25 ద్విచక్ర వాహనాలు సీజ్…

25 ద్విచక్ర వాహనాలు సీజ్

మందమర్రి నేటి ధాత్రి

 

రాంగ్ రూట్ ప్రయాణంపై మందమర్రి పోలీసుల కఠిన చర్యలు: 25 ద్విచక్ర వాహనాలు సీజ్

రోడ్డు భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ ప్రజలు నిబంధనలు పాటించాలి – మందమర్రి సర్కిల్ ఇన్స్పెక్టర్ శశిధర్ రెడ్డి

రామగుండం పోలీస్ కమిషనరేట్ ఉన్నతాధికారుల ఉత్తర్వుల మేరకు మందమర్రి పోలీసులు రోడ్డు భద్రతకు భంగం కలిగించే వాహనదారులపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఇందులో భాగంగా, గత నాలుగు రోజులుగా బురద గూడెం అందుగులపేట జాతీయ రహదారిపై రాంగ్ రూట్‌లో ప్రయాణిస్తున్న వాహనాలపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు.
ఈ డ్రైవ్‌లో, నిబంధనలను ఉల్లంఘించిన 25 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న వాహనాలపై తదుపరి చట్టపరమైన చర్యల కోసం మంచిర్యాల ఆర్ టి ఓ (ప్రాంతీయ రవాణా అధికారి) కార్యాలయానికి నివేదించడం జరిగింది.
ఈ సందర్భంగా, సీఐ మాట్లాడుతూ… “ప్రజలు తమతో పాటు ఇతరుల భద్రత కోసం తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి” అని స్పష్టం చేశారు.
రోడ్డు భద్రతా నియమాలు తప్పక పాటించాలి
షార్ట్ కట్ వద్దు: వాహనదారులు షార్ట్ కట్ మార్గాలలో ముఖ్యంగా జాతీయ రహదారిపై రాంగ్ రూట్‌లో ప్రయాణించడం వలన జరిగే తీవ్ర ప్రమాదాలను గుర్తించాలి.
నిబంధనల ప్రకారం ప్రయాణం: ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నియమాలను పాటిస్తూ, సరైన మార్గంలోనే ప్రయాణం చేయాలి.

పోలీసు నినాదం:
డ్రైవ్ సేఫ్ బి సేఫ్

రాంగ్ రూట్ వాహనదారులకు తీవ్ర హెచ్చరిక
సీఐ ఈ సందర్భంగా వాహనదారులను హెచ్చరించారు. “ప్రజల భద్రతకు ముప్పు కలిగించే విధంగా రాంగ్ రూట్‌లో వచ్చే ఏ వాహనాన్ని కూడా మందమర్రి పోలీసులు ఉపేక్షించరు. ఇక ముందు కూడా రాంగ్ రూట్‌లో ప్రయాణించే వాహనాలను స్వాధీనం చేసుకుంటాం. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటాం” అని తెలిపారు.
ప్రతి పౌరుడు ట్రాఫిక్ నిబంధనలను గౌరవించి, పోలీసులకు సహకరించాలని మందమర్రి పోలీసులు విజ్ఞప్తి చేశారు.

వనపర్తి లో అనుమతి లేకుండా కార్లలో డీసీఎంలలో బెల్లం రవాణా చేస్తే సీజ్…

వనపర్తి లో అనుమతి లేకుండా కార్లలో డీసీఎంలలో బెల్లం రవాణా చేస్తే సీజ్

ఎక్సైజ్ వెంకటరెడ్డి

వనపర్తి పట్టణంలో కొందరు బెల్లం వ్యాపారాలు సిండికేట్ గా ఏర్పడి అనుమతి లేకుండా కార్లలో ట్రాన్స్పోర్ట్ డీసీఎంలలో ఆటోలలో బెల్లం ఇతర ప్రాంతాల నుండి రవాణా చేసి వనపర్తి లో కిరాణం వ్యాపారస్తులకు ఎక్కువ ధరకు వినియోగిస్తూ సొమ్ము చేసుకుంటున్నారని అలాంటి వ్యాపారులను బైండోవర్ చేసి కేసులు నమోదు చేసి కార్లను ట్రాన్స్పోర్ట్ డీసీఎంలను ఆటోలను సీజ్ చేస్తామని ఎక్సైజ్ సీఐ వెంకట్ రెడ్డి సెల్ నెంబర్ 87 12 65 881 తెలిపారు . వనపర్తి లో కిరాణం వ్యాపారులు సారా తయారు చేసే వారికి బెల్లం అమ్మకాలు జరుపుతున్నట్లు తన దృష్టికి వచ్చిందని ఆకస్మిక తనిఖీలు నిర్వహించి వారిని బైండవర్ చేసి కేసు నమోదు చేస్తామని సిఐ తెలిపారు గతంలో కూడా కొందరు బెల్లం వ్యాపారులను బైండ్ వర్ చేశామని సీఐ తెలిపారు వారు తీరు మార్చుకోకుంటే బెల్లం పటికి నవ సాగరం అమ్మే వ్యక్తులపై కేసు నమోదు చేసి జైలుకు పంపుతామని హెచ్చరించారు బ్రతికిరాణం వ్యాపారికి నోటీసులు జారీ చేశామని 5 కిలోల కన్నా ఎక్కువ బెల్లం అడుగుతే వారి సెల్ నెంబర్ ఆధార్ నెంబర్ తీసుకొని ఇవ్వాలని తెలిపామని సీఐ చెప్పారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version