అక్రమ ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు
గుండాల,నేటిధాత్రి :
అక్రమ ఇసుక రవాణా తవ్వకాలను అరికట్టుటకు ప్రత్యేక చర్యలు చేపట్టడం జరిగిందని గుండాల ఎస్సై సైదా రహూఫ్, తహసీల్దార్ ఖాసీం, ఫారెస్ట్ శాఖ అధికారి తెలిపారు. సోమవారం కిన్నెరసాని వాగు వద్ద సాయనపల్లి బ్రిడ్జి సమీపంలో అక్రమ ఇసుక రవాణాకు ఉపయోగించే మార్గాన్ని మూసివేయుటకు రెండు గుంతలు తవ్వించారు.నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా అక్రమంగా ఇసుక రావణా చేస్తే వెహికిల్ సీజ్ చేయటంతోపాటు చట్టపరమైన చర్యలు తీసుకోవటం జరుగుతుందని తెలిపారు.
