న్యాల్కల్ లో పశు వైద్య సంరక్షణ కార్యక్రమం: రైతులకు సూచనలు
జహీరాబాద్ నేటి ధాత్రి:
న్యాల్కల్ మండలం రామతీర్థం గ్రామంలో పశు వైద్య సంరక్షణ కార్యక్రమం నిర్వహించారు. పశు వైద్యుడు డాక్టర్ గణేష్ పశువులకు వైద్య పరీక్షలు చేసి, మందులు అందించి, రైతులకు సంరక్షణపై సూచనలు చేశారు. గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, ఉప సర్పంచ్ లక్ష్మమ్మ మాట్లాడుతూ, పశువుల ఆరోగ్యం మెరుగుపడితే రైతుల ఆర్థిక స్థితి బలపడుతుందని, ఇలాంటి కార్యక్రమాలు తరచుగా జరగాలని తెలిపారు. గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని సేవలు పొందారు.
