సిరిసిల్ల జిల్లా సంక్షేమ అధికారి.!

రాజన్న సిరిసిల్ల జిల్లా సంక్షేమ అధికారి,పత్రిక ప్రకటన

సిరిసిల్ల టౌన్ 🙁 నేటిధాత్రి )

 

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని 10వ తరగతి ఉత్తీర్ణత పొందిన అనాథ, నిరాశ్రయులు మరియు నిరుపేద బాలికలకు 3సం.రాల డిప్లామా కోర్సులలో ప్రవేశానికి గాను దుర్గాబాయి దేశ్‌ముఖ్ ప్రభుత్వ మహిళా సాంకేతిక శిక్షణ సంస్థ, హైదరాబాద్ లో ప్రవేశానికి ధరఖాస్తులను ఆహ్వానించడం జరిగింది. కోర్సుల వివరాలు: డిప్లామా ఇన్ సివిల్ ఇంజనీర్ (DCE) విభాగంలో (60 సీట్లు), డిప్లామా ఇన్ ఎలక్ట్రికల్ మరియు ఎలక్ట్రానికల్ (DEEE) విభాగంలో (60 సీట్లు), డిప్లామా ఇన్ కంప్యూటర్ ఇంజనీరింగ్ (DCME) విభాగంలో (60 సీట్లు), డిప్లామా ఇన్ ఎలట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ (DECE) విభాగంలో (60 సీట్లు) కలవు.
ఇందుకు గాను 10వ తరగతి ఉత్తీర్ణత పొందిన బాలకల యొక్క కులం మరియు ఆదాయదృవీకరణ పత్రం (not for Orphans), తల్లిదండ్రుల యొక్క మరణ దృవీకరణపత్రము (in case of Orphans), బోనఫైడ్, ట్రాన్సఫర్ సర్టిఫికేట్, స్టడీ కేర్టిఫికేట్ మరియు 10 వ తరగతి మార్కుల మేమో ను సంబందిత ధరఖాస్తు ఫామ్ తో జత పరచవలెను. తేది: 20.05.2025 లోపు పూర్తి చేసిన ధరఖాస్తులను జిల్లా కలెక్టర్ కార్యలయంలోని జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయం, మహిళలు, పిల్లలు, వికలాంగులు మరియు వయోవృద్దుల శాఖ, రాజన్న సిరిసిల్ల జిల్లా లో సమర్పించగలరని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, రాజన్న సిరిసిల్ల జిల్లా సంక్షేమ అధికారి,పత్రిక ప్రకటనలో తెలియజేశారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version