రోడ్లకు అంతరాయం కలుగుతున్న
వాటిని తొలగించండి
కూకట్ పల్లి జోనల్ కమిషనర్ కు
విజ్ఞప్తి చేసిన కాంగ్రెస్ నేతలు
కూకట్పల్లి, జూలై 12 నేటి ధాత్రి ఇన్చార్జి
కూకట్ పల్లి నియోజకవర్గం లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం కూకట్ పల్లి నియోజకవర్గం ఇంచార్జ్ బండి రమేష్ ఆధ్వర్యంలో కూ కట్ పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు శేరి సతీష్ రెడ్డి సారధ్యంలో కాంగ్రెస్ నాయకులు పలువురు ప్రజాప్ర తినిధులు జోనల్ కమిషనర్ ను కలి
శారు.ఈ సందర్భంగా కూకట్ పల్లి నియోజకవర్గంలో ప్రధానంగా నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని జోనల్ కమిషనర్ ను కోరారు.రోడ్లపై పడిన గుంతలను శరవేగంగా పూర్తి
చేసి మరమ్మతులు చేపట్టాలని,రోడ్డు
కు ఇరువైపులా పేరుకుపోయిన చెత్తా చెదారులతోపాటు మట్టి దిబ్బలు,ఇ
సుక కుప్పలను తొలగించాలని అధి కారుల దృష్టికి తీసుకువచ్చారు.ఓ
పెన్ నాలాలలో పేరుకుపోయిన పిచ్చి మొక్కలు చెత్తాచెదాలను తొలగించి మలేరియా బాల్స్ వేయడంతోపాటు దోమల నివారణకు చర్యలు తీసుకో వాలని విజ్ఞప్తి చేశారు.కొందరు రోడ్డు కిరువైపులా అక్రమంగా ఏర్పాటు చేయడం వల్ల ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతున్నాయని సర్వే చేసి వాటి
ని తొలగించి ట్రాఫిక్ నియంత్రణకు
కృషి చేయాలని జోనల్ కమిషనర్
కు సమర్పించిన వినతి పత్రంలో పేర్కొన్నారు.రోడ్లకు అవసరమైన
చోట్ల స్పీడ్ బ్రేకర్లు వేయాలని,అదేవి ధంగా వీధిలైట్లు కూడా ఏర్పాటు చే యాలని జోనల్ కమిషనర్ కు విజ్ఞప్తి చేశారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందు
లు లేకుండా ప్రజా సమస్యలను పరి ష్కరించడంలో సంబంధిత అధికారు
లను సమన్వయం చేస్తూ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని జోనల్ కమిషనర్ కు విజ్ఞప్తి చేశారు.ఈ సంద ర్భంగా జోనల్ కమిషనర్ మాట్లాడు
తూ…. తన దృష్టికి వచ్చిన సమస్యలను సంబంధిత అధికారులను సమన్వయం చేస్తూ వీలైనంత తొందరలో సమస్యల పరిష్కారం కనుగొంటామని హామీ ఇచ్చినట్టు తెలిసింది.కార్యక్రమం లో అల్లూరు కాంగ్రెస్ పార్టీ నాయకులు స్థానిక ప్రజలు తదితరులు పాల్గొని సమస్యలను పరిష్కరించే దిశగా తమతో పాటు అడుగులు వేశారని చైల్డ్ సతీష్ రెడ్డి మీడియా ప్రతినిధులతో పేర్కొన్నారు.