స్థానిక ఎన్నికల బరిలో అభ్యర్థులు: జీరో బ్యాలెన్స్ ఖాతాల కోసం బ్యాంకుల ముందు బారులు.

స్థానిక ఎన్నికల బరిలో అభ్యర్థులు: జీరో బ్యాలెన్స్ ఖాతాల కోసం బ్యాంకుల ముందు బారులు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ ప్రక్రియ నేపథ్యంలో, సర్పంచ్, వార్డు సభ్యులుగా పోటీ చేయాలనుకునే అభ్యర్థులు ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం జీరో బ్యాలెన్స్ ఖాతాలు తెరవడానికి బ్యాంకులు, పోస్ట్ ఆఫీసులను ఆశ్రయిస్తున్నారు. జహీరాబాద్ కోహిర్ మొగుడంపల్లి న్యాల్కల్ ఝరాసంగం డీసీబీ, ఎస్బీఐ, కెనరా ఎస్బిఐ యూనియన్ బ్యాంకులు, పోస్ట్ ఆఫీస్ కార్యాలయాలు అభ్యర్థులు, వారి అనుచరులతో రద్దీగా మారాయి. రేపటి నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుండటంతో ఈ సందడి నెలకొంది. ఎన్నికల నియమాల ప్రకారం, అభ్యర్థులు తమ ఖర్చుల కోసం ప్రత్యేక ఖాతాలు తెరవాలి, వాటిలో జీరో బ్యాలెన్స్ ఉండాలి.

సైకిల్ కోసం బ్యాంకుకు వెళ్లిన చిన్నారులు.. బంగారు తాకట్టు పెడతామని హామీ…

సైకిల్ కోసం బ్యాంకుకు వెళ్లిన చిన్నారులు.. బంగారు తాకట్టు పెడతామని హామీ

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఝరాసంగం : సంగారెడ్డి జిల్లా ఝరాసంగం
మండలం బర్దిపూర్ గ్రామానికి చెందిన ఇద్దరు చిన్నారులు సైకిల్ కొనేందుకు డబ్బు కావాలని స్థానిక కెనరా బ్యాంకుకు వెళ్లి లోన్ అడగడం బ్యాంకు కస్టమర్లను ఆశ్చర్యానికి గురిచేసింది. గ్రామానికి చెందిన చిన్నారులు దేవాల్ష్, రహస్యలు తమ తల్లి సునీతతో కలిసి బ్యాంకుకు వెళ్లారు. బ్యాంకులో డబ్బులు ఇస్తారట అని తెలుసుకుని నేరుగా బ్యాంకు మేనేజర్ వద్దకు వెళ్లి మాకు సైకిల్ కొనేందుకు డబ్బులు కావాలి అని అడిగారు. అప్పుడే ఆశ్చర్యానికి గురైన మేనేజర్, బ్యాంకులో ఏదైనా తాకట్టు పెట్టాలి మీ దగ్గర ఏముంది అని ప్రశ్నించాడు. దానికి చిన్నారులు “మా దగ్గర భూమి ఉంది బంగారం కూడా ఉంది అని అమాయకంగా సమాధానం ఇవ్వడంతో మేనేజర్ నవ్వుతో పాటు ఆనందానికి గురయ్యాడు. వారి అమాయకపు సమాధానం విన్న సిబ్బంది, అక్కడ ఉన్న కస్టమర్లు నవ్వులు పూయించగా.. చిన్నారులను ప్రేమగా పలకరించి ఇంటికి పంపించారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version