లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత మధుమేహం,బిపి పరీక్షలు
తాండూరు( మంచిర్యాల) నేటి ధాత్రి :
మాదారం పోలీస్ స్టేషన్ గ్రౌండ్ లో ఓపెన్ జిమ్ వద్ద తాండూర్ తెలంగాణ లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో 46 మందికి మధుమేహం(షుగర్) బి.పి పరీక్షలు ఉచితంగా చేపించారు.మధుమేహం (షుగర్) బీపీ ఉన్నవారికి జాగ్రత్తలు తెలిపారు.ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు దేవరకొండ రాజయ్య,ఉపాధ్యక్షులు ఠాగూర్ ఉమ్రాసింగ్,మద్దికుంట రామచందర్,క్యాబినెట్ మెంబర్ రౌతు వెంకటేశం, తాటిపాముల సాంబమూర్తి ,గందె రాజన్న, తొగరు శ్రీనివాస్,ల్యాబ్ టెక్నీషియన్ వేణు,వాకర్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.