బంజారుపల్లిలో విద్యార్థులతో సహవంక్తి భోజనం చేసిన సర్పంచ్
# నెక్కొండ, నేటి ధాత్రి:
బంజారుపల్లి గ్రామంలోని ఎంపీ యూపీఎస్ పాఠశాలను సర్పంచ్ రమేష్ రాథోడ్, పంచాయతీ కార్యదర్శి రాజశేఖర్ సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలో అమలు అవుతున్న మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించి, విద్యార్థులతో కలిసి సహవంక్తి భోజనంలో పాల్గొన్నారు.
సర్పంచ్ మాట్లాడుతూ ప్రభుత్వ మధ్యాహ్న భోజన పథకం నిరుపేద విద్యార్థులకు ఎంతో ఉపయోగకరమని, పోషకాహారంతో కూడిన ఆహారం అందించడం ద్వారా వారి ఆరోగ్యం, విద్యాభివృద్ధికి తోడ్పడుతుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, పంచాయతీ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
