నిజాంపేట: నేటి ధాత్రి
బుధవారం నిజాంపేట మండల విద్యాధికారిగా సాంగాని యాదగిరి పదవి బాధ్యతలు చేపట్టారు. గతంలో చల్మెడ ఉన్నత పాఠశాలలో గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు గా నోడల్ అధికారిగా పనిచేసిన ఆయన పదోన్నతి పొంది మండల విద్యాధికారిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు మంచి విద్యాబోధన అందించేలా కృషి చేస్తానన్నారు.