CM Relief Fund – A Boon for the Poor
*పేదల పాలిటి పెన్నిధి.. ముఖ్యమంత్రి సహాయ నిధి..
*చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు..
*18 మంది బాధితులకు సి.యం.రిలీప్ ఫండ్ చెక్కులను అందించిన ఎంపీ దగ్గుమళ్ళ
చిత్తూరు(నేటిధాత్రి)నవంబర్
ముఖ్యమంత్రి సహాయ నిధి.. పేదల పాలిట పెన్నిధిగా నిలుస్తోందని చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు తెలిపారు. ఆపదలో ఉన్న ఆప్తులకు ఈ విధంగా ఆపన్న హస్తాన్ని అందించడం ఆనందంగా ఉందన్నారు. పేదలకు చేయూతనివ్వడంలో కూటమి ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని ఆయన తెలియజేశారుచిత్తూరులోని పార్లమెంటు కార్యాలయంలో గురువారం సుమారు18 మంది బాధితులకు 10,89,041 రూపాయల చెక్కులను విడి విడిగా అందించి, వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపారు చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిత్తూరు పార్లమెంటు పరిధిలో ఇప్పటికే ఎంతోమంది ఆప్తులకు, ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా తోడ్పాటునందించడం జరిగిందన్నారుసీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు ఓ వరం లాంటిదని ఆయన పేర్కొన్నారు. తాజాగా సుమారు18 మంది బాధితులకు విడి విడిగా 10,89,041 రూపాయల చెక్కులను అందించి వారి కష్టసుఖాలలో పాలుపంచుకోవడం సంతృప్తినిచ్చిందన్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేదల పక్షపాతిగా పనిచేస్తూ
వారి హృదయాలలో చెరగని ముద్ర వేసుకున్నారని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు బాటలో నడుస్తూ
తాను కూడా ప్రజాసేవే పరమావధిగా భావించి
తన కర్తవ్యాన్ని చిత్తశుద్ధితో నిర్వర్తిస్తున్నట్లు చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాద్ రావు ఈ సందర్భంగా వివరించారు.
చెక్కులు అందుకున్న బాధితులు చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావుకు కృతజ్ఞతలు తెలియజేశారు
