సేవాలాల్ మహరాజ్ జయంతి ఉత్సవాలను జయప్రదం చెయ్యాలి…

సేవాలాల్ మహరాజ్ జయంతి ఉత్సవాలను జయప్రదం చెయ్యాలి

◆-: జయంతి ఉత్సవాల వాల్ పోస్టర్ ని ఆవిష్కరించిన మహామండలేశ్వర్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్: గిరిజనుల ఆరాధ్య దైవం శ్రీ సంత్ సేవాలాల్ 287వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించి విజయవంతం చేయాలని ఆదివారం నాడు బర్దిపూర్ ఆశ్రమ పీఠాధిపతి మహామండలేశ్వర్ సిద్ధేశ్వరానందగిరి పిలుపునిచ్చారు.జహీరాబాద్ పట్టణంలో ఈ నెల 15న నిర్వహించనున్న సేవాలాల్ జయంతి ఉత్సవాలు, శోభాయాత్రకు సంబంధించిన గోడపత్రికను జయంతి ఉత్సవ కమిటీ సభ్యులతో కలిసి ఆశ్రమ ప్రాంగణంలో ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మహామండలేశ్వర్ సిద్ధేశ్వరానందగిరి మాట్లాడుతు సేవాలాల్ మహారాజ్ బోధనలు యువత అనుసరించాలని, సమాజంలో ఐక్యత, సేవాభావం పెంపొందించుకోవాలని, సేవాలాల్ మహరాజ్ బోధనలను తూచా తప్పకుండా పాటించి జీవితంలో విజయం సాధించాలని సూచించారు. జయంతి కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. భారీ ఎత్తున జరగనున్న ఉత్సవాలకు తన బృందం ద్వారా తప్పకుండా హాజరు అవుతానని ఈ సందర్భంగా అన్నారు. సేవాలాల్ మహరాజ్ జీవిత చరిత్ర పుస్తకాన్ని స్థానిక కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ సుభాష్ రాథోడ్ బర్దిపూర్ ఆశ్రమ పీఠాధిపతి శ్రీశ్రీ మహామండలేశ్వర్ సిద్ధగిరినందగిరి కి బహుకరించాగ, వారు పిపి సుభాష్ రాథోడ్ కి శాలువకప్పి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సేవాలాల్ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి రఘునాథ్ రాథోడ్, డాక్టర్ సుభాష్ జాదవ్, కోశాధికారి నరేష్ చవాన్, విజయ్ రాథోడ్ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version