రామకృష్ణాపూర్, నేటిధాత్రి:
రామకృష్ణాపూర్ పట్టణంలోని శ్రీనివాస్ నగర్ గణేష్ మండలి, అల్లూరి సీతారామరాజు నగర్ గణపతి మండలి వద్ద గణపతి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం కుంకుమార్చన పూజా మహోత్సవాలు నిర్వహించారు.భగత్ సింగ్ నగర్ ఫ్రెండ్స్ గణేష్ మండలి,ప్రగతి కాలని గణపతి మండలి, గద్దెరాగడి గణపతి మండలి వద్ద మహా అన్నప్రసాద కార్యక్రమాలు సైతం నిర్వహించారు. పూజా కార్యక్రమంలో స్థానిక మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని గణనాథులకు పూజలు చేశారు. అనంతరం గణనాథులకు నైవేద్యం సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ…. నవరాత్రి ఉత్సవాలు కాలనీవాసుల సహకారాలతో నిర్వహిస్తున్నామని తెలిపారు. గణనాధుని ఆశీర్వాదాలు ప్రజలపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు, మహా అన్న ప్రసాదాల కార్యక్రమాలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.