జైపూర్ మండల్ ముదిగుంట గ్రామానికి చెందిన పాశం మల్లేష్, సోతుక్ సాయిరాజ్ ఇద్దరూ టీ ఎస్ ఎస్ పి లో కానిస్టేబుల్ ఉద్యోగంలో ఉత్తీర్ణత సాధించారు వీరికి ఉద్యోగం రావడం పట్ల స్నేహితులు మరియు బంధువులు ముదిగుంట గ్రామ ప్రజలు అభినందనలు తెలియజేశారు.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ. 2000 నోట్లను మార్చుకోవడానికి, డిపాజిట్ చేయడానికి గడువును సెప్టెంబర్ 30, 2023 నుండి అక్టోబర్ 7, 2023 వరకు పొడిగించింది.
సెప్టెంబరు 30, 2023 నాటి RBI పత్రికా ప్రకటన ప్రకారం: ఉపసంహరణ ప్రక్రియకు పేర్కొన్న వ్యవధి ముగిసినందున, సమీక్ష ఆధారంగా, రూ.2000 నోట్ల డిపాజిట్/మార్పిడి కోసం ప్రస్తుత ఏర్పాటును అక్టోబర్ వరకు పొడిగించాలని నిర్ణయించారు. 07, 2023
నెన్నల మండలం లోని అవడం నుండి చిత్తాపూర్ గ్రామమునకు వెళ్ళే రోడ్డు పూర్తిగా చెడిపోయి రోడ్డు పక్కన గ్రావెల్ లేక పూర్తిగా అస్తవ్యస్తంగా ఉంది ఈ రోడ్డు గుండా ప్రయనిచాలి అంటే ప్రయాణికులు ప్రాణాలను అరిచేతులో పెట్టుకొని ప్రయాణం సాగించాల్సినదే మూల మలువు పైగా రోడ్డు సరిగ్గా లేకపోవడం వాళ్ళ తరుచుగా ఇక్కడ ప్రమాదాలు సంభవిస్తున్నాయి వాహన దారులు బండి అదుపుతప్పి ప్రమాదాల బారిన పడుతున్నారు ,వెంటనే ప్రభుత్వం స్పందించి రోడ్డు సరిగ్గా వేయాలని చిత్తాపూర్ ప్రజలు కోరుతున్నారు
లులు మాల్లో చోరీ జరిగింది. లులు మాల్ యొక్క గ్రాండ్ ఓపెనింగ్ అనూహ్యమైన యు టర్న్ తీసుకుంది, అక్కడ ఉన్న భారీ జనసమూహం ప్రజలను నిర్వహించడానికి భద్రతా వారి నియంత్రణను కోల్పోయింది. ఈ సమయంలో ప్రజలు ఆహార పదార్థాలను దోచుకున్నారు. వారిలో కొందరు బిస్కెట్లు పఫ్స్ కేకులు తిని బిల్లు చెల్లించకుండా వెళ్లిపోయారు. భారీగా జనం ఉండటంతో సెక్యూరిటీ సిబ్బందిని గమనించలేకపోయారు కానీ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి
అస్తవ్యస్త దృశ్యం బయటపడకుండా నిరోధించడంలో CCTV కెమెరాలతో సహా భద్రతా చర్యలు సరిపోలేదు. దీంతో రంగంలోకి దిగిన అధికారులు పరిస్థితిని అదుపు చేసేందుకు ప్రయత్నించారు.
గణపురం మండల కేంద్రంలోని ముదిరాజ్ కులం సంగం భూపాలపల్లి వ్యవసాయ మార్కెట్ చైర్మన్ పోలుసాని లక్ష్మీ నరసింహ రావుకి ముదిరాజ్ యుత్ సభ్యులు కుల పెద్ద పర్శావేని రాజయ్య శాలువతో సన్మనం చేయడం జరుగింది. ఈ కార్యక్రమంలో అల్లం స్వామి, రవి, దాసరి సమ్మయ్య, కందుల రాజయ్య, పెండ్యాల సాంబయ్య, పర్శావెని సమ్మయ్య, మల్లయ్య, మాల నాగేష్, రాకేష్ రాజేష్ ,రాజ,భగవాన్, పర్షవేని సమ్మయ్య ,శ్రీను భాస్కర్,సాధు సమ్మయ్య, రంజిత్, మూలకాల భాస్కర్ తదితరులు పాల్గోన్నారు
ఓజాస్ డియోటాల్ మరియు జ్యోతి సురేఖ వెన్నం కేవలం ఒక పాయింట్ మాత్రమే కోల్పోయి తమ దక్షిణ కొరియా ప్రత్యర్థులను ఒక పాయింట్ తేడాతో ఓడించి రెండో బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నారు.
హాంగ్జౌ: అత్యంత ఆత్మవిశ్వాసంతో ఉన్న ఓజాస్ డియోటాలే, జ్యోతి సురేఖ వెన్నం ఒక్క పాయింట్ మాత్రమే కోల్పోయి తమ దక్షిణ కొరియా ప్రత్యర్థులను ఒక పాయింట్ తేడాతో ఓడించి బుధవారం ఇక్కడ జరిగిన ఆసియా క్రీడల్లో ఆర్చరీలో రెండో స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నారు.
దీనితో, భారత ఆర్చర్లు ప్రస్తుత క్రీడల నుండి కనీసం నాలుగు పతకాలను గెలుచుకోవడానికి సిద్ధంగా ఉన్నారు, ఇది 2014లో ఇంచియాన్లో పురుషుల జట్టు కాంపౌండ్ స్వర్ణం, ఒక రజతం మరియు ఒక కాంస్యం సాధించినప్పుడు వారి మునుపటి అత్యుత్తమ ప్రదర్శనను మెరుగుపరుస్తుంది.
అగ్ర-రెండు సీడ్ల మధ్య జరిగిన స్వర్ణ పతక పోరులో, నంబర్ 1 భారత జోడీ దాదాపుగా పరిపూర్ణంగా ఉంది మరియు సో చేవాన్ మరియు జూ జేహూన్లను 159-158తో ఓడించింది.
కజకిస్థాన్పై 159-154 తేడాతో విజయం సాధించిన భారత జోడీ ఫైనల్లోకి ప్రవేశించింది. కజఖ్ జోడీ అడెల్ జెక్సెన్బినోవా మరియు ఆండ్రీ ట్యుట్యున్తో జరిగిన సెమీఫైనల్స్లో వారికి కేవలం ఒక ‘9’ ఉంది మరియు మిగిలినవన్నీ ‘10లు’.
అంతకుముందు మలేషియాను 158-155తో ఓడించి సెమీఫైనల్లోకి దూసుకెళ్లేందుకు భారతీయులు పట్టుదలతో ఉన్నారు. కజకిస్థాన్ 154-152తో థాయ్లాండ్ను ఓడించింది.
అంతకుముందు, భారత జంట 40-39 ఆధిక్యంలోకి రావడానికి బలమైన ఆరంభాన్ని కలిగి ఉంది, అయితే రెండవ ముగింపులో మలేషియా జోడీ మహ్మద్ జువైదీ బిన్ మజుకీ మరియు ఫాటిన్ నూర్ఫతేహా మత్ సల్లెహ్ సమం చేయడంతో ఇద్దరూ రెండు పాయింట్లు కోల్పోయారు.
భారతదేశం కోసం మొదటి షాట్ను తీసుకుంటున్న ప్రస్తుత సీనియర్ ప్రపంచ ఛాంపియన్ డియోటాలే, తన సీనియర్ సహచరుడు జ్యోతిపై ఒత్తిడి తెచ్చేందుకు రెండవ ఎండ్లో 10-రింగ్ను మిల్లీమీటర్ల తేడాతో కోల్పోయింది.
బహుళ ప్రపంచ కప్ స్వర్ణ పతక విజేత జ్యోతి కూడా ఒక పాయింట్ (38-39) తేడాతో తమ ప్రత్యర్థులకు రెండో ముగింపును అందించడంలో తడబడింది.
అయితే మూడో ఎండ్లో మొదట షూట్ చేస్తున్నప్పుడు వీరిద్దరూ 10వ దశకు చేరుకున్నారు, ఎందుకంటే బలమైన మొహమ్మద్ జువైదీ తన మొదటి-పాయింట్ను కోల్పోయాడు, అది భారత్ ఆధిక్యాన్ని తిరిగి పొందడంలో సహాయపడింది (118-117).
నిర్ణయాత్మక నాల్గవ ఎండ్లో, మలేషియా మొదట షాట్ చేసి, బ్యాక్-టు-బ్యాక్ 10లతో ఒత్తిడి తెచ్చారు, అయితే భారత ద్వయం తమ ప్రశాంతతను నిలుపుకుంది మరియు చాలా 10లతో శైలిలో స్పందించింది.
జ్యోతి బాణం లక్ష్యాన్ని ఛేదించింది, తదుపరి షాట్లో 32 ఏళ్ల ఫాటిన్ నూర్ఫతేహా రెడ్-రింగ్లో కొట్టిన 8 పరుగులతో మ్యాచ్ను భారతీయులకు అందించాడు.
కాంటినెంటల్ షోపీస్లో ఇంచియాన్ 2014లో తమ అత్యుత్తమ ఫీట్తో సరిపెట్టుకోవడానికి భారత ఆర్చర్లు మంగళవారం మూడు పతకాలను ధృవీకరించారు.
ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ & పినపాక శాసనసభ్యులు & భద్రాద్రి కొత్తగూడెం బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు విస్తృతంగా పర్యటించి కొత్తగూడెం, ముత్తాపురం, లక్ష్మీపురం, గ్రామాలలో పలు అభివృద్ధి పనులకు స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులతో కలిసి శంకుస్థాపనలు చేయడం జరిగింది…
కొత్తగూడెం గ్రామం లో ఆర్ &బి రోడ్డు నుండి కొరేం గుంపు వరకు సుమారు 25 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించనున్న ప్రత్యేక మరమ్మత్తుల పనులకు శంకుస్థాపన చేయడం జరిగింది…
అల్లేరుగూడెం నుండి బార్లగూడెం వరకు సుమారు 2 కోట్ల 26 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించనున్న బిటి రోడ్డు మరమ్మత్తు పనులకు శంకుస్థాపనలు చేయడం జరిగింది…
ఆర్& బి రోడ్డు భట్టుపల్లి వయా వడ్డేరు గుంపు నుండి బురుదారం రోడ్డు వరకు సుమారు 2 కోట్ల 50 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించనున్న బిటి రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయడం జరిగింది…
ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతారావు మాట్లాడుతూ
పినపాక నియోజకవర్గం ప్రజల ఆశీర్వాదమే తనకు కొండంతా అండ అని ఆయన అన్నారు, ప్రజల కష్టసుఖాలలో నిత్యం తోడుంటానని గ్రామాల అభివృద్ధితో పాటు ప్రజా సంక్షేమ పథకాల అమలులో ముందుంటానన్నారు, ప్రజలకు సేవ చేస్తూ అలుపు అన్నదే రావడంలేదని ఇది తన అదృష్టంగా భావిస్తున్నామన్నారు
స్వరాష్ట్రంలో గ్రామాలలో అభివృద్ధి పరుగులు పెడుతున్నదని తెలిపారు ప్రతి మారుమూలపల్లెకు బీటి రోడ్డు వేయడంతో పాటు మౌలిక సౌకర్యాలు మెరుగుపడ్డాయి అన్నారు, ప్రజలంతా మమేకమై అభివృద్ధిలో భాగ్య స్వాములవుతున్నట్లు తెలిపారు
గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయని అన్నారు, తాను గెలిచిన నాటి నుంచి నేటి వరకు నియోజకవర్గంలో పర్యటిస్తూ ప్రజలకు నిరంతరం సేవ చేస్తున్నానని అన్నారు
రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులతో తెలంగాణ పల్లెలు దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయని ఆయన అన్నారు, సీఎం కేసీఆర్ గ్రామాల అభివృద్ధికి విశేష కృషి చేస్తున్నారని తెలిపారు
గ్రామాలలో నూతన గ్రామపంచాయతీ భవనాలు వైకుంఠధామాలు పల్లె ప్రకృతి వనాలు అంతర్గత సిసి రోడ్లు నూతన పాఠశాల భవనాలు మంచినీటి సాగునీటి వసతి మెరుగుపడినట్లు తెలిపారు రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేవన్నారు
సంక్షేమ పథకాల అమలులో ఎలాంటి పొరపాట్లు తావు లేకుండా అర్హులైన వారికి అందిస్తున్నామని తెలిపారు ప్రధానంగా దళిత బంధు బీసీ బందుతో పేద కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తున్న దాన్ని వివరించారు పేదల కోసం పనిచేసిన ప్రభుత్వానికి ప్రజలు విధిగా మరోసారి ఆశీర్వదించాలని కోరారు…
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం సమత్ బట్టుపల్లి పంచాయతీ నందు ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు రేగ కాంతారావు ఆదేశాల మేరకు క్రీడాకారులకు కేసీఆర్ స్పోర్ట్స్ కిట్ ఎంపీపీ రేగా కాలిక చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ అభివృద్ధి చెందాలంటే కెసిఆర్ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాల ద్వారానే అని అదేవిధంగా క్రీడాకారులను ప్రోత్సహించడంలో తెలంగాణ రాష్ట్రం ఎప్పుడు ముందుంటారని మరియు తెలంగాణ యువత బంగారు భవిష్యత్తుకు కేవలం కేసీఆర్ ప్రభుత్వం ద్వారానే అని ఈ సందర్భంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ పోలే బోయిన శ్రీవాణి, బి ఆర్ ఎస్ పార్టీ మండల యువజన ప్రధాన కార్యదర్శి కట్టు కోజ్వల దిలీప్, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు
ఈ కార్యక్రమంలో జిల్లా కోశాధికారి దుర్గం తిరుపతి మాట్లాడుతూ వెంకట స్వామి గారు బడుగు బలహీన వర్గాలకు అండగా ఉన్నటువంటి గొప్ప నాయకుడు మరియు భారతదేశంలో కార్మిక శాఖ మంత్రిగా చేసి తనన గుర్తింపు పొందిన మహనీయుడు భారతదేశంలో చిన్న రాష్ట్రాలు ఏర్పాటులో వెంకట స్వామి గారు ఒకరు తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని మొట్టమొదటి నుండి ఆకాంక్షించిన వ్యక్తి అతని చివరి దశలో తెలంగాణ ఏర్పడడం లో తన వంతు కృషి ఎంతో ఉంది చాలా చిన్న స్థాయి నుండి కష్టపడి పైకి ఎదిగినటువంటి వ్యక్తి కాకా వెంకటస్వామి గారు ఈ మానేరు నది వాహక ప్రాంతంలో సింగరేణి అభివృద్ధి సంబంధించినటువంటి ఎంతో గొప్పగా చేసినటువంటి వ్యక్తి వెంకట స్వామి గారు ఈ ప్రాంతంలో వెంకట స్వామి గారు తెలియని వ్యక్తి అంటూ ఉండరు అతను పేద ప్రజలకు గుడిసెలు ఏపించినటువంటి వ్యక్తి అందుకనే అతని గుడిసెల వెంకటస్వామి అని కూడా ముద్దుగా పిలుచుకుంటారు ప్రజలు అదేవిధంగా కాకా ఆని కూడా పిలవడం జరుగుతుంది. అతని చివరి దశలో రాష్ట్రపతిగా చేయాలని ఆలోచన ఉండే కాకపోతే దుర్మార్గమైనటువంటి కాంగ్రెస్ పార్టీ అతనిని కానివ్వలేదు అతని ఆశయాలను కొనసాగిస్తూ గౌరవ మాజీ పార్లమెంట్ సభ్యులు వివేక్ గారు కాకా ఫౌండేషన్ ద్వారా విద్యార్థులకు బడుగు బలహీన వర్గాలకు సాయం చేస్తున్నటువంటి వ్యక్తి తండ్రి ఆశయాలను ముందుకు కొనసాగించాలని కాకా ఫౌండేషన్ ద్వారా వివిధ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది అటువంటి మహానీయులు కడుపులో వివేక్ లాంటి గొప్ప వ్యక్తి జన్మించడం వారి ఆశయాలను కొనసాగించడం చాలా శుభ పరిణామం అదేవిధంగా భారతీయ జనతా పార్టీలో రాబోయే ఎలక్షన్లలో పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుల గెలిచి కేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగాలని ఆశిస్తున్నాం. ఈ కార్యక్రమంలో జిల్లా కోశాధికారి దుర్గం తిరుపతి, జిల్లా యువ మోర్చా ప్రధాన కార్యదర్శి పాగే రంజిత్ జిల్లా కిషన్ మోర్చా ప్రధాన కార్యదర్శి బండం మల్లారెడ్డి, మండల ప్రధాన కార్యదర్శులు గంట అంకయ్య పూసల రాజేంద్రప్రసాద్, జాడి లక్ష్మణ్, ఉడుముల వెంకట్ రెడ్డి, కంకణాల మల్లారెడ్డి,బొంతల రవీందర్, రవి తదితరులు పాల్గొన్నారు
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే వినయ్భాస్కర్ మాట్లాడుతూ నగరాన్ని టెంపుల్ టూరిజం ప్రాంతంగా అభివృద్ధి చేస్తామన్నారు.
ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు శుక్రవారం త్రినగరాల పర్యటనలో రూ.900 కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారని పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ తెలిపారు.
బుధవారం ఇక్కడ ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, ఇతర బీఆర్ఎస్ నాయకులతో కలిసి విలేకరుల సమావేశంలో వినయ్ భాస్కర్ మాట్లాడుతూ నగరాన్ని టెంపుల్ టూరిజం డెస్టినేషన్గా అభివృద్ధి చేస్తామన్నారు. అదేరోజు హన్మకొండలో ఆర్టీసీ మోడల్ బస్ స్టేషన్కు శంకుస్థాపన చేయనున్నట్లు ఆయన ప్రకటించారు.
బీజేపీతో బీఆర్ఎస్కు ఎలాంటి సంబంధం లేదని, ఆ పార్టీ ఎన్డీయే కూటమిలో చేరాల్సిన అవసరం లేదని కూడా వినయ్ భాస్కర్ అన్నారు. రాష్ట్ర ప్రజలపై బీజేపీకి ప్రేమ ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని బీజేపీకి సవాల్ విసిరారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి డిపాజిట్లు కూడా రావని, ఆ పార్టీకి ఉన్న ఎమ్మెల్యేలు కూడా ఓడిపోతారని వినయ్ భాస్కర్ జోస్యం చెప్పారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం లోని నవాబుపేట గ్రామంలో సర్పంచ్ సాయి సుధా రత్నాకర్ రెడ్డి, గౌడ సంఘం అధ్యక్షులు పొన్నం శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో గౌడ సంఘం కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం భూమి పూజ నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా చిట్యాల జెడ్పిటిసి గొర్రె సాగర్ ఎంపీపీ దావు వినోద వీరారెడ్డి పిఎసిఎస్ చైర్మన్ కుంభం క్రాంతి కుమార్ రెడ్డి జై గౌడ జిల్లా అధ్యక్షులు బొమ్మ శంకర్ గౌడ్ , బుర్ర శ్రీధర్ గౌడ్, ఏరుకొండ రాజేందర్ గౌడ్, ముఖ్య అతిథులుగా విచ్చేసి భూమి పూజ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గౌడ సంగం నాయకులు అనగాని రాజయ్య గౌడ్, మాదారపు రాజ్ కుమార్ గౌడ్, గోపగాని మహేశ్వరి గౌడ్, గోపగాని స్వామి గౌడ్, పొన్నం కొమురయ్య గౌడ్,తదితరులు పాల్గొన్నారు.
సామాజిక వైద్యశాలలో కనీసం రక్త పరీక్షలు చేయలేని దుస్థితి.
సిపిఐ ఎంఎల్ లిబరేషన్ జిల్లా కార్యదర్శి మల్లేష్ .
చిట్యాల, నేటిధాత్రి ;
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలో గురువారం సిపిఐ ఎంఎల్ లిబరేషన్ జిల్లా కార్యదర్శి మారేపల్లి మల్లేష్ మాట్లాడుతూ రోజున ఇటీవల కురిసిన భారీ వర్షాలు వాతావరణంలో వచ్చిన అకాల మార్పులతో సీజనల్ వ్యాధులు వైరల్ ఫీవర్లతో ప్రజానీకం అవస్థలు పడుతున్నారని, డయేరియా టైఫాయిడ్ మలేరియా డెంగ్యూ చికెన్గున్యా అతిసార వంటి వాటికి బాధితులై జనం ఆస్పత్రుల బాట పడుతున్నారు. విష జ్వరాలతో విలవిలలాడుతున్నారు. గ్రామాలలో ఉన్నటువంటి నిరుపేదలు కార్పొరేట్ ఆసుపత్రిలో పోతే విపరీతంగా దోచుకుంటున్నారు వాటిని కట్టడి చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలం అయ్యాయని . ప్రతి గ్రామంలో హెల్త్ క్యాంపు నిర్వహించి వారిని ఆదుకునే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలని అన్నారు మండల కేంద్రంలో ఉన్నటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రజలకు సక్రమమైన వైద్యం అందడం లేదు కనీసం షుగర్ బీపి టెస్టులు చేయడానికి కూడా సిబ్బంది కానరావడం లేదు ప్రభుత్వ ఆసుపత్రులను మరింత బలోపేతంచేయవలసిన అవసరం ఉన్నది, ప్రభుత్వ ఆసుపత్రికి రెగ్యులర్ గా డాక్టర్స్ వచ్చే విధంగా అధికారుల పర్యవేక్షణ చేయాలి విధులకు హాజరు కాని వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం అని అన్నా.రు, వాతావరణ పరిస్థితుల వల్ల దగ్గు జలుబు జ్వరంతో బాధపడుతున్న బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండడం వల్ల గ్రామాలలో హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేయాలని సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీ డిమాండ్ చేస్తుంది అని అన్నారు.
ఇరాక్లోని అతిపెద్ద క్రిస్టియన్ పట్టణంలో మంగళవారం, సెప్టెంబర్ 26న జరిగిన వివాహ వేడుకలో మంటలు చెలరేగడంతో కనీసం 100 మంది మరణించారు మరియు 100 మంది గాయపడ్డారు. విషాదం జరిగినప్పుడు నినెవే ప్రావిన్స్లోని కరాకోష్లోని ఒక విందు హాలులో వందలాది మంది సంబరాలు జరుపుకుంటున్నారు. వధూవరులు డ్యాన్స్ చేస్తుండగా బాణాసంచా కాల్చడంతో మంటలు చెలరేగాయని ప్రత్యక్ష సాక్షులు, సివిల్ డిఫెన్స్ అధికారులు తెలిపారు. హాల్ను కప్పి ఉంచిన అత్యంత మండే మెటల్ మరియు ప్లాస్టిక్ కాంపోజిట్ ప్యానెల్లు మంటలకు ఆజ్యం పోశాయని వారు తెలిపారు
జనగామ జిల్లా స్టేషన్ ఘనాపూర్ మండల కేంద్రంలోని రంగరాయగూడెం లో బిఆర్ఎస్ విస్తృత ఆత్మీయ సమావేశం గ్రామ శాఖ అధ్యక్షుడు చట్ల సురేష్ అధ్యక్షతన నిర్వహించగా ముఖ్యఅతిథి ప్రస్తుత ఎమ్మెల్సీ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కడియం శ్రీహరి హాజరయ్యారు.
అనంతరం సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ అధ్యక్షతన నిజాయితీతో చిత్త శుద్ధితో కార్యాచరణతో అభివృద్ధి పనులు చేస్తానని నాపై నమ్మకం ఉంటే నాకు ఓటు వేయాలని గ్రామ ప్రజలను అభ్యర్థించారు. కచ్చితంగా గెలిచినా అనంతరం గ్రామాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసుకుందామని హామీ ఇచ్చారు. కొన్ని పార్టీలు మీ దగ్గరకు వస్తున్నాయి భాజపా కాంగ్రెస్ పార్టీలను అవదని నమ్మితే మోసపోతామని ఆలోచించి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పథకాలను సంక్షేమ పథకాలను చూసి బిఆర్ఎస్ పార్టీకి ఎమ్మెల్యే అభ్యర్థిగా నా కారు గుర్తుకు ఓటు వేసి ముచ్చటగా మూడోసారి కేసీఆర్ ముఖ్యమంత్రి చేయాలని ప్రజలను కోరారు.
ఈ కార్యక్రమంలో ఎంపిటిసి శైలజ – అజయ్ రెడ్డి రైతు కోఆర్డినేటర్ తోట వెంకన్న, జనగామ జిల్లా రూరల్ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బెలిద వెంకన్న, చాగల్ సర్పంచ్ సారంగ పాణీ, జిల్లపల్లి స్వామి, ముఖ్య కార్యకర్తలు మహిళలు తదితరులు పాల్గొన్నారు
ఆలయ ధర్మకర్తలు శ్రీమతి లలిత ద్వివేదుల మరియు శైలేష్ భాగవతుల గారి ఆధ్వర్యంలో గణపతి ఊరేగింపు వేడుకలు కాల్గరీ నగర డౌన్ టౌన్ వీధులలో కన్నుల పండుగగా నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ రాజ్కుమార్ శర్మ గారు మందిరంలో ప్రతిరోజు గణపతి అభిషేకము, అర్చన, గణపతి హోమము మరియు హారతులు విధిగా నిర్వహించారు. గణపతి నవరాత్రి మరియు ఊరేగింపు సంబరాలు ఘనంగా నిర్వహించుటకు చాలా మంది వాలంటీర్లు మరియు వ్యాపార యజమానులు తమ ప్రత్యేక సహాయాన్ని అందించారు నగర వీధుల్లో గణపతి ఊరేగింపు కోసం హెచ్&హెచ్ డెకర్స్, హేమ మరియు హర్షిణి ట్రక్ ను ఎంతో అందంగా అలంకరించారు. గణనాధుని యాత్రకు కాల్గరీ ఎమ్మెల్యే అయిన గౌరవనీయులైన పీటర్ సింగ్ గారు విచ్చేసారు, ఊరేగింపులో పాల్గొన్న భక్తులను, ప్రజలను ఉద్దేశించి కాల్గరీ నగరంలో ఇటువంటి దైవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు శ్రీ అనఘా దత్త యజమాన్యం వారిని ప్రశంసించారు. మరిన్ని భారతీయ సంప్రదాయాన్ని చాటిచెప్పే ఇటువంటి కార్యక్రమలని, అల్బెర్టా ప్రావిన్స్ కల్చర్ డేస్ ను పురస్కరించుకుని భారతీయ శాస్త్రీయ కళలు మరియు నృత్య కచేరీలు, హిందూ వారసత్వ వేడుకలు జరుపుతున్నందుకు శ్రీమతి లలిత మరియు శైలేష్ ను ఎంతో అభినందించారు. గణపతి ఉరేగింపును అర్చకులు శ్రీ రాజ్ కుమార్ గారు గణపతి తాళం, అర్చన, హారతి తో ప్రారంభించగా భక్తులు “శ్రీ గణేష్ మహరాజ్ కి జై” అనే నినాదాలతో యాత్ర కొనసాగింది. లోహిత్, ఓం సాయి మరియు ఫణి భజనలతో, పాటలతో గణపతిని స్తుతించారు. కాల్గరీ సిటీ మునిసిపల్ హాల్ వద్ద మొదలైన గణపతి ఊరేగింపు షా మిలీనియం పార్క్ చేరుకునే వరకు సుమారు ఐదు వందలకు పైగా భక్తులు ఆనందంతో నాట్యం చేస్తూ గణపతి నామ సంకీర్తన చేశారు. ఉత్తర అమెరికా ఖండంలో ఇటువంటి వేడుకలు జరపడం కష్టమైనప్పటికీ శ్రీ అనఘా దత్తా సొసైటీ ఆఫ్ కాల్గరీ యాజమాన్యం మరియు సభ్యులు ఎన్నో దైవ కార్యక్రమాలు నిర్వహిస్తూ, రానున్న భావితరాలకి భారత సంప్రదాయ పూల బాటలు వేస్తున్నారని అందరూ ప్రశంసించారు. ఊరేగింపు ముగిసిన తర్వాత గణపతికి హారతి ఇచ్చి భక్తులందరికి ప్రసాద వితరణ చేశారు. కెనడా లో హిందూ వారసత్వ వేడుకల్లో నిర్వహించిన వయోలిన్ కచేరీ లో కెనడాలో, యూఎస్ఏలో ఉన్న విద్వాంసులైన srimathi Aarathi shankar, Srimati Anjana Srinivasan వయోలిన్ వాయించగా , శ్రీ ఆదిత్య నారాయణ్ మృదంగం తో, శ్రీ రమణ ఇంద్ర కుమార్, ఘటం తో , శ్రీ రత్తన్ సిద్ధు, తంబురాలతో సహకరించారు. విద్వాంసుల అందరిని అనఘా దత్త సంఘం అధ్యక్షురాలు శ్రీమతి లలిత బహుమతులతో ఘనంగా సత్కరించారు. అక్టోబర్ మాసంలో రానున్న దేవి నవరాత్రి ఉత్సవాల కి శ్రీమతి లలిత, స్వచ్ఛంద సేవకులైన శోభన నాయర్, మాధవి చల్లా, మాధవి నిట్టల, కళైజ్ఞర్ సంతానం మరియు అర్చకులు రాజ్కుమార్ ఘనమైన సన్నహాలు జరుపుతున్నారు. శ్రీ అనఘా దత్త సంఘం వారు నిర్వహించు దేవి నవరాత్రి వేడుకలతో, కొన్ని వేల మంది భక్త జన సమూహం తో పూజలనందుకునే అనఘా అమ్మవారి వేడుకల వల్ల కెనడా లో కాల్గరీ నగరం “కాళి” గిరి గా మారుతుందని భక్తులు తమ సంతోషాన్ని వ్యక్తపరిచారు. శ్రీమతి లలిత గారు మరియు ఎన్నో వాలంటీర్లు రేయిం బవళ్ళు శ్రమించారు. ఈ వేడుకల్లో షుమారు 800 మందికి పైగా పాల్గొని ఈ వేడుకలు జయప్రదంగా ముగిసింది.
తెలంగాణ పోరాటి సాధించుకున్న ఆత్మ గౌరవ పతాక. స్వాభిమాన వీచిక. గుండె ధైర్యం నిండిన విజయ వేధిక. ఉద్యమమే నినాదమైన, తెలంగాణ పదమే వేదమైన కరదీపిక. దేశానికే వెలుగు రేఖ. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల స్వావలంబన గీతిక. ఇంత గొప్పది నా తెలంగాణ. ఆ తెలంగాణ రావడానికి, నేడు బంగారు తెలంగాణ నిర్మాణం జరిగింది ఒక్కరితోనే. ఆ ఒక్కరే ముఖ్యమంత్రి కేసిఆర్. అసలు తెలంగాణ అంటేనే పోరాటాల గడ్డ. ఆత్మాభిమాన ఉద్యమ బాట. తెలంగాణకు పోరాటం కొత్త కాదు. గెలవడం కొత్త కాదు. సమస్యలు కొత్త కాదు. వాటిని అధిగమించడం కొత్త కాదు. గెలిచి నిలబడిన చరిత్ర కొత్త కాదు. ఎప్పుడూ ఏదో ఒక చరిత్ర సృష్టించడమే తెలంగాణ గొప్పదనం. ప్రపంచ దేశాలకే పోరాట విలువలు నేర్పిన ఏకైక ప్రాంతం తెలంగాణ. నిజాం కాలంలో రైతంగా సాయధ పోరాటమైనా, ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమమైనా వ్యవస్ధలకు పట్టుదలను రుచి చూపించిన నిఘంటువు నా తెలంగాణ. భూమికోసం , భుక్తి కోసం, బానిస సంకెళ్ల విముక్తికోసం పోరాటాలు ఎన్ని జరిపినా అలసిపోలేదు. అలాగే అభివృద్దిలోనూ ఆగిపోలేదు. పోరాటమైనా, ప్రగతి దారైనా ముందుకే. తెలంగాణ ఎవరి సహాకారం కోరదు. తెలంగాణ ఎవరి మీద ఆధారపడదు. ఇది నిరూపించిన నాయకుడు ముఖ్యమంత్రి కేసిఆర్. తెలంగాణ రాక ముందు ఉద్యమ సమయంలో సీమాంధ్ర నేతలు ఎన్ని మాటలు అన్నారో విన్నాం. తెలంగాణ వచ్చిన తర్వాత దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గత పదేళ్లుగా తెలంగాణ గురించి మాట్లాడుతున్న మాటలు వింటున్నాం. అయినా ఎక్కడా వెరవలేదు. ఆగిపోలేదు. అలసిపోలేదు. దేశంలో అన్ని రాష్ట్రాలను దాటకుంటూ ముందుకు వెళ్తున్నాం. ఒక్క మాటలో చెప్పాలంటే ఏనాడో గుజరాత్ను వెనక్కి నెట్టేశాం. ఇదే బిజేపికి నచ్చని విషయం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటును బిజేపి సహకరించిందన్న మాట మినహా…2014 నుంచి తెలంగాణ కోసం కేంద్రం ఏ సహాయం చేయలేదన్నది తెలుసుకోవాలి. 2014 ఎన్నికల్లో సాక్ష్యాత్తు తిరుమల వెంకటేశ్వర స్వామి కొండ కింద ప్రధాని మోడీ మాట్లాడుతూ తల్లిని చంపి బిడ్డను బ్రతికించారని అన్నారు. ఆ తర్వాత ఆ మాటను అనేక మార్లు ఉటంకించారు. అవకాశం దొరికనప్పుడల్లా తెలంగాణ మీద విషం కక్కారు. తెలంగాణ ఏర్పాటు కావడం తనకు ఇష్టం లేదన్నంతగా పరక్ష వ్యాఖ్యలు చేశారు. 1998లో కాకినాడలో జరిగిన బిజేపి పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలలో ఒక ఓటు రెండు రాష్ట్రాలు అంటూ తీర్మాణం చేసి, ఉత్తరాధిన మూడు రాష్ట్రాలు ఇచ్చింది. కాని తెలంగాణను వదిలేసింది. నిజానికి బిజేపి ప్రభుత్వ హాయంలో ఇచ్చిన మూడు రాష్ట్రాలకన్నా ముందు నుంచి సాగుతున్న ఉద్యమం తెలంగాణది. 1956లోనే నాటి ప్రధాని నెహ్రూ తెలంగాణ ప్రజలు వద్దనుకున్న నాడు ప్రత్యేకమైపోవచ్చు. అని కూడా చెప్పారు. కాని ఆయన హయాంలో కుదరలేదు. ఆ తర్వాత ఇందిరాగాంధీ ఇవ్వలేదు. ఎవరూ ఇవ్వలేదు. ఆఖరకు ముఖ్యమంత్రి కేసిఆర్ సారధ్యంలో సాగిన పద్నాలుగేళ్ల నిరంతర పోరాటం తర్వాత తెలంగాణ వచ్చింది. దీన్ని కూడా ప్రధాని నరేంద్ర మోడీ జీర్ణించుకోవడం లేదు. గతంలో పాత పార్లమెంటులో పలుసార్లు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును తప్పుపట్టారు. ఆఖరుకు ఇటీవల కొత్త పార్లమెంటు తొలి రోజున కూడా తెలంగాణ రాష్ట్రం ఇవ్వడంతో రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలు సంతోషంగా లేరన్నారు. ఇదే ఒక ప్రధాని చేయాల్సిన వ్యాఖ్యలు. అయినా సరే తెలంగాణ ప్రజలు భరిస్తూనే వున్నారు. ఇక తెలంగాణ ఇస్తే చిమ్మ చీకట్లౌతుందని సీమాంధ్ర నేతలు అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్రెడ్డి అసలు తెలంగాణ మనుగడే సాధ్యం కాదన్నారు. తెలంగాణ వస్తే ఇక అంధకారమే అంటూ కర్ర పట్టుకొని చీకట్లో నిలబడి కరంటు లెక్కలు చెప్పాడు. ఇప్పుడు ఆ కిరణ్కుమార్ రెడ్డే తెలంగాణ వెలుగులను చూస్తున్నారు. తెలంగాణ వస్తే కనీసం పెండిరగ్ ప్రాజెక్టులు కూడా పూర్తి చేసుకోలేరనాన్నరు. హైదరాబాద్లో మత కల్లోలాలు వస్తాయన్నారు. అసలు తెలంగాణ భూములు తొండలు గుడ్లు పెట్టడానికి కూడా పనికిరావన్నారు. ఇలా ఎవరికి ఇష్టమెచ్చినట్లు వాళ్లుమాట్లాడారు. తెలంగాణ పూర్వ చరిత్ర ఏమిటో తెలుసుకోకుండా ఎవరికి తోచించి వారు మాట్లాడారు. కాని తెలంగాణకు ఒక చరిత్ర వుంది. తొలి తెలుగు చరిత్ర మొదలైందే తెలంగాణలో…కరీంనగర్ జిల్లాలోని కోటి లింగాలలోనే తొలి శాతవాహన చరిత్రకు శ్రీకారం జరిగింది. ఆ తర్వాతే ధాన్య కటకానికి వెళ్లింది. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ చరిత్రను కనుమరుగు చేశారు. అలా మొదలైన తెలంగాణ ప్రస్తానం కాకతీయ కాలంలో ఉచ్చదశకు చేరుకున్నది. సంపన్న ప్రాంతమై విలసిల్లింది. సుమారు 300 సంవత్సరాలకు పైగా సాగిన కాకతీయ చరిత్రలోనూ తెలంగాణది స్వర్ణయుగమే. ఆ తర్వాత మొగలులపాలనైనా, నిజాం పాలన దాకా తెలంగాణలో కరువు లేదు. ఎందుకంటే నిజం కాలంలో హైదరాబాద్ వజ్రాల వ్యాపారానికి పేరెన్నిక కగన్నది. లండన్ మహారాణికి అత్యంత విలువైన వజ్రాల హారాన్ని బహూకరించింది నిజాం రాజు. లండన్ వీధుల్లో తిరిగే రోల్స్ రాయిస్ కార్లతో హైదరాబాద్ వీధులు ఊడిపించిన చరిత్ర తెలంగాణది. అలాంటి తెలంగాణపై ఎవరు వ్యాఖ్యలు చేసినా వాళ్లే చరిత్ర హీనులయ్యారు. అలాంటి తెలంగాణను తెచ్చింది కేసిఆర్. నిలబెట్టింది కేసిఆర్. పదేళ్లలో తెలంగాణ ప్రగతి రాకెట్ కన్నా వేగంగా దూసుకెళ్లింది. అసలు తెలంగాణలో తాగు నీరే దొరకదు. ఇక సాగు నీటి సంగతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదన్నారు. అలాంటి తెలంగాణలో కేంద్రం నుంచి రూపాయి సాయం లేకున్నా,ఎలాంటి సహాకారం లేకున్నా కాళేశ్వరం లాంటి అధ్భుతమైన ప్రాజెక్టును ఎవరూ ఊహించని రీతిలో నిర్మాణం జరిగింది. తెలంగాణ మొత్తం సస్యశ్యామం చేసేందుకు కారణమైంది. అసలు తెలంగాణ సాధించిన మూడేళ్లకే కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు పూర్తి చేయడం అంటే మాటలు కాదు. మంత్రి హరీష్రావు రాత్రింబవళ్లు పర్యవేక్షణ, ముఖ్యమంత్రి కేసిఆర్ పరిశీలన, అంకిత భావం వున్న తెలంగాణ ఇంజనీరింగ్ వ్యవస్ధ కలిసి సృష్టించిన భగీరధ నిర్మాణం కాళేశ్వరం. అదే సమయంలో నిర్మాణం మొదలైన పోలవరం అక్కడే ఆగిపోయింది. కాళేశ్వరం పూర్తి చేసుకున్న తర్వాత మొదలు పెట్టిన పాలమూరు..రంగారెడ్డి కూడా పూర్తియ్యింది. దాంతో తెలంగాణ మొత్తం నీటి గంగాలమైంది. వీటి నిర్మాణం సాగుతుండగానే తెలంగాణలోని నలభై ఆరు చెరువులకు పూర్వ వైభవం తేవడం జరిగింది. అనేక రిజర్వాయ్యర్లు నిర్మాణం చేసుకోవడం జరిగింది. ఎన్నేళ్ల కలగానో మిగిలిపోయిన మానేరు ప్రాజెక్టులన్నీ పూర్తయ్యాయి. ఖమ్మంలో సీతారామా లాంటి ప్రాజెక్టులు కూడా నీళ్లందిస్తున్నాయి. నీటి చుక్కకు కోసం కన్నీళ్లు కార్చిన తెలంగాణ కళ్లలో ఆనందభాష్పాలు చూస్తున్నామంటే అది కేసిఆర్. ఆయన సాగునీటి రంగాన్ని, వ్యవసాయ రంగాన్ని ఒక యజ్ఞంగా చేపట్టారు. తెలంగాణ మొత్తం నీరందించి, సస్యశ్యామలం చేశారు. ఇక కరంటు కష్టాలు తెలంగాణ తెచ్చిన మూడు నెలల్లో తీర్చాడు. రైతాంగానికి దేశంలో ఎక్కడా లేని విధంగా 24 గంటల కరంటు ఇస్తున్నారు. హైదరాబాద్ను పెట్టుబడుల స్వర్గధామం చేశాడు. ప్రపంచమంతా హైదరాబాద్ వైపు చూసేలా చేశాడు. ఐటి రంగానికి కేరాఫ్ చేశాడు. పార్మా రంగంలో తెలంగాణను అగ్రగామి చేశాడు. హైదరాబాద్లో ట్రాపిక్ సమస్యకు పరిష్కారం చూపెట్టారు. ఈ పదేళ్ల కాలంలో 37 కొత్త ప్లైఓవర్లు నిర్మాణం చేశారు. కొత్త కొత్త నిర్మాణాలు చేసి, హైదరాబాద్ రూపు రేఖలు మార్చేశారు. కొత్త సెక్రటెరియేట్, ముప్పై మూడు జిల్లాల్లో కొత్త జిల్లా కలెక్టర్ల సముదాయ భవనాలు. అమర వీరుల స్మృతి వనం. 125 అడుగుల అంబెద్కర్ విగ్రహంతో కొత్త హైదరాబాద్ను ఆవిష్కరించారు. తెలంగాణను ఆరోగ్యవంతమైన రాష్ట్ర్రంగా తీర్చిదిద్దుతున్నారు. 33 జిల్లాల్లో కొత్తగా వైద్య విద్యాలయాలు ఏర్పాటుచేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే కేంద్రం సహాకారం లేకుండా, పైసా సాయం లేకుండా నిలబడిరది తెలంగాణ. దాన్ని రూప శిల్పి ముఖ్యమంత్రి కేసిఆర్. ఆయన పేరే ఒక బ్రాండ్. హైదరాబాద్ ఇప్పుడు సరికొత్త ట్రెండ్. దటీజ్ తెలంగాణ…దిసీజ్ ముఖ్యమంత్రి కేసిఆర్ పాలన. ఎనీ డౌట్!
`గణేష్ నిమజ్జనాల కోసం తెలంగాణ నుంచి విజయవాడ వరకు వెళ్లాల్సివచ్చేది.
`తెలంగాణ పట్టణ పరిసరాల చెరువుల్లో చుక్క నీరుండేది కాదు.
`కాళేశ్వరం ఇసక ఎడారిని తలపించేది.
`సమ్మక్క జాతరలో జంపన్న వాగులో చుక్క నీరుండేది కాదు.
` కేవలం జాతర కోసం నీళ్లు వదిలే వారు.
`ఇప్పుడు నిరంతరం జంపన వాగులో నీటి ప్రవాహం.
`పుష్కరాలప్పుడు ఆంధ్రా వెళ్లాల్సిందే.
`ఇదీ ఆనాటి తెలంగాణ దుస్థితి.
`ఇప్పుడు ప్రతి పల్లె ఒక నీటి గంగాళం.
`ప్రతి చెరువులో నిరంతరం జలం.
`కుల వృత్తులకు ఆదాయ మార్గం.
`పొలాల గొంతు తడుపుతున్న గంగమ్మ ప్రతిరూపం.`
పాడిపంటలందిస్తున్న అష్టలక్ష్మి వైభవం.
హైదరాబాద్,నేటిధాత్రి:
కళ తప్పిన నా తెలంగాణ చెరువుకు మళ్లీ జీవమొచ్చింది. చెదిరిన చెరువుకు జలజీవమొచ్చింది. చెరువు బాగైంది. అందమైన నీటి బాంఢగారమైంది. మా చెరువుకు పూర్వ వైభవం వచ్చింది. అంతకన్నా సుందరంగా ముస్తాబైంది. జలమంత చెవరుకు జగమంత పండగొచ్చింది. ఊరంతా మురిసింది. ఊరే మెరిసింది. సంబరాలు చేసుకున్నది. కూలి పోయిన కులవృత్తులకు మళ్లీ తెలంగాణ పల్లె ఆలవాలమైంది. చెరువే తెలంగాణ పల్లెకు ఆదెరువు. అది ఉమ్మడి రాష్ట్రంలో చెదిరిపోయింది. చిద్రమైపోయింది. పల్లె బతుకు ఆగమైంది. కులవృత్తులు అంతరించిపోయాయి. మత్స సంపద కానరాకుండాపోయింది. దాని మీద ఆధారపడే మురిరాజ్లు నారాజైండ్రు. కొత్త ఉపాధి బాటనెంచుకున్నారు. ఊరు వదిలి పట్టణాలు వలస వెళ్లిండ్రు. బొంబాయి లాంటి ప్రాంతాలలో కూలి పనులు చేసుకున్నారు. తెలంగాణలో మత్స సొసైటీలన్నవి కనుమరుయ్యాయి. చెరువే లేక ముదిరాజ్ల జీవనమే ఆగమైంది. ఇలా చెరువు ఎండిపోయి సాగు లేకుండాపోయింది. చెరువులో నీరు లేక పశు సంపద మృగ్యమైంది. మొత్తంగా పల్లెకు గ్రహణం పట్టినంత పనైంది. తెలంగాణ వచ్చింది. తెలంగాణ పల్లెకు మళ్లీ సొగసొచ్చింది. చెరువుకు సోయగమొచ్చింది. తెలంగాణ రాగానే చెరువుకు నీరొచ్చింది. వానా కాలం కాకపోయినా చెరువు నిండిరది. ఏళ్ల తరబడి గొంతెండి పోయిన చెరువు దాహంతీరేదాకా నిండిరది. చెరువు నింపడంతో ఊరంతా పచ్చబడిరది. భూగర్భమంతా నీరు సందడి చేస్తోంది. పల్లెకు పండగొచ్చింది. మళ్లీ సాగు చిగురించింది. ఎండిన బీడులు పొలాలయ్యాయి. గుంట కూడా వదిలిపెట్టకుండా పంట పండుతోంది. ఊరిని సుసంపన్నం చేస్తోంది. చెరువు కుల వృత్తులకు ఆధారమైంది. ఆదాయం సమకూర్చుతోంది. పల్లె జీవితాలను నిలబెట్టింది. ఇదీ తెలంగాణ చెరువుల ఘనత. ముఖ్యమంత్రి కేసిఆర్ తెలంగాణకు అందించిన కలల పంట. ఒకనాడు నా చెరువులో నీటి చుక్క లేక కొన్ని దశాబ్దాలు ఎండిపోయింది. కాదు..నాటి ఉమ్మడి పాలకుల నిర్లక్ష్యం మూలంగా ఒట్టిపోయింది. వర్షాకాలంలో కూడా చెరువులోకి నీరు రాకుండాపోయింది. ఓ వైపు కరువు. మరో వైపు పాలకుల దుర్మార్గం. ప్రకృతి పగబట్టినట్లే కొన్ని దశాబ్దాల పాటు తెలంగాణను చినుకు ముద్దాకుండా శాపానికి గురైంది. ఉమ్మడి పాలకుల కోపానికి గురైంది. దాంతో తెలంగాణ చెరువు పూర్తిగా ఎండిపోయింది. తన ఆనవాలు తానేమర్చిపోయింది. ఒక దశలో గణేష్ నిమజ్జన సమయంలో విగ్రహాల నిమజ్జనానికి కూడా చుక్క నీరు లేక తెలంగాణ గోసపడిరది. అయ్యో గణనాధా? అంటూ బోరున విలపించింది. భక్తిభావంతో నిలుపుకొని కొలిచిన దేవుడిని నీరు లేని చెరువులో నిమజ్జనం చేయలేక, కొన్ని సార్లు విజయవాడ లాంటి ప్రాంతాలకు కూడా తీసుకెళ్లిన సందర్భాలున్నాయి. ఇక తెలంగాణ పల్లెల్లో కూడా ఎక్కడ ఏ చెరువులో నీరుందో తెలుసుకొని ఎంత దూరమైనా వెళ్లి నిమజ్జనం చేసిన ఘటనలున్నాయి. ఇదీ ఆనాడు తెలంగాణ దీనస్దితి. ఇక తెలంగాణలో ఎంతో గొప్పగా జరుపుకునే ఆది వాసి సమ్మక్క సారక్క జాతర. రెండేళ్లకోసారి ఎంతో వైభవంగా తెలంగాణలోని ములుగు జిల్లాలో ఈ జాతర జరుగుతుంది. తలాపున గోదారి పరుగులుపెడుతుంది. కాని సమ్మక్క సారక్క జాతర ప్రాంతంలో జంపన్న వాగు ఎప్పుడూ ఎండిపోయి వుండేది. జాతర సమయంలో జంపన్న వాగులోకి గోదావరి నదీ జలాలు వదిలేవారు. ఆసియాలోనే అత్యంత గొప్ప జాతరగా గుర్తింపు వున్న మేడారం జాతరలో నీటి కట కట అలా వుండేది. కనీసం భక్తులు స్నానాలు చేసేందుకు కూడా నీరు సమృద్దిగా వుండేది కాదు. మరి ఇప్పుడు నిరంతరం జంపన్న వాగు జీవ నదిలా పారుతోంది. మేడారం వచ్చిన భక్తుల పాపాలను కడిగేస్తూ నిరంతరం సాగిపోతోంది. ఇదీ నా తెలంగాణ. ఇక పుష్కరాల సమయం అంటే చాలు ఆంధ్రాకు పండగ. తెలంగాణలో కూడా కృష్ణా, గోదారి నదులు పారుతున్నా వాటిలో స్నానం చేసేందుకు కూడా ఉమ్మడి పాలకులు అవకాశం కల్పించేవారు కాదు. అసలు తెలంగాణలో పారుతూవున్న గోదారి నీళ్లకన్నా, రాజమండ్రి వెళ్తేనే పుణ్యం అన్నంతగా ప్రచారం చేసేవారు. కృష్ణా నది పుష్కరాల సమయంలో విజయవాడలో స్నానం చేస్తేనే పుణ్య స్నానం పూర్తయినట్లు చెప్పేవారు. దాంతో తెలంగాణలో ఆ నదులున్నా, ఆ ప్రాంతాలను నిర్లక్ష్యం చేశారు. నీటి గోసకు, నిర్లక్ష్యానికి తెలంగాణను కేరాఫ్ అడ్రస్ చేశారు. తెలంగాణ ప్రజలు ఆగమౌతుంటే నవ్వుకున్నారు. నా తెలంగాణ పచ్చబడాలి. పల్లె కళకళలాడాలి. పచ్చ దనం వెల్లివిరియాలి. పాడి పంట సమృద్ధిగా మారాలి. పల్లెలో కరువును తరిమివేయాలి. పల్లెకు మళ్లీ వెలుగు రావాలి. ఊరంతా పండగ కావాలి. అంటే ముందు చెరువు బాగు పడాలి. చెరువుకు పూర్వ వైభవం తేవాలని ముఖ్యమంత్రి కేసిఆర్ సంకల్పించారు. తెలంగాణలో వున్న నలభై ఆరు వేల చెరువులను మూడేళ్లలలో దశల వారిగా బాగు చేశారు. ముందు కరువు రక్కసితో బాధపడుతున్న ప్రాంతాలను గుర్తించారు. తొలి విడతలో ఆ చెరువుల బాగుకు ప్రణాళికలు తయారు చేశారు. తెలంగాణ వచ్చిన తొలి ఏడాది నుంచే చెరువుల మరమ్మత్తులకు శ్రీకారం చుట్టారు. ముందు చెరువుల్లో పూడిక తీయించారు. చెరువు కట్టలు బాగు చేశారు. వాటిపై తాటి, ఈత చెట్లు పెంచారు. 2015లోనే చెరువులు గోదావరి నీళ్లతో నింపడం మొదలు పెట్టారు. ఒక్కసారిగా తెలంగాణ వాతావరణం మారిపోయింది. కొన్ని దశాబ్దాలుగా చుక్క నీటిని చూడని చెరువులు ఎండకాలంలో మత్తళ్లు పోశాయి. వాగులు వంకలు వానలు లేకున్నా పారాయి. మత్తళ్లు దుంకుతూ పారిన జలాలు గొలుసు కట్టు చెరువుల బాటన ఒక చెరువు నుంచి మరో చెరువు చేరాయి. ఇలా తెలంగాణలో చెరువులన్నీ నిండాయి. ఊళ్లన్నీ పచ్చబడ్డాయి. ఎండిపోయిన బావుల్లో ఊటలు మొదలయ్యాయి. వానాకాలంలో ఎల్లబోసే బావులు ఎండాకాలంలో కూడా ఎల్లబోశాయి. ఎండిన బోర్ల నీళ్లతో నిండాయి. ఇంతలో నిరంతర ఉచిత కరంటు వచ్చింది. రైతులకు వరమైంది. పాడి పంటల పండుగలు మళ్లీ మొదయ్యాయి. ఇలా చెరువులు నీటి గంగాళాలై నిత్యం కళకళలాడుతున్నాయి. ఒకప్పుడు చెరువు ఆనవాలు వుందా? అన్న అనుమానం వున్న చోట చెరువు లోతుగా వుంది. అంటూ బోర్డులు కనిపిస్తున్నాయి. ప్రతి పల్లెలో నీటి సవ్వడులు వినిపిస్తున్నాయి. తెలంగాణ చెరువులు నిండి మత్స సంపదకు ఆలవాలమైంది. పొలాలు తడిపే గంగమ్మతల్లి ప్రతిరూపమైంది. ఒక రకంగా చెప్పాలంటే పాడిపంటల సంపదనందిస్తూ, అష్టలక్ష్మి వైభవం పల్లె చూస్తోంది. ఇదంతా కేసిఆర్ వల్లనే సాధ్యమైంది. అపర భగీరధుడు కలలు గన్న తెలంగాణ ఆవిషృతమైంది. తెలంగాణ సస్యశ్యామలమైంది. ఈ తరానికి చెరువును చూపించడమే కాదు, పాడి పంటలను అందించే వరంగా తీర్చిదిద్దారు. మలి తరానికి బంగారు బాటలు వేశారు.Continue reading నా చెరువు నాడు…నేడు!
`ప్రత్యామ్నాయ శక్తులు అనే పదానికి తెలంగాణలో చోటు లేదు.
`సమ్మిళిత వృద్దిలో సకలజనులున్నారు.
`ప్రతిపక్షాలలో కూడా ప్రభుత్వ పథకాలు అందుకున్న వారు వున్నారు.
`వాళ్ల మనసులో కూడా వుంది కారే!
`వారి మనసు కోరుకుంటోంది కేసిఆర్ నే!
హైదరాబాద్,నేటిధాత్రి:
జలం ఈ పదం వింటేనే తెలంగాణ జనం మనసు పులకరిస్తుంది. తనువు పరవశిస్తుంది. ఎందుకంటే నీటి కోసం తెలంగాణ పడిన గోస అంతా ఇంతా కాదు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ పల్లెలు నీటి కోసం అల్లాడాయి. ఒకప్పుడు తెలంగాణ గొలుసుకట్టు చెరువులతో కళకళలాడుతూ వుండేది. ఒక్క తెలంగాణ లోనే సుమారు 60వేలకు పైగా చెరువులుండేవి. జలకళలతో కళకళలాడుతూ వుండేవి. నిజాం కాలంలో వ్యవసాయం మీద వచ్చే పన్నుతోనే అప్పటి హైదరాబాదు రాష్ట్రం సిరి సంపదలతో తులతూగుతూ వచ్చేది. ప్రపంచంలోనే నిజాం నవాబు అధిక సంపన్నుడు కావడానికి కారణం తెలంగాణలో సాగు సంపదే కారణం. నిజాం పాలన నుంచి విముక్తి జరిగి, హైదరాబాదు రాష్ట్రం ఏర్పాటైంది. అలా స్వేచ్చా వాయువులు పీల్చుకున్నదో లేదో, భాషా ప్రయుక్త రాష్ట్రాల పేరుతో మళ్ళీ తెలంగాణకు కష్టాలు మొదలయ్యాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుతో తెలంగాణ ప్రజల జీవితాలు పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్లైంది. తెలంగాణ రాష్ట్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో విలీనమై సమయంలో మిగులు రాష్ట్రం. తెలంగాణ వనరులు ఆంధ్రప్రదేశ్ కు తరలించారు. తెలంగాణ ఆదాయం తో సీమాంధ్ర లో సాగు నీటి ప్రాజెక్టులు నిర్మాణం చేశారు. శ్రీశైలం, నాగార్జున సాగర్ లతో పాటు పోతిరెడ్డిపాడు ఇలా చెప్పుకుంటూ అనేక ప్రాజెక్టులతో సీమాంధ్ర ను సస్యశ్యామలం చేసుకున్నారు. తెలంగాణ ను ఎండబెట్టారు. అరవై ఏళ్ల పాలనలో తెలంగాణ సాగు రంగాన్ని పూర్తిగా విధ్వంసం చేశారు. ఎన్నికలు రాగానే శంకుస్థాపనలు. తెలంగాణను అరవై ఏళ్లు మభ్యపెట్టి, మాయ చేసి దోచుకున్నారు. తెలుగు జాతి మనది నిండుగ వెలుగు జాతి మనది అంటూ ఆంధ్రా అభివృద్ధి చేసుకున్నారు. తెలంగాణ ను ఎందుకు కాకుండా చేశారు. తెలుగు దేశం పార్టీ అధికారంలోకి వచ్చాక తెలంగాణ మరింత విధ్వంసానికి గురైంది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాల హయాంలో నీటి దోపిడే జరిగేది. తెలుగుదేశం వచ్చాక వనరులు కొల్లగొట్టి, తెలంగాణ ను పీల్చి పిప్పి చేసింది. తెలంగాణ నీళ్లు, నిధులు, నియామకాలు పూర్తిగా దోచుకున్నారు. తెలంగాణ ఏ మారు మూల ప్రాంతంలో చిన్న ఉద్యోగంలో కూడా ఆంద్రా వాళ్లే…తెలంగాణ సాగు విపరీతమైన విద్వంసం చేశారు. చిన్న చిన్న ప్రాజెక్టులు కూడా పక్కనపెట్టారు. తెలంగాణ ను నీళ్లిస్తే ఆంధ్రాకు కష్టమవుతుందని ప్రాజెక్టులు పూర్తి పూర్తి చేయలేదు. పైగా నికర జలాలు ఆంద్రాకు తరలించి, వరద జలాలు తెలంగాణ కు అని చెప్పి మోసం చేశారు. అవి కూడా ఇవ్వకుండా తెలంగాణను ఆగం చేశారు. ఒక దశలో తెలంగాణ ప్రాజెక్టుల ఊసెత్తొద్దని కూడా చంద్రబాబు హుకూం జారీ చేశారు. తెలంగాణ కు నీళ్లు ఇవ్వాలంటే ఎత్తిపోతల ప్రభుత్వం వల్ల కాదన్నారు. తెలంగాణ ఊర్లన్ని వలసలు పోతున్నా చూస్తూ ఊరుకున్నారు. సీమాంధ్రులు హైదరాబాదు పరిసర ప్రాంతాల చెరువులన్నీ మాయం చేశారు. తెలంగాణ చెరువుల ఆనవాలు లేకుండా ధ్వంస రచన సాగించారు. ప్రాజెక్టులు కట్టకపోయినా, కనీసం చెరువుల బాగు చేయడానికి కూడా చేతులు రాలేదు. తెలంగాణ ను ఎడారి చేశారు.
అలాంటి తెలంగాణ లో ఇప్పుడు జలమే జలం…ఎక్కడ చూసినా జలమే…ఏ దిక్కు చూసినా పొలమే…పచ్చదనమే…
మరి సరిగ్గా పదేళ్ల క్రితం ఎక్కడ చూసినా ఎండిన బీడులే. ఒట్టిపోయిన వాగులే…ఆనవాలు కోల్పోయిన వాగులే…జల జాడ లేకుండా పోయింది. భూ గర్భ జలాలు పూర్తిగా అడుగంటిపోయిన స్థితి. కరువు రక్కసి చేతిలో విలవిలలాడిపోయింది. పనికి ఆహార పథకం పనిలో ఏ పూట బియ్యం ఆ పూట తెచ్చుకొని కూలి చేసుకునేంతగా దిగజార్చారు. అలా తెలంగాణను ఏడిపించారు. ఆ వేధన నుంచి, ఆ నిర్వేదం నుంచి, ఆ ఆక్రోశం నుండి వచ్చిందే తెలంగాణ ఉద్యమం…. కేసిఆర్ రూపంలో ప్రపంచ ఉద్యమాల చరిత్రకే ఒక గొప్ప పాఠం. అలాంటి నేత చేతిలో తెలంగాణ బంగారమైంది. ప్రాజెక్టులు సాధ్యమే కాదన్న చోట కాళేశ్వరం నిర్మాణం జరిగింది. ప్రపంచంలోనే అత్యంత వేగవంతంగా కాళేశ్వరం పూర్తి చేసి, ఎండిన తెలంగాణ ను సస్యశ్యామలం చేశారు. నా తెలంగాణ కోటిన్నర ఎకరాల మాగాణ చేశారు. అటు కాళేశ్వరం, ఇటు పాలమూరు.. రంగారెడ్డి, మల్లన్న సాగర్ వంటి అనేక రిజర్వాయర్లు నిర్మాణం చేశారు. అంతకు ముందే తెలంగాణ ను జలపాతం చేశారు. కాలువలు తీసి చెరువుల నింపారు. చెరువుల్లో పూడిక తీసి, జలాలు నింపి పూర్వ వైభవాన్ని తెచ్చారు. అసలు ఆనవాలు లేని చెరువులకు కూడా కొత్త కళ తెచ్చారు. జలజీవం పోశారు. తెలంగాణను జీవధార చేశారు. అందుకే తెలంగాణ జలమే బిఆర్ఎస్ బలం!
రైతు మద్దతే కారుకు వరం! అని వేనోళ్ల కొనియాడబడుతోంది.
తడారిన తెలంగాణ గొంతు తడిపిందే కేసిఆర్. నెర్రెలు బారిన నేలకు ఊరిపిలూదిందే బిఆర్ఎస్. తన కంట ఒలికిన కన్నీరు ఏ రైతు కంట ఒలకకుండా చేసిందే కేసిఆర్. బంజరు భూముల్లో బంగారు పంటలకు కారణం కేసిఆర్. తెలంగాణ భూ గర్భం సముద్రం చేసింది కేసిఆర్.బిఆర్ఎస్ కు రైతులే అండ.పేదలకు కేసిఆర్ నాయకత్వమే అండా దండ. సంక్షేమానికి నిదర్శనమే కేసిఆర్ పాలన.తెలంగాణలో చీకట్లను తరిమి వెలుగులు పంచిందే కేసిఆర్. బంగారు పంటల మాగాణ తెలంగాణ చేసిందే కేసిఆర్.
అలాంటి తెలంగాణ లో ప్రతిపక్షాలా? సమస్యే లేదు.
ప్రజల ఆలోచనల్లో ప్రతిపక్షాలు లేవు. ప్రత్యామ్నాయ శక్తులు అనే పదానికి తెలంగాణలో చోటు లేదు. ఎందుకంటే తెలంగాణలో అమలౌతున్న పథకాలు దేశంలో ఏ రాష్ట్రంలో అమలు కావడం లేదు. ఒకటి కాదు రెండు కాదు పదుల సంఖ్యలో సంక్షేమ పథకాలు అమలౌతున్నాయి. ప్రతీ కుటుంబానికి అందుతున్నాయి. పైగా గొప్ప పథకాలు కూడా తెలంగాణ లోనే అమలులో వున్నాయి. కళ్యాణ లక్ష్మి లాంటి పథకం వెనక గొప్ప సామాజిక సృహ దాగి వున్నది. ఒకప్పుడు తెలంగాణ లో అక్కడక్కడ బాల్య వివాహాలు జరిగేవి. ఎప్పడైతే కళ్యాణ లక్ష్మీ అమలులోకి వచ్చిందో అప్పటి నుంచి తెలంగాణ లో బాల్య వివాహాలు లేకుండా పోయాయి. దళిత సమాజం మీద ఎన్నికల సమయంలో ఎన్నో పార్టీలు మొసలి కన్నీరు కార్చినవే. కానీ ముఖ్యమంత్రి కేసిఆర్ మదిలో నుంచి ఆవిషృతమైన దళితబంధు ఆ కుటుంబాలలో వెలుగులు నింపుతోంది. ఆర్థిక స్వావలంబన లో దళితులను భాగస్వామ్యం చేస్తే సమాజంలో అసమానతలు తగ్గిపోతాయి. ఇప్పుడు తెలంగాణ లో అదే జరుగుతోంది. తెలంగాణ సమ్మిళిత వృద్దిలో సకలజనులున్నారు.ప్రతిపక్షాలలో కూడా ప్రభుత్వ పథకాలు అందుకున్న వారు వున్నారు.వాళ్ల మనసులో కూడా వుంది కారే!
వారి మనసు కోరుకుంటోంది కేసిఆర్ నే! ఇది సత్యం.. నిత్యం.. తెలంగాణ ప్రగతికి సోపానం.
ఆదివారం విష్ణుప్రియ గార్డెన్స్ లో హనుమకొండ జిల్లా మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో జరిగిన మున్నూరు కాపు బలగం ఆత్మీయ సమ్మేళనం విజయవంతం అయ్యింది. మహిళలు, పిల్లలు, పెద్దలు సుమారు 4 వేలకు పైగా ఈ యొక్క సమ్మేళనానికి హాజరు అయ్యారు.ప్లే బ్యాక్ సింగర్, స్వరాభిషేకం ఫేమ్ మాళవిక, ZEE సరిగమప ఫేమ్,సింగర్ సాయి శ్రీ చరణ్ తమ ఆట పాటలతో మున్నూరు కాపు కులబంధువులకు వినోదాన్ని పంచారు.20 శాతం ఉన్న మున్నూరు కాపులకు రాజకీయ పార్టీలు వాళ్ల కమిటీల్లో ముఖ్యమైన పదవులు ఇవ్వాలని,టికెట్ల విషయంలో కూడా 20 శాతం మున్నూరు కాపులకు కేటాయించాలని కోరారు.హనుమకొండ జిల్లా మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో త్వరలో వెబ్ సైట్ లాంచ్ చేస్తున్నట్లు పుప్పాల రజనీకాంత్ తెలిపారు.ఈ యొక్క వెబ్ సైట్ మున్నూరు కాపు యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం ఉపయోగపడుతుందని, విదేశాలకు వెళ్లే వారికోసం, పెళ్లిళ్ల కోసం ఈ వెబ్ సైట్ ఉపయోగ పడుతుందని పుప్పాల తెలిపారు.ఇది మున్నూరు కాపుల మీటింగ్ కాదని, ఆత్మీయ సమ్మేళనం కాబట్టి స్పాన్సర్లు,రావు పద్మ, నాయిని రాజేందర్ రెడ్డి,ఎర్రబెల్లి ప్రదీప్ రావు,దాస్యం అభినవ్ భాస్కర్ లను ఆహ్వానించామని, ఇందులో ఎలాంటి రాజకీయ సందేశం ఎవరూ ఇవ్వలేదని, త్వరలో ఏర్పాటు చేసే మీటింగ్ కు ఎలాంటి స్పాన్సర్లను పిలవబోమని పుప్పాల తెలిపారు.
హనుమకొండ జిల్లా మున్నూరు కాపుసంఘం జిల్లా అధ్యక్షులు కొత్త దశరథం పటేల్, వరంగల్ జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు మందా శ్రీనివాస్ పటేల్ ల ఆధ్వర్యంలో జనసమీకరణ జరిగిందని,ఈ కార్యక్రమం విజవంతం కావడంలో కృషి చేసిన మున్నూరు కాపు సంఘం నాయకులు సాయిని రవీందర్, జినుకల లక్ష్మణ్ రావు,కొండ నాగరాజు,జినుకల దేవేందర్ రావు, పుట్ట కిషోర్, గుండ్ల శ్రీనివాస్,తోట సమ్మయ్య, లింగంపల్లి సురేందర్, కోరబోయిన సాంబయ్య, సాయి,సత్యప్రకాశ్ మొదలగు వారిని పుప్పాల అభినందించారు.
అన్ని వర్గాలకు సముచిత స్థానం. కుల సంఘాల భవనాల నిర్మాణానికి స్థలం కేటాయింపు. మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి.
రామయంపేట (మెదక్)నేటి ధాత్రి.
ముఖ్యమంత్రి కేసీఆర్ కుల సంఘాల అభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తున్నారని మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి అన్నారు. శనివారం రామాయoపేటలో ఆమె విలేకరులతో మాట్లాడారు. చాలా గ్రామాల్లో సంఘం భవనం లేకపోవడం వల్ల ఎక్కడో రోడ్డు పక్కన లేదా చిన్న చిన్న గదుల్లో సమావేశాలు ఏర్పాటు చేసుకునే పరిస్థితి ఉందన్నారు. కుల సంఘాలకు స్థలం కేటాయించి భవనాలు నిర్మించుకోవడానికి నిధులు మంజూరు చేయడం జరుగుతుందన్నారు. దీంతో సంఘాలు సమావేశాలు ఏర్పాటు చేసుకోవడంతో పాటు ఐక్యతగా ఉండడానికి ఉపయోగపడతాయన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ అన్ని కుల సంఘాలను సమానంగా చూస్తున్నారని ఆమె పేర్కొన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత కుల వృత్తులకు మంచి రోజులు వచ్చాయని అన్నారు. కుల వృత్తులను ప్రోత్సహించడానికి ప్రోత్సాహకాలు కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయడం జరుగుతుందని తెలిపారు. నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి తనవంతు కృషి చేస్తానని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సారధ్యంలో తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందుతుందని దేశంలోని ఆదర్శ రాష్ట్రంగా నిలిచిందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్ వైస్ చైర్మన్ పుట్టి విజయలక్ష్మి యాదగిరి బి ఆర్ ఎస్ పట్టణ అధ్యక్షుడు గజవాడ నాగరాజు పి ఎస్ సి ఎస్ చైర్మన్ బాదే చంద్రం మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సరప్ యాదగిరి కౌన్సిలర్లు
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.