మీ క్షేమం మా లక్ష్యం.. మీ భద్రత మా ధ్యేయం
శాయంపేట నేటిధాత్రి:
హనుమకొండ జిల్లా శాయంపేట మండల కేంద్రంలోని పెద్దకోడేపాక గ్రామంలోని జెడ్పిహెచ్ఎస్ ప్రభుత్వ పాఠశాలలో రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం జరిగింది. అవగాహన కార్యక్రమం కింద రోడ్డు భద్రత నియమాలు, ట్రాఫిక్ చిహ్నాలు, రోడ్డు ఆక్షన్ ఫిగర్స్, రోడ్డు సేఫ్టీ, ఆక్ట్ రైడింగ్ గేర్లు ,రోడ్డు భద్రత భంగిమలపై శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్సై పరమేశ్వర్, పోలీసు సిబ్బంది, పాఠశాల యొక్క ప్రధానో పాధ్యాయులు, ఉపాధ్యాయు లు,సిబ్బంది పాల్గొన్నారు.