దాత్రి :

నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి లో కన్యకా పరమేశ్వరి మాతదేవాలయం లో వైశాఖ శుద్ధ దశమి బుధవారం రోజున వాసవి మాత జన్మదిన సందర్భంగా దేవాలయం ఫౌండర్ ట్రస్ట్రీ చైర్మన్ జూలూరి రమేష్ బాబు ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించడం జరిగినది. అందులో భాగంగా ఉదయం 6 గంటలకు అభిషేకం, మహిళలు చే కుంకుమార్చనలు పూజలు, వాసవి మాత పారాయణం, విష్ణు సహస్రనామాలు, భగవద్గీత పారాయణం, హనుమాన్ చాలీసా అమ్మవారికి పల్లవి సేవ డోలారోహణం, కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఆర్య వైశ్యులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అనంతరం తీర్థ ప్రసాదాలు భోజనప్రసాదాలు వితరణ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య పట్టణ నాయకులు, మండల నాయకులు,వాసవి క్లబ్ వనిత క్లబ్,ఆవోప సంఘాలు నాయకులు పాల్గొన్నారు.

ఘనంగా వాసవి మాత జన్మదిన మహోత్సవం.

ఘనంగా వాసవి మాత జన్మదిన మహోత్సవం.

కల్వకుర్తి నేటి దాత్రి :

నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి లో కన్యకా పరమేశ్వరి మాతదేవాలయం లో వైశాఖ శుద్ధ దశమి బుధవారం రోజున వాసవి మాత జన్మదిన సందర్భంగా దేవాలయం ఫౌండర్ ట్రస్ట్రీ చైర్మన్ జూలూరి రమేష్ బాబు ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించడం జరిగినది. అందులో భాగంగా ఉదయం 6 గంటలకు అభిషేకం, మహిళలు చే కుంకుమార్చనలు పూజలు, వాసవి మాత పారాయణం, విష్ణు సహస్రనామాలు, భగవద్గీత పారాయణం, హనుమాన్ చాలీసా అమ్మవారికి పల్లవి సేవ డోలారోహణం, కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఆర్య వైశ్యులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అనంతరం తీర్థ ప్రసాదాలు భోజనప్రసాదాలు వితరణ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య పట్టణ నాయకులు, మండల నాయకులు,వాసవి క్లబ్ వనిత క్లబ్,ఆవోప సంఘాలు నాయకులు పాల్గొన్నారు.

ఘనంగా మే డే ఉత్సవం.!

భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా మే డే ఉత్సవం.

బెల్లంపల్లి నేటిధాత్రి :

 

మే డే ఉత్సవం సందర్భంగా బెల్లంపల్లి పట్టణంలో భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో పట్టణ పార్టీ కార్యాలయంలో పట్టణ కార్యదర్శి ఆడెపు రాజమౌళి, భగత్ సింగ్ స్టాచ్ దగ్గర పట్టణ అమాలి సంఘం జెండాను రాష్ట్ర సమితి సభ్యులు మిట్టపల్లి వెంకటస్వామి, ఏరియా హాస్పిటల్ జెండాను జిల్లా కార్యవర్గ సభ్యులు దాగం మల్లేష్, భవన నిర్మాణ సంఘం జెండాను భవన నిర్మాణ కార్మిక సంగం జిల్లా కార్యదర్శి జాడి పోచం, రైల్వే స్టేషన్ జెండాను మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షులు బొల్లం సోనీ, ఇంక్లైన్ జెండాను పట్టణ కార్యవర్గ సభ్యులు బొంకూర్ రామచందర్, రైల్వే రధగంబాల జెండాను శాఖ కార్యదర్శి ఎన్ రాజన్న పాత బెల్లంపల్లి జెండాను జిల్లా సమితి సభ్యులు మేకల రాజేశం అరుణ పతాక ఆవిష్కరణలు చేసినారు. ఈ సందర్భంగా పట్టణ కార్యదర్శి ఆడపు రాజమౌళి, రాష్ట్ర సమితి సభ్యులు మిట్టపల్లి వెంకటస్వామి, జిల్లా కార్యవర్గ సభ్యులు దాగం మల్లేష్ ప్రసంగిస్తూ చికాగో అమరుల రక్తంతో తడిసి ఎర్రజెండాగా అవతరించింది. కార్మికులను 16 గంటలు పని చేస్తూ కట్టు బానిసలుగా తయారు చేస్తూ నీరం కుశంగా అణచివేస్తున్నందుకు నిరసనగా 1886లో అమెరికాలోని చికాగో నగరంలో పెద్ద ఎత్తున కార్మికులు ర్యాలీ నిర్వహించినారు. అట్టి రాలిపై పోలీసులు జరిపిన కాల్పులలో ఎంతోమంది కార్మికులు వీర మరణం పొందారు. వారి పోరాట ఫలితంగా ప్రపంచమంతా ఎనిమిది గంటల పని విధానాన్ని అమలు చేసి నారు. వారి పోరాట స్ఫూర్తితో భారతదేశంలో కార్మిక వర్గ పోరాటాలు చేస్తూ 44 కార్మిక చట్టాలను సాధించాము. మోడీ ప్రభుత్వం కార్మికులు సాధించుకున్న కార్మిక చట్టాలను కాలరాస్తూ 44 చట్టాలను నాలుగు కోడు లుగా మారుస్తూ కార్మిక హక్కులను హరించు చున్నది. కావున దీనికి వ్యతిరేకంగా కార్మిక వర్గమంతా సంగటితమై కేంద్ర ప్రభుత్వ విధానం కు వ్యతిరేకంగా కార్మిక చట్టాలను రక్షించుకొనటానికి సమరశీల పోరాటాలు చేయవలసి ఉన్నదని కేంద్ర ప్రభుత్వం దేశంలో నక్సలైట్లను లేకుండా చేస్తామని ఆపరేషన్ కగారు పేరిట కేంద్ర బలగాలతో కర్రెగుట్టలను ఆక్రమించుకొని జల్లేడపడుతూ జీవించే హక్కును హరించవద్దని మరియు నక్సలైట్లు కూడా జనజీవన స్రవంతిలో కి రావాలని వారితో చర్చలు జరపాలని వామపక్ష పార్టీలు ఈ సందర్భంగా కోరుతున్నాయి. కార్యక్రమంలో మండల కార్యదర్శి బొంతల లక్ష్మీనారాయణ, జిల్లా సమితి సభ్యులు అక్క పెళ్లి బాబు, డిఆర్ శ్రీధర్, గుండా చంద్ర మాణిక్యం, బియ్యాల ఉపేందర్, మేకల రాజేశం, పట్టణ సహాయ కార్యదర్శి కొంకుల రాజేష్, ఏ ఐ టి యు బ్రాంచి సహాయ కార్యదర్శి దాసరి తిరుపతి గౌడ్, మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షులు బొల్లం సోని, పట్టణ కార్యవర్గ సభ్యులు మంతెన రమేష్, రత్నం రాజం, రామచందర్, బొల్లం తిలక్ అంబేద్కర్, దాసరి అనిల్ కుమార్, పట్టణ లోడింగ్ అన్లోడింగ్ అమాలి సంఘం కార్యదర్శి కుందేళ్ళ శంకర్, కా సిపేట మైన్ 1 పిట్ కార్యదర్శి మీనుగులక్ష్మీనారాయణ, కా సిపేట మైన్ 2 ఫిట్ కార్యదర్శి గొల్ల శ్రీనివాస్ మరియు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

బీ ఆర్ ఎస్ రజతోత్సవ సభకు తరలిరావాలి.!

బీ ఆర్ ఎస్ రజతోత్సవ సభకు తరలిరావాలి

పరకాల మాజీ ఎంపీటీసీ చందుపట్ల సాయి తిరుపతి రెడ్డి

పరకాల నేటిధాత్రి:

టిఆర్ఎస్ రజతోత్సవ సభకు తెలంగాణ ప్రజలు తరలిరావాలని పరకాల మాజీ ఎంపీటీసీ,మలిదశ ఉద్యమకారుడు చందుపట్ల సాయి తిరుపతి రెడ్డి పిలుపునిచ్చారు.ఆయన మాట్లాడుతూ కష్ట నష్టాలకు ఓర్చి తెచ్చుకున్న తెలంగాణ, మోసపూరిత కాంగ్రెస్ చేతుల్లో పడి ఆగమైపోతున్నదని,వారి పాలనను ఎండగట్టి తెలంగాణను కాపాడుకునే దశలో ఈ నెల 27న వరంగల్ ఎల్కతుర్తిలో జరిగే బీ ఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు భారీగా జనాలు తరలివచ్చి విజయవంతం చేయాలని పేర్కొన్నారు.కెసిఆర్ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పదువులను లెక్కచేయలేదని, చావుదాకా వెళ్లి తెలంగాణను సాధించినట్లు గుర్తు చేశారు. కొట్లాడి సాధించుకున్న రాష్ట్రాన్ని పదేండ్ల కేసీఆర్ పాలనలో అన్నిరంగాల్లో దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దినట్లు పేర్కొన్నారు.ఈ నెల 27న ప్రతి ఒక్కరు గులాబీ జెండాతో సభకు కదలాలని కోరారు.

రజతోత్సవ సభను విజయవంతం చేయండి.!

బి.ఆర్.ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయండి

సిరిసిల్ల టౌన్ : (నేటిధాత్రి)

 

 

 

 

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని 37వ వార్డులో మాజీ కౌన్సిలర్ రెడ్డి మాధవి రాజు ఆధ్వర్యంలో ఈరోజు సిరిసిల్ల పట్టణంలో డప్పు సప్పులతో ఇంటింటికి వెళ్లి బొట్టు పెట్టి ఆహ్వాన పత్రికను అందించి కుటుంబ సమేతంగా తేది:27-4-24 ఆదివారం రోజున జరగబోయే భారత రాష్ట్ర సమితి పార్టీ 25వ వేడుకల సందర్భంగా రజతోత్సవ సభను విజయవంతం చేయవలసిందిగా కోరడం జరిగినది. అంతే కాకుండా భారత రాష్ట్ర సమితి పార్టీ అధ్యక్షులు, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మాటలు విని కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా సవినాయంగా వార్డు ప్రజలను కోరుతూ ఆహ్వాన పత్రిక అందించడం జరిగినది.ఈ కార్యక్రమనికి ముఖ్య అతిధి గా భారత రాష్ట్ర సమితి పార్టీ రాష్ట్ర కార్యదర్శి తాజా మాజీ చేనేత, జౌలి మరియు టెక్స్ టైల్స్ కార్పొరేషన్ అధ్యక్షులు గూడూర్ ప్రవీణ్, సిరిసిల్ల పట్టణ మహిళా విభాగం అధ్యక్షురాలు బత్తుల వనజ రమేష్, 37.వ వార్డు బి.ఆర్.యస్ పార్టీ అధ్యక్షులు వేముల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి,కూరపాటి భూమేష్, బూత్ అధ్యక్షులు వేముల తిరుపతి, మహిళా విభాగం వార్డు అధ్యక్షులు ముదారపు లలిత రాజేశం, కమిటీ సభ్యులు, ఎక్కల దేవి శ్యామల, గంగుల సదానందం, మచ్చ సురేష్, గాజుల ఎల్లయ్య, జిందం రాజేశం, బోద్దుల రమేష్, పచ్చనూరు తిరుపతి, గజ్జల లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు.

వరంగల్ ఎల్కతుర్తిలో రజతోత్సవ సభను.!

వరంగల్ ఎల్కతుర్తిలో రజతోత్సవ సభను విజయవంతం చేయాలి. 

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

 

వరంగల్ ఎల్కతుర్తిలో ఈ నెల 27న జరిగే బిఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని జహీరాబాద్ శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు నాయకులకు,కార్యకర్తలకు పిలుపునిచ్చారు
మాజి మంత్రివర్యులు సిద్దిపేట శాసనసభ్యులు తన్నీరు హరీష్ రావు గారి ఆదేశాల మేరకు

Silver Jubilee Celebration

బిఆర్ఎస్ పార్టీ జహీరాబాద్ మండల ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు అనంతరం ఎమ్మెల్యే, మాట్లాడుతూ.ఈనెల 27న ఎల్కతుర్తి బిఆర్ఎస్ రజతోత్సవ సభకు నాయకులు తరలిరావాలని ,ఎల్కతుర్తిలో జరుగనున్న రజతోత్సవ సభలో కేసీఆర్‌ తెలంగాణ ప్రజల భవిష్యత్‌ గురించి దిశా నిర్దేశం చేయనున్నారని, బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరై సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

Silver Jubilee Celebration

ఈ కార్యక్రమంలో మాజి మార్కెట్ చైర్మన్ గుండప్ప ,మాజి ఆత్మ చైర్మన్ విజయ్ కుమార్,పెంట రెడ్డి,
జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ,మొగుడంపల్లి మండల పార్టీ అధ్యక్షులు సంజీవ్ రెడ్డి ,కోహీర్ మండల పార్టీ అధ్యక్షులు నర్సింలు,పాక్స్ చైర్మన్ మచ్చెందర్,బీసీ సెల్ మండల అధ్యక్షులు అమిత్ కుమార్,ఎస్టీ సెల్ మండల అధ్యక్షులు హీరు రాథోడ్,మైనార్టీ మండల అధ్యక్షులు వహీద్,మండల పార్టీ జనరల్ సెక్రటరీ మోహన్ రెడ్డి,మాజి సర్పంచ్ లు చిన్న రెడ్డి,విజయ్ ,అబ్రహం,మాజి ఎంపీటీసీ లు బస్వరాజు,రాములు,శంకర్,గ్రామ పార్టీ
అధ్యక్షులు,నాయకులు ,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

భారత రాష్ట్ర సమితి రజతోత్సవ సభను.!

భారత రాష్ట్ర సమితి రజతోత్సవ సభను విజయవంతం చేయండి. 
మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్

సిరిసిల్ల టౌన్:( నేటిధాత్రి)

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రలో తెలంగాణ భవన్ లో విలేకరుల సమావేశలో 27న జరిగే 25 వసంతల రజతోత్సవ చలో వరంగల్ సభకు రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి అధిక సంఖ్యలో ప్రజలను కార్యకర్తలను వచ్చి విజయవంత చేయవలసిందిగా కోరారు ఈ సమావేశం లో ముఖ్యఅతిథులుమాజీ ఎంపి బోయినపల్లి వినోద్ కుమార్, వేములవాడ నియోజకవర్గం ఇంచార్జ్ చల్మెడ లక్ష్మి నరసింహరావు మరియు, మాజీ జడ్పీ చైర్మన్ న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి జెడ్పి వైస్ చైర్మన్ సిద్ధం వేణు, సిరిసిల్ల మాజీ మున్సిపల్ చైర్మన్ జిందం కళ చక్రపాణి, రాష్ట్ర కార్యదర్శి గూడూరి ప్రవీణ్, సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి బొల్లి రాంమోహన్ కుంబాల మల్లారెడ్డి నాగరాజు, యాదవ్ వివిధ మండలాల మాజీ జెడ్పిటీలు, ఎంపిటిసీలు సర్పంచ్ లు కౌన్సిలర్స్లు కార్యకర్తలు పాల్గొన్నారు.

రజతోత్సవ సభ తెలంగాణ రజక సంఘాల సమితి.!

బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ తెలంగాణ రజక సంఘాల సమితి పోస్టర్ ఆవిష్కరణ

నడికూడ,నేటిధాత్రి:

 

ఏప్రిల్ 27న ఎల్కతుర్తి లో జరగబోయే భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ రజతోత్సవ సభను రజక సంఘo కుల బంధువులు, రజక సంఘం నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరుతూ నడికూడ మండలంలోని నార్లాపూర్ గ్రామంలో ఈరోజు పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఆదేశాల మేరకు బీఆర్ఎస్ పార్టీ నడికూడ మండల అధ్యక్షుడు దురిశెట్టి చంద్రమౌళి (చందు)ఆధ్వర్యంలో తెలంగాణ రజక సంఘాల సమితి పోస్టర్ ఆవిష్కరణ చేసిన తెలంగాణ రాష్ట్ర రజక సంఘాల సమితి చైర్మన్, ముస్తబాద్ మాజీ ఎంపీపీ అక్కరాజు శ్రీనివాస్,చేతుల మీదుగా పోస్టర్ ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో బీసీ బిసినెస్ సెల్ కన్వీనర్ నమిలి నరసింములు,యూత్ ప్రెసిడెంట్ గుమ్మడి రాజు యకయ్య,బీఆర్ఎస్ నాయకులు మచ్చ రవీందర్,పిల్లల తిరుపతి, ఒరుగంటి రమేష్ రజక సంగం నాయకులు తదితరులు పాల్గొన్నారు.

27 న రజతోత్సవ సభను విజయవంతం చేయండి.

27 న రజతోత్సవ సభను విజయవంతం చేయండి

బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు మోతె కర్ణాకర్ రెడ్డి

గణపురం నేటి ధాత్రి

 

 

 

గణపురం మండలం కొండాపూర్ వెంకటేశ్వర్ పల్లె గ్రామాలలోభూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆదేశాల మేరకు బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ మహా సభకు అధిక సంఖ్యలో పాల్గొనేలా కార్యకర్తల ను సమాయత్తం చేస్తూ రోజు ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న గణపురం మండల పార్టీ మండల అధ్యక్షులు మోతె కరుణాకర్ రెడ్డి

రజతోత్సవ సభను విజయవంతం చేయండి.

రజతోత్సవ సభను విజయవంతం చేయండి

మహిళా ప్రధాన కార్యదర్శి సాంబరాజు జ్యోతి

పరకాల నేటిధాత్రి

 

 

హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఈ నెల 27న నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయ వంతం చేయాలని పరకాల పట్టణ మహిళా కమిటీ ప్రధాన కార్యదర్శి సాంబరాజు జ్యోతి పిలుపునిచ్చారు.ఈ సందర్బంగా జ్యోతి మాట్లాడుతూ నిధులు,నీరు,నియామకాల్లో అనే నినాదలతో 25 ఏళ్ల క్రితం తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భవించిందన్నారు.తెలంగాణ సాధన కోసం బీఆర్ఆఎస్ పుట్టిందని అన్నారు.పార్టీ ఏర్పాటు నుంచి ప్రత్యేక రాష్ట్ర సాధన దిశగా అడుగులు వేసిందని రాష్ట్ర సాధనే లక్ష్యంగా కేసీఆర్ పోరాడారని గుర్తుచేశారు.పరకాల పట్టణం నుండి సభకు నాయకులు,మహిళా నాయకురాళ్లు,కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని కోరారు.

చందాలు వేసుకొని రజితోత్సవ.!

వృద్ధులు లబ్ధిదారుల గుండెల్లో కేసీఆర్..

చందాలు వేసుకొని రజితోత్సవ సభకు సిద్ధమయ్యారు.

వృద్ధాప్య పెన్షన్ ను రజితోత్సవ సభకు విరాళమివ్వడం అభినందనీయం.

వితంతు వృద్ధురాలు నీలమ్మను అభినందించిన మాజీ ఎమ్మెల్యే పెద్ది..

నర్సంపేట నేటిధాత్రి:

 

గత అసెంబ్లీ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీకి సీట్లు తక్కువ వచ్చి ప్రభుత్వాన్ని చేజార్చుకోవడం అటు ఇటు అయినప్పటికీ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అందించిన సంక్షేమ పథకాలతో వృద్ధులలో, ప్రజల గుండెల్లో నిలిచిపోయారని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే తెలంగాణ ఉద్యమ నేత, పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. ఈనెల 27న కెసిఆర్ తలపెట్టిన బిఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లాలో భారీ ఎత్తున జరగనున్న నేపథ్యంలో అందుకు అయ్యే ఖర్చులకోసం వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం రూరల్ మండలంలోని చంద్రయ్యపల్లి గ్రామానికి చెందిన బయ్య నీలమ్మ అనే వితంతు మహిళ తనకు నెలకు రూ.2 వేల చొప్పున కేసీఆర్ అందించిన పెన్షన్ ను తన కుమారుడు భయ్యా నవీన్ తో కలిసి నర్సంపేట పట్టణంలో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అందజేసింది.ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే పెద్ది మాట్లాడుతూ గత శాసనసభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఇకనుండి టిఆర్ఎస్ పార్టీ తెలంగాణలో తుడిచి పెట్టకపోతుందని మూర్ఖులకు నిరుపేద కుటుంబానికి చెందిన వితంతు మహిళా తన ఒక నెల పెన్షన్ ను విరాళంగా ఇవ్వడం,వృద్ధులు,ప్రజలు, పేదోళ్ల గుండెల్లో మాజీ సీఎం కేసీఆర్ పాతుకుపోయారని అందుకు ఈ సంఘటన ఉదాహరణ బయ్య నీలమ్మ అని ఎమ్మెల్యే పెద్ది వివరించారు.

BRS Silver Jubilee Celebration.

కెసిఆర్ అందించిన సంక్షేమ పథకాలు, పెన్షన్ దారులు, రోజువారి కూలీలు సైతం రోజువారి కూలీ డబ్బులు,చందాలను, కెసిఆర్ వల్ల పొందిన పెన్షన్లు ఇతర లబ్ధిలను పోగుచేసుకొని గ్రామ గ్రామాల నుండి రజితోత్సవ సభకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారని మాజీ ఎమ్మెల్యే పేర్కొన్నారు.నర్సంపేట మండలం చంద్రయ్యపల్లి గ్రామం నిరుపేద కుటుంబానికి చెందిన వితంతు వృద్ధ మహిళ బయ్య నీలమ్మ తను కెసిఆర్ వల్ల లబ్ధిపొందానని కృతజ్ఞతతో ఒక నెల పెన్షన్ 2000 రూపాయలను రజితోత్సవ సభ నిర్వహణ ఖర్చు కోసం విరాళంగా అందించడం అభినందనీయమని ఈ సందర్భంగా పెద్ది సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు. విరాళం అందించిన నీలమ్మ కుటుంబానికి బిఆర్ఎస్ పార్టీ తగిన గుర్తింపు ఇస్తుందని బిఆర్ఎస్ ఉద్యమ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ రాష్ట్ర మాజీ డైరెక్టర్ రాయిడి రవీందర్ రెడ్డి, మాజీ ఎంపీపీ వేములపల్లి ప్రకాష్ రావు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బత్తిని శ్రీనివాస్ గౌడ్, ఒడిసి ఎంఎస్ మాజీ చైర్మన్ రామస్వామి నాయక్,మాజీ కౌన్సిలర్లు, నాగిశెట్టి పద్మ ప్రసాద్,దేవోజు తిరుమల సదానందం,పాషా, బిఆర్టియు జిల్లా అధ్యక్షుడు గోనే యువరాజు నాయకులు పాల్గొన్నారు.

బిఆర్ఎస్ రజతోత్సవ సభకు వితంతు మహిళా పెన్షన్ విరాళం.

BRS Silver Jubilee Celebration.

 

నర్సంపేట మండలంలోని చంద్రయ్యపల్లి గ్రామానికి చెందిన బయ్య నీలమ్మ అనే వితంతు మహిళా బిఆర్ఎస్ అధినేత,తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అందించిన రూ. 2 016 పెన్షన్ ను అందుకు కృతజ్ఞతగా వరంగల్ జిల్లాలో తలబెట్టబోయే బిఆర్ఎస్ పార్టీ రజితోత్సవ సభకు విరాళంగా రూ.2 వేల16 ఒక నెల పెన్షన్ ను నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సోమవారం నర్సంపేట పట్టణంలోని అందజేశారు.
ఈ సందర్భంగా వితంతు ఫెన్షన్ దారురాలు నీలమ్మ మాట్లాడుతూ తెలంగాణ రాకముందు గత ప్రభుత్వాలు నెలకు 200 మాత్రమే పెన్షన్ ఇచ్చేవారని తెలిపారు.నేడు కేసీఆర్ ప్రభుత్వం నుండి 2 వేల రూపాయల పెన్షన్ తో నెల రోజుల పాటు గడిచే విధంగా అనుకూలంగా ఉందని అన్నారు.పెన్షన్ దారులకు ప్రతీ నెల క్రమం తప్పకుండా అందించిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ ఖర్చుల కోసం తన వంతుగా కృతజ్ఞతతో అందించినట్లు నీలమ్మ పేర్కొన్నారు.అనంతరం మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి నీలమ్మను  అభినందించారు.

రజితోత్సవ సభను విజయవంతం చేయండి

రజితోత్సవ సభను విజయవంతం చేయండి

జైపూర్,నేటి ధాత్రి :

లక్షలాదిగా తరలి వచ్చి బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని చెన్నూరు నియోజకవర్గం బీఆర్ఎస్ శ్రేణులు కోరారు.స్థానిక నియోజకవర్గం కోటపల్లి మండలంలోని సర్వాయిపేట గ్రామంలో బీఆర్ఎస్ చలో వరంగల్ బహిరంగ సభ వాల్ పోస్టర్లను శుక్రవారం విడుదల చేశారు.చలో ఎల్కతుర్తి,వరంగల్ భారీ బహిరంగ సభ ఏర్పాట్లలలో భాగంగా వివిధ కార్యక్రమాలు నియోజవర్గ పరిధిలో చేపడుతున్నమన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెద్దపల్లి మాజీ పార్లమెంటు సభ్యులు,మాజీ ప్రభుత్వ విప్,బీఆర్ఎస్ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ ఆదేశాల మేరకు ఏప్రిల్ 27 న వరంగల్ లో జరిగే బహిరంగ సభకు లక్షలాదిగా జనం తరలి రావాలన్నారు.పార్టీ ఏర్పడి విజయవంతంగా రెండు దశాబ్దాల నర పూర్తయిన సందర్భంగా 25 సంవత్సరాల గులాబీ పండుగ వేడుకల్లో ప్రతి ఒక్కరూ తరలి రావాలని నియోజకవర్గ ప్రజలను కోరారు.ఉద్యమ స్ఫూర్తితో ఓరుగల్లుకు దండై కదులుదామని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సోషల్ మీడియా బాపు నాయక్,రాజ్ కుమార్ యాదవ్,దుర్గం రాజేందర్,దుర్గం సంపత్,సప్ప భాస్కర్,జిమిడి సాగర్,దుర్గం రోహిత్,జిమిడి చంద్రయ్య,బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.

బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేద్దాం…

బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేద్దాం…

బిఆర్ఎస్ నియోజక వర్గ ఇన్చార్జి రాజా రమేష్

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

 

ఈనెల 27న ఎల్కతుర్తి లో జరిగే బిఆర్ఎస్ రజతోత్సవ మహాసభను విజయవంతం చేయాలని చెన్నూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ రాజా రమేష్ అన్నారు.బుదవారం రామకృష్ణాపూర్ పట్టణంలో సభకు సంబంధించి కేసీఆర్ వాల్ రైటింగ్ తో ప్రజలను, బిఆర్ఎస్ పార్టీ శ్రేణులను ఉత్సాహపరిచారు.అనంతరం రాజా రమేష్ మాట్లాడుతూ..

BRS Silver Jubilee Celebration

మున్సిపాలిటీలోని 14,15,17,18,20 వార్డు లలో వాల్ పోస్టర్లను అంటించడం అంటించారు.ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు కంభగోని సుదర్శన్ గౌడ్,బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు రామిడి కుమార్, బడికల సంపత్,ఆలుగుల సత్తయ్య,మాజీ కౌన్సిలర్లు పోగుల మల్లయ్య,బోయినపల్లి అనిల్ రావు,రేవెల్లి ఓదెలు, జిలకర మహేష్,పారుపల్లి తిరుపతి,గడ్డం రాజు, చంద్రమౌళి, లక్ష్మారెడ్డి,రంగరాజు,పైతారి ఓదెలు,మేకల రమేష్,వేనంక శ్రీనివాస్, బిఆర్ఎస్ పార్టీ యువ నాయకులు రామిడి లక్ష్మీకాంత్,ఆశనవేణి సత్యనారాయణ,టైలర్ రాజు,చంద్ర కిరణ్,కుర్మ దినేష్,దేవి సాయి కృష్ణ, శివ,మణి, గోనె రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.

రజతోత్సవ సభను విజయవంతం చేద్దాం.

ప్రజలారా కథం కథం తొక్కి బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభను విజయవంతం చేద్దాం

-మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి

శాయంపేట నేటిధాత్రి:

 

శాయంపేట మండలంలోని పలు గ్రామాల్లో ఛలో వరంగల్ సభను విజయవంతం కొరకు పలు గ్రామాల్లో మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పర్య టిస్తున్నారు.ఈ నెల 27న జరగనున్న బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకలను జయ ప్రదం చేసే దిశగా ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సన్నాహక సమావేశంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ 2001 ఏప్రిల్ 27 నాడు కెసిఆర్ ఆ రోజు తన పదవికి రాజీనామా చేసి సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయాలను చూసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కలిసి ఉంటే లాభం లేదు తెలంగాణ రాష్ట్రం ఏర్పడితేనే ఈ ప్రాంతానికి న్యాయం జరుగుతున్నటు వంటి ఒక లక్ష్యం తోటి కేసిఆర్ పార్టీ పెట్టడం జరిగింది. పార్టీ పెట్టి 24 సంవత్సరాలు పూర్త యి 25వ సంవత్సరాల్లో అడు గుపెడుతున్న సందర్భంగా పార్టీ రజతోత్సవ సభను నిర్వ హించాలని చెప్పి నిర్ణయం చేసి, అది కూడా మనం నా భూతో నా భవిష్యత్ అనేలా పెద్ద సభను నిర్వహిస్తున్నాం.

BRS party’s

 

భవిష్యత్ లో ఇంత పెద్ద మొత్తంలో ఎవరూ నిర్వహించ లేరు. మరి ప్రజలు కూడా ఆవిర్బవాసభకు రావడానికి ఉత్సాహంగా ఉన్నారు. ఇంత తక్కువ సమయంలో ఇంత వ్యతిరేకతను చవిచూసినటు వంటి ప్రభుత్వాలు ఉండవు, దానికి కారణమేంటంటే అమ లు కానీ హామీలు ఇచ్చి, హామీలను తుంగలో తొక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తున్నటు వంటి తీరు ప్రజలలో అసహనానికి గురిచేస్తుంది.కేసిఆర్ అధికా రంలో ఉన్నప్పుడు ఏ స్కీమ్స్ అయితే అమలు అయినవో వాటినే అమలు చేస్తున్నారు. ఎట్లా ఉన్నది పరిపాలన అంటే మరి అనుభవం లేని పరిపా లన, అసమర్ధ పరిపాలన, చేత గాని వ్యవహారం ఇవన్నీ చేసు కుంటుప్రజల దగ్గరికి వస్తే అర్థం చేసుకున్నారు.ప్రజలు కేసీఆర్ ఉన్నప్పుడు ఏ రకంగా మా యొక్క జీవితాలు అద్భుతంగా ఉన్నాయి.

ఏ రకమైనటువంటి అభివృద్ధి జరిగింది అని నేడు పునరాలోచించుకుంటున్నారు. ఎప్పుడైనా సామెత ఉంటాది పాలు ఇచ్చే గేదెను కాదని దున్నపోతును తెచ్చుకున్నట్టు ఉంది అన్న చందనంగా ప్రజలు చర్చించుకుంటున్నారు.రేపు ఎన్నిక ఏదైనా ఎగిరేది బిఆర్ ఎస్ జెండానే గెలిచేది బిఆర్ ఎస్ అభ్యర్దులే.

ఈ ఏప్రిల్ 27న జరగబోయే మన సభా తెలం గాణ రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులు వస్తాయి. కాబట్టి మిత్రులారా కథం కథం తొక్కి బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభను విజయ వంతం చేయాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో అన్ని గ్రామాల బీఆర్ఎస్ కార్యకర్తలు అభిమానులు ప్రజలు పాల్గొన్నారు.

రజతోత్సవ సభకు వాల్ రైటింగ్ కార్యక్రమం ప్రారంభం.!

చలో వరంగల్ బిఆర్ఎస్ రజతోత్సవ సభకు వాల్ రైటింగ్ కార్యక్రమం ప్రారంభం

జహీరాబాద్ . నేటి ధాత్రి:

 

 

27న వరంగల్‌లో జరగనున్న బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభను విజయవంతం చేయడంలో భాగంగా వాల్ రైటింగ్ కార్యక్రమాన్ని శాసనసభ్యులు కోనింటి మాణిక్ రావు ప్రారంభించారు. సభకు పూర్వాహ్నం నుంచి ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు, పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఈ కార్యక్రమం చేపట్టబడింది అని.

MLA Manikrao

 

వాల్ రైటింగ్ ప్రారంభోత్సవం సందర్భంగా జహీరాబాద్ పట్టణ బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు నామ రవికిరణ్,మాజి కౌన్సిలర్ అబ్దుల్లా ,మాజి పట్టణ అధ్యక్షులు యాకూబ్, మొహీ ఉద్దీన్,తులసి దాస్ గుప్తా,యువ నాయకులు మిథున్ రాజ్ ,ప్రభు ,
ఇతర బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
పార్టీ విజయ రథాన్ని ముందుకు నడిపేందుకు ప్రతి కార్యకర్త ఈ రజతోత్సవ సభను విజయవంతం చేయాల్సిన అవసరం ఉందని ఎమ్మల్యే మాణిక్ రావు గారు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

రజతోత్సవ సభను జయప్రదం చేయాలి.

రజతోత్సవ సభను జయప్రదం చేయాలి.

#మండల పార్టీ అధ్యక్షుడు డాక్టర్ బానోత్ సారంగపాణి.

నల్లబెల్లి, నేటి ధాత్రి

silver

ఈనెల 27న వరంగల్ జిల్లాలో జరిగే బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని మండల పార్టీ అధ్యక్షుడు బానోతు సారంగపాణి పిలుపునిచ్చారు. శనివారం మండలంలోని శనిగరం, ఆర్వయ పల్లె, కన్నారావుపేట గ్రామాలలో పార్టీ రజతోత్సవ సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో పార్టీని స్థాపించి 25 ఏళ్లు దిగ్విజయంగా పూర్తి చేసుకున్న సందర్భంగా రజతోత్సవ సభను వరంగల్ జిల్లాలోని ఎలుకతుర్తి లో ఏర్పాటు చేయడం జరిగిందని. తెలంగాణ సాధించిన తర్వాత 10 ఏళ్లలో రాష్ట్ర అభివృద్ధికి పాటుపడిన పార్టీ బిఆర్ఎస్ అని కొనియాడారు. కావున నర్సంపేట నియోజకవర్గం నుండి మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో సభను విజయవంతం చేయడం కోసం మండలంలోని పార్టీ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని రజతోత్సవ సభను జయప్రదం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఫ్యాక్స్ చైర్మన్ చెట్టుపల్లి మురళీధర్ రావు, మాజీ ఎంపీపీ కక్కెర్ల శ్రీనివాస్ గౌడ్, మాజీ జెడ్పిటిసి బానోతు హరినాథ్ సింగ్, క్లస్టర్ బాధ్యులు గందె శ్రీనివాస్ గుప్తా, ఇంగ్లీ శివాజీ, పిఎసిఎస్ వైస్ చైర్మన్ తక్కలపల్లి మోహన్ రావు, మాజీ సర్పంచ్ నాన్న బోయిన రాజారాం యాదవ్, నాయకులు మంద రాజిరెడ్డి, తిప్పని రవీందర్ గౌడ్, ఊట్కూరి అశోక్ గౌడ్, భూక్య బాలరాజు, మాడిశెట్టి రవి, తంగెళ్ల రవీందర్ రెడ్డి, పూజారి రాజు గౌడ్, మాజీ వార్డ్ మెంబర్లు పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

బీఆర్ఎస్ రజతోత్సవ సభ జయప్రదం చేద్దాం ఎమ్మెల్యే.!

బీఆర్ఎస్ రజతోత్సవ సభ జయప్రదం చేద్దాం ఎమ్మెల్యే మాణిక్ రావు

◆ఈనెల 27 న ఎల్కతుర్తి లో జరిగే సభను కలిసి కట్టుగా విజయవంతం చెయ్యాలి

◆కోహిర్ మండల పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొనాలని శాసనసభ్యులు కోనింటీ మాణిక్ రావు అన్నారు.

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

 

మాజి మంత్రివర్యులు సిద్దిపేట శాసనసభ్యులు తన్నీరు హరీష్ రావు గారి ఆదేశాల మేరకు, శనివారము మండలంలోని ఎస్ఎస్ ఫంక్షన్ హాలులో మండల బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.బీఆర్ఎస్ రజతోత్సవ బహిరంగ సభ రాష్ట్రంలో కనీవినీ ఎరుగని రీతిలో జరుగుతుందని అన్నారు. 10 లక్షల మంది తో జరిగే సభకు గ్రామ గ్రామం నుంచి పార్టీ కార్యకర్తలు బయలుదేరి రావాలని పిలుపునిచ్చారు.రజతోత్సవ సభ రాష్ట్రంలో గులాబీ పండగ వలె జరుపుకుంటున్నామని.. ఈ పండుగలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు.

MLA Manik Rao

 

కోహిర్ మండలం నుండి పెద్ద ఎత్తున కదలిరావాలని ఎమ్మెల్యే మాణిక్ రావు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మాజి మార్కెట్ చైర్మన్ రామకృష్ణ రెడ్డి,కొహిర్ మండల పార్టీ అధ్యక్షులు నర్సింలు , జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ, మొగుడంపల్లి మండల పార్టీ అధ్యక్షులు సంజీవ్ రెడ్డి,ఝరసంఘం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం,మాజి జహీరాబాద్ పట్టణ అధ్యక్షులు మొహిద్దీన్ , ఎస్సీ సెల్ నియోజకవర్గ అధ్యక్షులు బండి మోహన్,మాజి కేతకీ ఆలయ చైర్మన్ నర్సింహ గౌడ్,
సీనియర్ నాయకులు కలీం, కొహిర్ పట్టణ అధ్యక్షులు ఇఫ్టేకార్,యువ నాయకులు మిథున్ రాజ్,మాజి సర్పంచ్ ఫోరమ్ అధ్యక్షులు రవికిరణ్ ,మాజి సర్పంచ్ లు నర్సింలు , మొలయ్య,రమేష్ ,మాజి ఎంపీటీసీ లు సంపత్,విఠల్ రెడ్డి ,నాయకులు నర్సింహ రెడ్డి,మాజి విజిలెన్స్ కమిషన్ మెంబర్ రామకృష్ణ బంటు,గ్రామ పార్టీ అధ్యక్షులు & కార్యవర్గం ,ముఖ్య నాయకులు ,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

రజతోత్సవ సభను జయప్రదం చేయాలి.

రజతోత్సవ సభను జయప్రదం చేయాలి

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

ఈనెల 27న వరంగల్ జిల్లాలో జరిగే బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభను జయప్రదం చేయాలని పార్టీ క్లస్టర్ ఇంఛార్జి, న్యాయవాది మోటురి రవి కోరారు. అందుకు సంబంధించిన గోడ పత్రికలను నర్సంపేట మండలలోని జి.జి.ఆర్ పల్లె(గుర్రాల గండి రాజపల్లి)గ్రామంలో ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మోటురి రవి మాట్లాడుతూ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వములో పార్టిని స్థాపించి 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రజతోత్సవ సభను ఏర్పాటు చేస్తుందన్నారు.తెలంగాణ సాధించిన 10 ఏళ్లలో రాష్ట్ర అభిృద్ధికి పాటుపడిన పార్టీ బిఆర్ఎస్ అని కొనియాడారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ తుత్తురు కోమల – రమేశ్,మాజీ ఎంపీటీసీ బండారి శ్రీలత – రమేశ్,గ్రామ పార్టి ప్రధాన కార్యదర్శి పురాణి రవీందర్,మండల పార్టీ ఉపధ్యక్షుడు అల్లి రవి,యాదవ సంఘం అధ్యక్షుడు తుత్తురు సాంబయ్య,మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు పత్రీ కుమారస్వామి,మండల నాయకుడు కత్తుల కుమారస్వామి,గురిజాల గౌడ సంఘం అధ్యక్షుడు మంచిక దేవేందర్,దుగ్గొండి మండల యూత్ నాయకుడు బాణోత్ జై కుమార్,గురిజాల ఎస్ఎంసి మాజీ ఛైర్మన్ కొమ్మ రవి,తుత్తురు వెంకటేష్,గుంటూర్ పల్లి గ్రామ ఇన్చార్జి సంగెం శ్రీకాంత్,తుత్తురు దేవేందర్,మూలం రాజు,జక్కుల అనిల్,మంద బాలయ్య,బర్ల కుమారస్వామి,జక్కుల కనకయ్య,పురాని ఎల్లయ్య,మూలం ఐలయ్య తదితరులు ఉన్నారు.

రజతోత్సవ సభను పల్లె పల్లె కదలాలి

రజతోత్సవ సభను పల్లె పల్లె కదలాలి

బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు చింతిరెడ్డి మధుసూధన్ రెడ్డి

పరకాల నేటిధాత్రి

మంగళవారం రోజున బిఆర్ఎస్ పరకాల మండల పార్టీ అధ్యక్షులు చింతిరెడ్డి మధుసుధన్ రెడ్డి మాట్లాడుతూ ఈనెల 27న ఎల్కతుర్తిలో నిర్వహించే బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభను విజయవంతం చేయాలనీ ఈ మహోత్తర కార్యక్రమానికి పల్లెలు పట్టణాల ప్రజలు కదిలిరావాలని ఈ సభతో రాష్ట్రంలో మళ్ళీ బిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాబోతుందనే సత్త చూపించాలని కోరారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version