మహాత్మ జ్యోతిరావు ఫూలే జయంతి వేడుకలు

మహాత్మ జ్యోతిరావు ఫూలే జయంతి వేడుకలు

భూపాలపల్లి నేటిధాత్రి

 

బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో భూపాలపల్లి జిల్లా కేంద్రంలో మహాత్మ జ్యోతిరావు ఫూలే 199వ జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించిబీసీ జేఏసీ చైర్మన్ పైడిపల్లి రమేష్ గారు మాట్లాడుతూ సమాజంలో విద్య కోసం, మహిళల కోసం పోరాటం చేసిన మహనీయుడు మహాత్మ జ్యోతిరావు ఫూలే అన్నారు. ఈ కార్యక్రమ విశిష్ట అతిథి జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు తాటికంటి రవికుమార్ మాట్లాడుతూ ఈ సమాజంలో బీసీల కోసం పోరాటం చేసిన గొప్ప నాయకు ఫూడులే మార్గం లో బీసీల కోసం బీసీల హక్కుల కోసం బీసీ రిజర్వేషన్లు అమలు చేసే వరకు పోరాటం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమా నిర్వాహక అధ్యక్షులు కొత్తూరి రవీందర్ మాట్లాడుతూ సామాజిక రాజకీయ సాంస్కృతిక మార్పు తీసుకువచ్చినటువంటి ఆధునిక విప్లవకారుడు ముదిరాజ్ ముద్దుబిడ్డ మహాత్మ జ్యోతిరావు ఫూలే 199 వ జయంతి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. అంతేకాకుండా సమాజంలో అట్టడుగు వర్గాలు శూద్రులు మహిళల అభ్యున్నతి కోసం సత్యశోధక్ సమాజ్ అనే సంఘాన్ని ఏర్పాటు చేసి సమాజంలో విప్లవాత్మకమైనటువంటి మార్పు తీసుకొచ్చినటువంటి మహనీయుడు మహాత్మ జ్యోతిరావు ఫూలే అదేవిధంగా ఫూలే రాసినటువంటి గులాంగిరి గ్రంథాన్ని ఈ జిల్లాలో ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలు తప్పకుండా చదవాలని పిలుపునివ్వడం జరిగింది.

ఈ కార్యక్రమంలో బిసి ఏసి ఎస్టీ జిల్లా నాయకులు దొంగల రాజేందర్ యాదవ్, బీసీ సంక్షేమ సంఘం జిల్లా కన్వీనర్ భీమనాధుని సత్యనారాయణ,ముత్యాల రవికుమార్ నాయి, గోపరాజు రాజు రజక, పెంట సదన్న యాదవ్, సర్వేశం, చిత్తారి రాజేష్, వంగపండ్ల రాజయ్య యాదవ్,బీసీ జిల్లా యూత్ అధ్యక్షులు మద్దెల విజయ్ గౌడ్, రాజయ్య, పెంజల రమేష్, లక్ష్మయ్య, గీసా సంపత్, వెయ్యిగండ్ల తిరుపతి నాయి మంద రమేష్ పుల్ల అశోక్ నద్దునూరి రాజ్ కుమార్ పర్లపల్లి వంశీ చిలుముల కృష్ణ కొయ్యాడరమేష్ మందపెల్లి హరీష్ తదితరులు పాల్గొన్నారు

జ్యోతిరావు ఫూలే సేవలు చిరస్మరణీయం..

జ్యోతిరావు ఫూలే సేవలు చిరస్మరణీయం

ఆమూదాలపల్లి మల్లేశం గౌడ్

పరకాల,నేటిధాత్రి

జ్యోతిరావు పూలే సమాజంలో సమానత్వం,విద్యా విస్తరణ కోసం బాపులే చేసిన కృషి చిరస్మరణీయమని ఆయన ఆముదాలపల్లి మల్లేశం గౌడ్ తెలిపారు.అణగారిన వర్గాలకు విద్య అందించాలనే లక్ష్యంతో ఆయన ప్రారంభించిన ఉద్యమం దేశ సామాజిక వ్యవస్థలో మార్పుకు దోహదపడిందని పేర్కొన్నారు.ప్రతి ఒక్కరికీ సమాన అవకాశాలు కల్పించాలనే బాపులే ఆశయం నేటికీ మార్గదర్శకంగా నిలుస్తోందని వెల్లడించారు.మహిళా విద్యకు ప్రాధాన్యతనిస్తూ సావిత్రిబాయ్ ఫూలేతో కలిసి చేసిన సేవలు భారత సమాజానికి ఆదర్శంగా నిలిచాయని తెలిపారు.ప్రస్తుత తరానికి బాపులే ఆలోచనలు స్ఫూర్తిగా నిలవాలని,వాటిని ఆచరణలో పెట్టాల్సిన అవసరం ఉందని మల్లేశం గౌడ్ సూచించారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version