rajastanlo policelapia dadi avastavam, రాజస్థాన్‌లో పోలీసులపై దాడి అవాస్తవం

రాజస్థాన్‌లో పోలీసులపై దాడి అవాస్తవం

వరంగల్‌ క్రైం, నేటిధాత్రి : వరంగల్‌ జిల్లాలో దొంగతనాలకు పాల్పడిన కేసులో నిందితులుగా ఉన్న రాజస్థాన్‌ రాష్ట్రానికి చెందిన దొంగల ముఠాను పట్టుకునేందుకు వరంగల్‌ జిల్లా సీసీఎస్‌ పోలీసులు రాజస్థాన్‌కు వెళ్లడం జరిగిందని సీసీఎస్‌ పోలీసులు తెలిపారు. దొంగల ముఠా కోసం గాలిస్తుండగా దొంగల ఆచూకి రాజస్థాన్‌లోని బిల్వాడా జిల్లా హెర్నియా గ్రామంలో ఉన్నట్లు సమాచారం అందడంతో పోలీసులు అక్కడికి చేరుకుని వారిని అరెస్టు చేసే ప్రయత్నం చేస్తుండగా గ్రామస్తులు పోలీసులను అడ్డుకున్నారని తెలిపారు. అడ్డుకునే క్రమంలో స్వల్ప ఉద్రిక్తత వాతావరణం నెలకొందని, అయినా పట్టువదలకుండా దొంగల ముఠాను అరెస్టు చేసినట్లు సీసీఎస్‌ పోలీసులు తెలిపారు. ధైర్యసాహసాలతో ఎదురించి దొంగలను పట్టుకున్న పోలీసులను జిల్లా పోలీసు ఉన్నతాధికారులు అభినందించారు. సామాజిక మాధ్యమాలలో పోలీసులను తీవ్రంగా గాయపరిచినట్లు, పోలీసులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *