తీవ్రవాదం అంతమొందాలి
ప్రపంచ శాంతి వర్ధిల్లాలి
ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించిన రాములు.
నల్లబెల్లి నేటి ధాత్రి:
ప్రపంచ దేశాలను పట్టి పిడిస్తున్న తీవ్రవాదం అంతమొందించాలని. అదేవిధంగా ప్రపంచ శాంతి వర్ధిల్లాలని కోరుతూ అఖిలభారత హనుమాన్ ప్రచార రాష్ట్ర అధ్యక్షుడు. శ్రీరామ ధర్మ ప్రచారకుడు గాదెపాక రాములు స్వామి మండల కేంద్రంలోని శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో అఖండ దీపాన్ని వెలిగించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. నిన్న మొన్నటి వరకు మన దేశంపై ఉగ్రవాదులు దాడులు నిర్వహించి అమాయకులైన ప్రజలను పొట్టన పెట్టుకున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి తీవ్రవాదాన్ని ప్రోత్సహించే ఎంతటి వారినైనా ఆ భగవంతుడు క్షమించడని వారికి అంతకంటే ఎక్కువ నష్టం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ప్రార్థించే చేతుల కన్నా తోటి వారికి సేవ చేసే భాగ్యం మిన్న అనే సూక్తితో ఒకరినొకరు సేవ. స్నేహభావంతో మెలిగినప్పుడే ప్రపంచ శాంతి వర్ధిల్లుతుందని ఆయన అన్నారు. ప్రపంచ శాంతి వర్ధిల్లాలి అనే భావన ప్రతి మనిషిలోని ఉన్నప్పుడే ప్రపంచంలోని అన్ని దేశాలు ఆర్థిక అభివృద్ధితోపాటు సుఖసంతోషాలతో ఉంటాయని ఆయన తెలిపారు. నేటి యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండి బాధ్యతగా సమాజంలోని గౌరవింపబడే విధంగా ఉన్నత స్థానాల్లో నిలబడాలని ఆయన కోరారు. దీనికోసం స్థానిక ఆంజనేయస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారికి అఖండ జ్యోతిని వెలిగించానని ఆయన తెలిపారు.