మండలంలో ఘనంగా గణతంత్ర దినోత్సవం
గంగాధర, నేటిధాత్రి :
కరీంనగర్ జిల్లా గంగాధర మండల కేంద్రంలో సోమవారం 77వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మండలంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో జాతీయజెండా ఎగురవేసి విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. మండలంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు జెండా ఎగురవేశారు. తహశీల్దార్ కార్యాలయంలో తహశీల్దార్ అంబటి రజిత, ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో దమ్మని రాము, సబ్ రిజిస్టర్ కార్యాలయంలో అజ్మత్ అలీ, సింగిల్ విండో కార్యాలయంలో రమేష్, వ్యవసాయ మార్కెట్ ఆవరణలో ఏర్పాటు చేసిన జాతీయ జెండాను మండలంలోని వివిధ గ్రామాలలో కార్యదర్శిలు, వివిధ కుల సంఘాల నాయకులు జాతీయ పతాకాన్ని ఎగురవేసి జాతీయ గీతం ఆలపించారు.
