విద్యార్థులకు షీ టీం అవగాహన సదస్సు
మంచిర్యాల నేటి ధాత్రి:
మంచిర్యాల జిల్లాలోని ముల్కల్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న సమ్మర్ క్యాంప్ విద్యార్థులకు షీ టీం సభ్యులు అవగాహనా కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ సందర్బంగా షీ టీం సభ్యులు మాట్లాడుతూ… ఆకతాయిల ఆట కట్టించి మహిళలకు రక్షణ కల్పించేది షి టీం కర్తవ్యం అని, మహిళలు ఏదైనా సమస్య వస్తే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని,అలాగే సైబర్ నేరాల గురించి అవగాహన కల్పిస్తూ వచ్చిన ఫిర్యాదు పై తక్షణమే షీ టీం పోలీసులు స్పందించి సంబంధిత విభాగాలకు సమాచారం అందజేయడం ద్వారా ఫిర్యాదు చేసిన మహిళకు షీ టీం బృందాలు సహాయం చేస్తాయని తెలిపారు.ఆకతాయిల నుండి మరి ఏ ఇతర వేధింపులకు గురవుతున్న మహిళలు ఫిర్యాదు చేయాలనుకుంటే 6303923700 నెంబర్ సంప్రదించాలని కోరారు. అలాగే అత్యవసర సమయంలో డయల్ 100 కి ఫిర్యాదు చేయాలన్నారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఇంచార్జి షీ టీం సభ్యులు శ్రవణ్,జ్యోతి,శ్రీలత, విద్యార్థులు,టీచర్స్ పాల్గొన్నారు.