డైరెక్ట్ మార్కెట్ సేలింగ్ లో తీసుకెళ్తున్న వెస్టేజ్ కంపెనీ
మంచిర్యాల,నేటి ధాత్రి:
మంచిర్యాల జిల్లా పద్మావతి గార్డెన్ లో బుధవారం ఏర్పాటు చేసిన వెస్టీజ్ డైరెక్ట్ మార్కెట్ సేలింగ్ కంపెనీ లో వి.ఎం.సి.ఎం సుబ్బయ్య శెట్టి,వి.ఎం.సి.ఎం ఎమ్.ఎస్.ఆర్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..వెస్టీజ్ కంపెనీ తన కార్యకలాపాలను 2004 సంవత్సరంలో న్యూఢిల్లీ,బెంగళూరులోని కార్యాలయంలో ప్రారంభించి ఇది ప్రపంచ స్థాయి ఆరోగ్య వ్యక్తిగత,సంరక్షణ ఉత్పత్తులను డీల్ చేస్తూ నేడు దేశంలోని ప్రతి మూల మూలాన సంచరించిందని అన్నారు.భారతదేశంలోని అతిపెద్ద ప్రత్యక్ష అమ్మకాల కంపెనీలో ఒకటైన వెస్టీజ్ మార్కెటింగ్ లిమిటెడ్ సహా వ్యవస్థాపకుడు,మేనేజింగ్ డైరెక్టర్ గౌతమ్ బాలి,డైరెక్టర్స్ కన్వర్ బీర్ సింగ్,దీపక్ సూద్ 2004లో ప్రారంభమైనప్పటి నుండి 21 సంవత్సరాలు కార్యకలాపాలను పూర్తిచేసిన ఈ కంపెనీ ప్రస్తుతం ఇండియా తో పాటు దుబాయ్, బహ్రెయిన్,ఒమన్,సౌదీ అరేబియా,యుఏఇ,నేపాల్, బంగ్లాదేశ్ లలో ఉనికి కలిగి ఉందని వారు తెలిపారు. వెస్టీజ్ కంపెనీలో ఇప్పటివరకు భారతీయులు 5 కోట్ల మంది పని చేస్తూ ఉపాధి పొందుతున్నారని తెలిపారు.ఈ కంపెనీలో పనిచేయడానికి ఎలాంటి విద్య అర్హత గాని,ఎలాంటి పెట్టుబడి లేకుండా వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ పనిచేస్తూ లక్షలలో సంపాదించుకునే అవకాశం ఉందని వారు తెలిపారు.వెస్టీజ్ కంపెనీలోని ఉత్పత్తులు ఆరోగ్యానికి,వ్యవసాయానికి,బ్యూటీకి,హోమ్ కి సంబంధించిన ఉత్పత్తులను కొనుగోలు చేసి వాడుకుంటూ వాటితో వచ్చిన రిజల్ట్స్ ద్వారా పదిమందికి చెబుతూ ఉపాధి పొందవచ్చని తెలిపారు.ఈ ఉత్పత్తులు ఎలాంటి కెమికల్స్ వాడకుండా నాచురల్ పద్ధతిలో తయారు చేయబడ్డవని,ప్రజలు ఎలాంటి అపోహలు గురి కాకుండా అనేక ఆరోగ్య సమస్యలకు ఫుడ్ సప్లిమెంట్స్ వాడుతూ పూర్తి ఆరోగ్యవంతులుగా ఉండొచ్చని అన్నారు.
యువత కి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న వెస్టీజ్ కంపెనీ
యువతి,యువకులు ఎన్నో ఉన్నత చదువులు చదివి ఉద్యోగా అవకాశాలు లేకపోవడంతో వెస్టీజ్ కంపెనీ లో డైరెక్ట్ మార్కెటింగ్ సేలింగ్ చేస్తూ ఉపాధి పొందుతూ లక్షలలో సంపాదిస్తున్నారని అన్నారు.అలాగే రైతులు పండించే పంటలలో ఎక్కువగా క్రిమిసంహారక మందులు పిచికారి చేయడంతో భూమి పూర్తిగా కలుషితమై మనం తినే తిండి వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని తెలిపారు. ఇప్పటికైనా వెస్టీజ్ మార్గాన్ని ఎంచుకొని కంపెనీ ఏర్పరిచే ఫ్రీ ఐడి ద్వారా కంపెనీలో చేరి బిజినెస్ చేస్తూ డబ్బు సంపాదించుకోవచ్చని తెలియజేశారు.