ప్రభుత్వమే నిత్యావసర వస్తువులు సరఫరా చేయాలి
పరకాల నేటిధాత్రి(టౌన్) హనుమకొండ జిల్లా పరకాల పట్టణంలో మధ్యాహ్న భోజన కార్మికుల సమ్మె 9వ రోజుకు చేరుకున్న సందర్భంగా చెవిలో పువ్వు పెట్టుకుని నిరసన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా కళ్యాణ్ మాట్లాడుతూ కార్మికుల ఖాతాలో పెంచిన వేతనాలు,పెండింగ్ బిల్లులు పడుతున్నాయని మీరు పనిలోకి రావాలని కార్మికులపై పాఠశాలల ప్రధానోపాధ్యాయులు బెదిరింపులకు పాల్పడుతున్నారని ఒత్తిడి తెస్తున్నారని ఏ ఒక్కరి ఖాతాలో కూడా నేటి వరకు వేతనాలు జమ కాలేదని వేతనాలు బిల్లులు పడే వరకు వంట బంధు ఉంటుందని బెదిరింపులకు భయపడేది లేదని సమ్మె సమ్మె కొనసాగించాలని ఆయన పిలుపునిచ్చారు.అనేక పోరాటాల ఫలితంగా ప్రభుత్వం ఇప్పుడు ఇస్తున్న వేతనానికి అదనంగా 2000/ రూపాయల వేతనం పెంచుతున్నట్లు ప్రకటించిందని మొత్తం కలిపి 3000/ రూపాయలతో ఎలా బ్రతకాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.పని ప్రదేశాలలో మౌలిక వసతులు కల్పించాలని కొత్త మెనూకు బడ్జెట్ కేటాయించి విధివిధానాలను రూపొందించాలని లేనిపక్షంలో పాత మెనూ కొనసాగిస్తామని ప్రభుత్వానికి తెలియజేశారు. పెరుగుతున్న ధరలకు అనుగుణ మెనూ ఛార్జ్ పెంచాలని,అంగన్వాడీ కేంద్రాల మాదిరిగా ప్రభుత్వమే గుడ్లు సరఫరా చేయాలని,కాటన్ దుస్తులు యూనిఫామ్ గా ఇవ్వాలని,వంటకు సరిపడా వంటగ్యాసును పూర్తిగా ఉచితంగా ఇవ్వాలని, కార్మికులకు ప్రమాద బీమా, పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని,మధ్యాహ్న భోజనం పథకాన్ని స్వచ్ఛంద సంస్థలకు ఇచ్చే ఆలోచనను విరమించుకోవాలని, కార్మికులకు కనీస వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆయన కోరారు. కార్మికుల ఖాతాలో వేతనాలు పెండింగ్ బిల్లులు కొత్త మెనుకు బడ్జెట్ ప్రకటించేంతవరకు సమ్మె కొనసాగుతుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.ఉపాధ్యాయ సంఘాలు కూడా తమ హక్కుల కోసం అనేక పోరాటాలు చేసిన సందర్భం ఉన్నదని కొంతమంది ఉపాధ్యాయులు అత్యుత్సాహంతో అతి తక్కువ వేతనం రోజువారి కూలీ 33/రూపాయలకు పని చేస్తున్న కార్మికులపై ఒత్తిడి పెంచి భయాందోళనలకు గురి చేయడం సరైనది కాదన్నారు. కార్మికుల పోరాటానికి సహకరించాలని ఉపాధ్యాయులకు ఆయన విజ్ఞప్తి చేశారు.మీ న్యాయమైన సమస్యలు పరిష్కారమే అంతవరకు మీకు అండగా ఎస్ఎఫ్ఐ సంపూర్ణ మద్దతు ఉంటుందని ఆయన తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ మండల అధ్యక్షుడు మడికొండ ప్రశాంత్,ఎస్ఎఫ్ఐ మండల నాయకులు బొజ్జ హేమంత్, ప్రేమ్,యూనియన్ జిల్లా అధ్యక్షురాలు పోతిరెడ్డి సమ్మక్క,రాధా,సరోజన, సమ్మక్క,హేమలత,సుమలత, వనక్క,రమ,సారమ్మ,శ్రీలత, శైలజ,మమత తదితరులు పాల్గొన్నారు