రైతు నేస్తం ప్రారంభోత్సవ కార్యక్రమం
ఘనంగా రైతు భరోసా సంబరాలు
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు లను అందజేసిన ఎమ్మెల్యే
శాయంపేట నేటి ధాత్రి:
హనుమకొండ జిల్లా శాయంపేట మండలం రైతు వేదికలో ఏర్పాటు చేసిన రైతు నేస్తం ప్రారంభోత్సవ కార్యక్ర మానికి ముఖ్యఅతిథిగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పాల్గొని పాలాభిషేకం చేసి, ఎమ్మెల్యే చేతుల మీదుగా లబ్ధిదారు లకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేయడం జరిగింది.రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు భరోసా కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో తొమ్మిది రోజుల్లో 9000 వేల కోట్ల రూపాయల రైతుల ఖాతాలో జమ కావడం ఎంతో సంతోషకరం.ఈ కార్య క్రమంలో అన్ని గ్రామాల కాంగ్రెస్ కార్యకర్తలు, మహి ళలు, ప్రజలు, రైతులు అధిక మొత్తంలో పాల్గొన్నారు