సీజనల్ వ్యాధులపై అవగాహన శిబిరం

సీజనల్ వ్యాధులపై
జాగ్రత్తలు పాటించాలి

నిజాంపేట: నేటి ధాత్రి

 

సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు జాగ్రత్తలు పాటించాలని కార్యదర్శి ప్రశాంత్ అన్నారు. నిజాంపేట మండలం రజక్ పల్లి గ్రామంలో బుధవారం ఏఎన్ఎం అరుణ ఆధ్వర్యంలో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. గోరువెచ్చటి నీటిని త్రాగాలని సూచించారు. ఈ వైద్య శిబిరంలో బీపీ, షుగర్ పరీక్షలు నిర్వహించారు.

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత మధుమేహం,బిపి పరీక్షలు…

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత మధుమేహం,బిపి పరీక్షలు

తాండూరు( మంచిర్యాల) నేటి ధాత్రి :

 

 

మాదారం పోలీస్ స్టేషన్ గ్రౌండ్ లో ఓపెన్ జిమ్ వద్ద తాండూర్ తెలంగాణ లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో 46 మందికి మధుమేహం(షుగర్) బి.పి పరీక్షలు ఉచితంగా చేపించారు.మధుమేహం (షుగర్) బీపీ ఉన్నవారికి జాగ్రత్తలు తెలిపారు.ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు దేవరకొండ రాజయ్య,ఉపాధ్యక్షులు ఠాగూర్ ఉమ్రాసింగ్,మద్దికుంట రామచందర్,క్యాబినెట్ మెంబర్ రౌతు వెంకటేశం, తాటిపాముల సాంబమూర్తి ,గందె రాజన్న, తొగరు శ్రీనివాస్,ల్యాబ్ టెక్నీషియన్ వేణు,వాకర్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version