-ఐదు సంవత్సరాల లోపు పిల్లలకు పల్స్ పోలియో తప్పనిసరి
-కరకగూడెం ప్రభుత్వ వైద్యాధికారి కారం మధు
కరకగూడెం,, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.. నేటిధాత్రి…
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం
మార్చి 3న జరిగే పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రభుత్వ వైద్యాధికారి కారం మధు అన్నారు.
శనివారం ప్రభుత్వ ఆసుపత్రి కేంద్రం నందు పల్స్ పోలియో ఆటో ప్రచార వాహనాన్ని ఆయన ప్రారంభించారు.అనంతరం విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్భంగా డాక్టర్ మాట్లాడుతూ…మార్చి 3న నేషనల్ ఇమ్యునైజేషన్ డే సందర్భంగా మూడు రోజుల పాటు పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు.అప్పుడే పుట్టిన పిల్లల నుండి ఐదేళ్లలోపు చిన్నారులకు వంద శాతం పోలియో చుక్కలు వేయాలన్నారు.పలు కారణాలతో మిగిలిపోయిన చిన్నారులకు 4,5 తేదీల్లో ఇంటింటికీ తిరిగి పోలియో వ్యాక్సినేషన్ ప్రక్రియను పూర్తి చేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో మదన సుగుణదేవి,తాటి పద్మ,సున్నం క్రిష్ణ,కరకగూడెం ప్రధాన ఉపాధ్యాయులు మలకం మంజుల,ఉపాధ్యాయులు,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.