ప్రభుత్వ ఆదేశాలను సైతం పక్కన పెట్టిన రుద్రంపూర్ సెయింట్ జోసెఫ్ హై స్కూల్

పుస్తకాలని, స్కూల్ యూనిఫాంలను చట్ట వ్యతిరేకంగ, అధిక రేటుకి నిర్ధాక్షిణంగా విక్రయిస్తున్న సెయింట్ జోసెఫ్ హై స్కూల్

విద్యాహక్కు చట్టం 2009 ను అనుసరించి తగు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్. జితీష్ పాటిల్ .నీ మరియు జిల్లా విద్య శాఖ అధికారులను కోరడమైనది

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి

చుంచుపల్లి మండలం రుద్రంపూర్ గ్రామపంచాయతీ. తల్లితండ్రులు ఎన్నో వ్యయ ప్రయాసలతో తమ జీవితం కన్నా… తమ పిల్లల భవిష్యత్తు ముఖ్యమని తమ తమ కడుపులు మాడ్చుకొని సైతం పిల్లలను ప్రైవేటు పాఠశాలలో చదివిస్తుంటే.
ప్రైవేటు విద్యా సంస్థలు డబ్బులనే ప్రామాణికంగా తీసుకొని, కార్పొరేట్ విద్యా సంస్థలుగా ఎదుగుతున్నాయే తప్పా… ప్రామాణికమైన విద్యను విద్యార్థులకి అందించట్లేదు
రుద్రంపూర్ లోని. సెయింట్ జోసెఫ్ హై స్కూల్ లో నిర్భయంగా ఇష్టారీతిన అధిక ధరలకు బుక్స్, బట్టలు, తదితర వస్తువులను రసీదు లేకుండా, జీఎస్టీ బిల్లు లేకుండా. నవోదయ బుక్ స్టాల్ వారు. సెయింట్ జోసెఫ్ హైస్కూల్లో సెయింట్ జోసెఫ్ హై స్కూల్ ముద్ర తోటి ఉన్న నోట్ బుక్స్. అమ్ముతూనారు. అటు ప్రభుత్వాన్ని ఇటు తల్లి తండ్రులని మోసం చేయడమే కాకుండా. నిజాయితీ నేర్పించాల్సిన పాఠశాలలు ఎలా మోసం చేయాలో విద్యార్థులకి ఈ విధంగా నేర్పిస్తున్నాయి అనేది తీవ్ర పరినామం గా భావించాలి.

తల్లితండ్రులు. వారి తల్లితండ్రులు ఒకప్పుడు వారి తల్లిదండ్రులువారిని చదివించలేదు అని. తమ పిల్లలని ప్రభుత్వ పాఠశాలలో కాకుండా. ప్రైవేట్ స్కూల్లో చదివించుకోవాలని.వారు
పాజిషన్ లో చూడాలి అనుకొని ఇలాంటి ప్రైవేటు స్కూల్లలో చద్ధివిస్తుంటే.
స్కూల్ యాజమాన్యాలు మాత్రం విద్యార్థులకి 10వ తరగతిలో చూసి చదవడం మరియు వ్రాయడం నేర్పిస్తూ.బట్టి పట్టి చదివిస్తున్నాయి.10వ తరగతిలో పాస్ కావడమే గొప్పగా భావిస్తున్న విద్యా సంస్థలు
విద్యార్ధులను, తల్లితండ్రులను , దేశ భవిష్యత్తును అంధకారంలోకి తొసెస్తున్నాయి.
పాఠశాలలో ఫీజులు కట్టడమే భారమైన ఈ రోజుల్లో .
ఇలా.. బుక్స్, బట్టలు అని అధిక ధరలకు అమ్ముకుంటు, ప్రభుత్వ ఆదేశాల్ని విద్యా హక్కు చట్టాన్ని బాలల హక్కులను చట్టాన్ని పట్టించుకోకుండా అడ్డ దారిలో డబ్బులు వసూలు చేస్తున్నారు
కాబట్టి ఈ పాఠశాలపై శాఖాపరమైన చర్యలు తీసుకొవాలి.మరియు ప్రతీ విద్యా సంస్థలను సందర్శించి, నోట్బుక్స్ నీ పరిశీలించి … స్కూల్ పేరుతో ఉన్న నోట్స్ బుక్స్ కనపడితే ఆ ఆ స్కూళ్లపై కూడా విద్యా హక్కు చట్టం 2009 ను అనుసరించి తక్షణమే.చర్యలు తీసుకొని, తల్లితండ్రుల కష్టాన్ని, విద్యార్థుల భవిష్యత్తును కాపడవలసిందిగా జిల్లా కలెక్టర్ జినీత్ పాటిల్ నీ మరియు విద్యా శాఖ అధికారిని కోరుతూ… విద్యాశాఖ సూపర్ఇండెంట్ కి వినతి పత్రం అధించడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా మానవహక్కుల సంఘము అధ్యక్షులు ముత్తవరపు జానకిరామ్, గోండ్వాన సంక్షేమ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు పాయం సత్య నారాయణ మరియు బాధిత తల్లితండ్రులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!