acb valalo vro, ఏసీబీ వలలో విఆర్వో

ఏసీబీ వలలో విఆర్వో మహబూబాబాద్‌ జిల్లా గార్ల మండలంలోని మద్దివంచ విఆర్వో లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. బుధవారం మద్దివంచ గ్రామ విఆర్వో శివరావు 1.40లక్షల రూపాయలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

Read More

ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు

ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు హనుమాన్‌ జయంతి సందర్భంగా వరంగల్‌ ఏనుమాముల మార్కెట్‌లో గల ఆంజనేయస్వామి ఆలయంలో వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్‌, గ్రేటర్‌ వరంగల్‌ నగర మేయర్‌ గుండా ప్రకాష్‌ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఏర్పాటుచేసిన మహాఅన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఏనుమాముల, ఎస్సార్‌నగర్‌, సుందరయ్యనగర్‌, ఎన్టీఆర్‌నగర్‌లకు చెందిన టిఆర్‌ఎస్‌ నాయకులు, స్థానిక కార్యకర్తలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.  

Read More

bahirangamga urithiyali, బహిరంగంగా ఉరితీయాలి..

బహిరంగంగా ఉరితీయాలి.. యాదాద్రి జిల్లా వలిగొండలో వికలాంగురాలైన మైనర్‌ బాలికపై అత్యాచారం చేసిన మహేందర్‌ను వెంటనే ఉరితీయాలని తెలంగాణ వికలాంగుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు జన్ను రాజు అన్నారు. సోమవారం చిలుకూరు మండల రామాపురం గ్రామంలో అత్యాచారం చేసిన వ్యక్తి మహేందర్‌పై ఫిర్యాదు చేస్తే పట్టించుకోకుండా పోలిసులు వ్యవహరించిన తీరుపై వికలాంగుల సంఘాలు మండిపడుతున్నారు. ఈ సందర్భంగా ఐనవోలు మండలకేంద్రంలో సింగారం గ్రామంలో తెలంగాణ వికలాంగుల ఫోరం ముఖ్యకార్యకర్తల సమావేశంలో జన్ను రాజు మాట్లాడుతూ తెలంగాణా రాష్ట్ర…

Read More

ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన నాయకుడు ఎన్టీఆర్‌

సంక్షేమ కార్యక్రమాలకు అంకురార్పణ చేసి ప్రజల గుండెల్లో జననాయకుడిగా చిరస్థాయిగా నిలిచిపోయిన వారిలో ఆద్యుడు ఎన్టీఆర్‌ అని తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి కొనియాడారు. హన్మకొండ భవానీనగర్‌లోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మంగళవారం తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీఆర్‌ 96వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వర్గీయ ఎన్టీఆర్‌ చిత్రపటానికి తెలుగుదేశం పార్టీ నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జిల్లా…

Read More

ఘనంగా ఎన్టీఆర్‌ జయంతి వేడుకలు

దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు 96వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. నర్సంపేట పట్టణంలోని ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించగా ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. నర్సంపేట మండల పార్టీ అధ్యక్షుడు అజ్మీర శ్రీనివాస్‌ మాట్లాడుతూ ఎన్టీఆర్‌ ప్రభుత్వ హయాంలోనే గ్రామాలు అభివద్ధి చెందాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు దూపాటి ఆనంద్‌, బొందయ్య, దుగ్గొండి మండల తెలుగు యువత అధ్యక్షుడు పెంచాల సతీష్‌లతోపాటు పలువురు పాల్గొన్నారు. దుగ్గొండిలో……

Read More

ధర్నాను విజయవంతం చేయాలి

ధర్నాను విజయవంతం చేయాలి హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు ధర్నా చౌక్‌లో పోరాటకారులను విడిపించుట కోసం ఈనెల 31న చేపట్టనున్న ధర్నాను విజయవంతం చేయాలని తెలంగాణ ప్రజాఫ్రంట్‌ వరంగల్‌ రూరల్‌ జిల్లా అధ్యక్షుడు జనగాం కుమారస్వామి అన్నారు. మంగళవారం నర్సంపేట పట్టణంలోని అంబేద్కర్‌ సెంటర్‌లో ఆ సంఘం ఆధ్వర్యంలో గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు సలేంద్ర వెంకటేశ్వర్లు, గుంటి ప్రకాష్‌, చింతకింది శ్రీను, నల్ల రవీందర్‌, గొడిశాల ప్రత్యుష, బీసీ సంక్షేమ సంఘం నియోజకవర్గ ఇంచార్జ్‌ డ్యాగల…

Read More

illaku current cut, ఇళ్లకు కరెంట్‌ కట్‌

ఇళ్లకు కరెంట్‌ కట్‌ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మరుగుదొడ్ల నిర్మాణ పథకం కార్యక్రమంలో మరుగుదొడ్లను నిర్మాణం పనులు పూర్తిచేయని లబ్ధిదారుల ఇళ్ల విద్యుత్తు కనెక్షన్‌లను గ్రామపంచాయతీ అధికారులు తొలగించారు. ప్రభుత్వం గతం నుండే మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తిచేయని వారి ప్రభుత్వ సంక్షేమ పథకాలను నిలిపివేస్తామని హెచ్చరించినప్పటికీ కొందరు లబ్ధిదారులు నిర్మాణ పనుల్లో నిర్లక్ష్యం వహించడంతో వారు అన్నంత పని చేశారు. నర్సంపేట మండలంలోని చంద్రయ్యపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో మరుగుదొడ్ల నిర్మాణ పనులు పూర్తి చేయని…

Read More

hanuman jayanthi utsavalu, హనుమాన్‌ జయంతి ఉత్సవాలు

హనుమాన్‌ జయంతి ఉత్సవాలు హసన్‌పర్తి మండలంలోని సూదన్‌పల్లి గ్రామంలో హనుమాన్‌ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. గ్రామంలోని ప్రతి ఒక్కరు కొబ్బరికాయతో ఆంజనేయస్వామిని దర్శించుకున్నారు. రామనామస్మరణతో గ్రామమంతా మార్మోగింది. గ్రామంలోని ఆలయానికి పెద్దఎత్తున హనుమాన్‌ దీక్షా స్వాములు, భక్తులు, ప్రజలు పాల్గొన్నారు.

Read More

prathyaka adhikariniki sanmanam, ప్రత్యేక అధికారిణికి సన్మానం

ప్రత్యేక అధికారిణికి సన్మానం దుగ్గొండి మండలంలోని మల్లంపల్లి కస్తూర్బాగాంధీ బాలికల పాఠశాలలో పదవతరగతి విద్యార్థులు వందశాతం ఉత్తీర్ణత సాధించగా ఆ పాఠశాల ప్రత్యేక అధికారిణి మంజులను జిల్లా కలెక్టర్‌ గుండ్రాతి హరిత, ఆర్జేడీ, జిల్లా విద్యాశాఖ అధికారి రాజీవ్‌లు హరిత ప్రసాదం (మొక్క), శాలువాతో జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో మంగళవారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ప్రత్యేక అధికారిణి మంజుల మాట్లాడుతూ కస్తూర్బాగాంధీ బాలికల గురుకుల పాఠశాలలో నిరుపేద విద్యార్థినులు విద్యనభ్యసిస్తున్నారని, వారి భవిష్యత్తు కోసం ప్రైవేటు…

Read More

తెలంగాణ ఆణిముత్యం.. సురవరం

సురవరం ప్రతాపరెడ్డి తెలంగాణ ఆణిముత్యమని, ఆయన చరిత్రను భావితరాలకు అందించాల్సిన బాధ్యత అందరిపైనా ఉన్నదని జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్‌ ఆకునూరి శంకరయ్య అన్నారు. మంగళవారం సిరిసిల్ల పట్టణంలోని జిల్లా గ్రంధాలయ సంస్థ కార్యాలయంలో సురవరం ప్రతాపరెడ్డి 123వ జయంతి వేడుకలను గ్రంధాలయ సంస్థ అధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్‌ ఆకునూరి శంకరయ్య ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. సురవరం ప్రతాపరెడ్డి నిజాంకాలంలోనే గోల్కొండ పత్రిక ద్వారా తెలంగాణ ఆత్మగౌరవాన్ని చాటిచెప్పారని…

Read More

aruhulaku double bedroom illu nirminchali, అర్హులకు డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు నిర్మించాలి

అర్హులకు డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు నిర్మించాలి అర్హులైన లబ్ధిదారులకు డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇల్లు నిర్మించి ఇవ్వాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షుడు మంద శ్రీకాంత్‌ అన్నారు. మంగళవారం శాయంపేట మండలకేంద్రంలో ఆయన మాట్లాడుతూ అర్హులైన నిరుపేదలకు డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు నిర్మించి ఇవ్వాలని తెలిపారు. అదేవిధంగా మిషన్‌ భగీరథ నల్లాలు పూర్తిగా నిర్మించాలని చెప్పారు. ఈ సమావేశంలో యాదవ్‌, ప్రసాద్‌, ప్రభాస్‌, వికాస్‌, మోహన్‌, కపిల్‌ రామ్‌ పాల్గొన్నారు.

Read More

govulatho veluthunna lorry pattivetha, గోవులతో వెళుతున్న లారీ పట్టివేత

గోవులతో వెళుతున్న లారీ పట్టివేత అక్రమంగా గోవులను తరలిస్తున్న రెండు కంటైనర్ల పెట్టే గల వాహనాలను మంగళవారం వెంకటాపురం యువకులు పట్టుకున్నారు. పట్టుకున్న రెండు లారీలలో గోవులు ఉండటాన్ని గమనించి సమాచారాన్ని పోలీసులకు అందజేశారు. వెంకటాపురం యువకులు పట్టుకున్న రెండు లారీలు, గోవులను పోలీసులకు అప్పగించారు. రెండు లారీలు, పశువులు పోలీసుల అదుపులో ఉన్నాయి.

Read More

mhmpia avagahana karyakramam, ఎంహెచ్‌ఎంపై అవగాహన కార్యక్రమం

ఎంహెచ్‌ఎంపై అవగాహన కార్యక్రమం మెన్‌స్ట్రాల్‌ హైజినిక్‌ డేను పురస్కరించుకుని రాజన్న సిరిసిల్ల పట్టణ కేంద్రంలో మహిళలతో ర్యాలీ చేపట్టారు. మంగళవారం పట్టణకేంద్రంలోని పొదుపు భవన్‌లో ఎంహెచ్‌ఎంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్‌ సమావేశాన్ని ఉద్ధేశించి మాట్లాడుతూ గ్రామాల్లో ఎంహెచ్‌ఎంపై అవగాహన లేకపోవడంతో చాలామంది మహిళలు, కిశోర బాలికలకు పరిశుభ్రత లేకపోవడం వల్ల అనేకరకాల ఆరోగ్యసంబంధమైన శారీరక, మానసిక ఇబ్బందులకు గురి అవుతున్నారని అన్నారు. ఎన్నో అపోహాలతో ఆ రోజుల్లో…

Read More

prajala avasaralaku thaggattuga panicheyali, ప్రజల అవసరాలకు తగ్గట్లుగా పనిచేయాలి

ప్రజల అవసరాలకు తగ్గట్లుగా పనిచేయాలి ప్రజల మనోభావాలు, అవసరాలకు తగ్గట్లుగా పోలీసు అధికారులు విధులు నిర్వర్తించాల్సి వుంటుందని రాష్ట్ర డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో పోలీసుల పనీతీరుపై రాష్ట్ర డీజీపీ మంగళవారం రాష్ట్రంలోని పోలీస్‌ కమిషనర్లు, ఎస్పీలతోపాటు స్టేషన్‌ హౌజ్‌ ఆఫీసర్లయిన ఇన్స్‌స్పెక్టర్లు, సబ్‌-ఇన్‌స్పెక్టర్లతో హైదరాబాద్‌ డిజీపీ కార్యాలయం నుండి వీడియో సమావేశాన్ని నిర్వహించారు. వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ డాక్టర్‌ వి.రవీందర్‌తోపాటు కమిషనరేట్‌కు చెందిన అధికారులు పాల్గోన్న ఈ సమావేశంలో గత తొమ్మిదినెలల కాలంగా తెలంగాణ రాష్ట్రంలో…

Read More

superintendent saibabanu suspend cheyali, సూపరింటెండెంట్‌ ‘సాయిబాబా’ను సస్పెండ్‌ చేయాలి

సూపరింటెండెంట్‌ ‘సాయిబాబా’ను సస్పెండ్‌ చేయాలి వరంగల్‌ అర్బన్‌ జిల్లా ఇంటర్మీడియట్‌ కార్యాలయంలో సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న సాయిబాబా పేపర్‌ వాల్యూయేషన్‌ క్యాంపు పేరిట అవినీతికి పాల్పడినాడని, క్యాంపులో జరిగిన అవినీతిపై తక్షణమే విచారణ కమిటీని నియమించి ప్రభుత్వ సొమ్మును కాజేసిన అవినీతి ఉద్యోగులను గుర్తించి వెంటనే వారిని సస్పెండ్‌ చేసి క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని దళిత బహుజన విధ్యార్థి మోర్చా రాష్ట్ర కన్వీనర్‌ గురుమిళ్ల రాజు డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భాయ్స్‌ పేరిట,…

Read More

hanuman junction gudisela kahani…, హనుమాన్‌ జంక్షన్‌ గుడిసెల కహానీ…!

హనుమాన్‌ జంక్షన్‌ గుడిసెల కహానీ…! ఓ కమ్యూనిస్టు పార్టీ పోరాటం ప్రారంభిస్తుంది. గుడిసెల పోరాటం చేస్తుంది అంటే కమిటీతో చర్చించి, సాధ్య, అసాధ్యాలను పరిశీలించి ముందుకు కదులుతారు. అదే భూపోరాటం చేయాలంటే, పేదప్రజలకు ఇంటిస్థలాలు ఇప్పించాలంటే ఆ భూమి సర్వే నెంబర్‌ ప్రభుత్వ భూమా…? ప్రైవేట్‌ భూమా…? కబ్జాలో ఎవరైనా ఉన్నారా…లేదా…తదితర వివరాలను పరిశీలించి భూమిపైకి వెళ్తారు. కానీ వరంగల్‌ నగరంలో భూపోరాటాలకు సీపీఐ నేతలు చెప్తున్న కొన్ని పోరాటాలు వాటి వెనుక నడిచిన తతంగాలను చూస్తే…

Read More

prabuthva badilone cherpinchali, ప్రభుత్వ బడిలోనే చేర్పించాలి

ప్రభుత్వ బడిలోనే చేర్పించాలి గీసుగొండ మండలకేంద్రంలో ప్రభుత్వ బడిలోనే పిల్లలను చేర్పించాలని కోరుతూ ఉపాధ్యాయులు స్థానిక నాయకులు తల్లిదండ్రులను కోరారు. ప్రభుత్వ బడిలోనే నాణ్యమైన విద్య అందుతుందని, అన్ని వసతులు ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్‌ సూర్యకళ, ఉపాధ్యాయులు రామ్మూర్తి, ప్రభాకర్‌, స్థానికులు చాడ కొమురరెడ్డి, లక్ష్మినారాయణ తదితరులు ఉన్నారు.

Read More

bhanudi bagabaga..janam vilavila, భానుడి భగభగ…జనం విలవిల

భానుడి భగభగ…జనం విలవిల రోజురోజుకు భానుడి ప్రతాపం పెరుగుతోంది…భానుడి భగభగకు జనం విలవిలలాడుతున్నారు. వడదెబ్బకు ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. రెండురోజుల వ్యవధిలో సుమారుగా 15మంది మృతిచెందారు. ఇదేవిధంగా భానుడు ప్రతాపం చూపితే ప్రజలు బయటకు రాకుండా ఇళ్లకే పరిమితమయ్యే పరిస్థితి నెలకొన్నది. రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతూ 45డిగ్రీలు దాటి 50డిగ్రీల ఉష్ణోగ్రతల వరకు వెళ్లొచ్చని, ప్రస్తుతం ఉన్న ఎండ తీవ్రతను బట్టి అంచనా వేయవచ్చు. ఈ ఉష్ణోగ్రతలకు ప్రజలు ఇంట్లో నుండి బయటకు వెళ్లాలంటేనే జంకుతున్నారు. అసలు…

Read More

puttinaroju vedukalu, పుట్టినరోజు వేడుకలు

పుట్టినరోజు వేడుకలు మంచిర్యాల జిల్లా తాండూరు మండలం బోయపల్లిబోర్డు వేణునగర్‌ వద్దగల సేవాజ్యోతి శరణాలయంలో వరంగల్‌ జిల్లా వాస్తవ్యుడు, సగర జాతీయ సగర సేవా, ఉద్యోగుల సంఘం గౌరవ సలహాదారు, నేటిధాత్రి దినపత్రిక అధినేత, ప్రముఖ వ్యాపారవేత్త, సినీ నిర్మాత, ధాత్రి గ్రూప్స్‌ చైర్మన్‌ కట్టా రాఘవేందర్‌ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా కేక్‌ కట్‌ చేసి విద్యార్థులకు పంపిణీ చేశారు. అనంతరం శరణాలయంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సేవాజ్యోతి శరణాలయం…

Read More

gananga hanuman irumudi mahostvam, ఘనంగా హనుమాన్‌ ఇరుముడి మహోత్సవం

ఘనంగా హనుమాన్‌ ఇరుముడి మహోత్సవం మండల రోజులు దీక్ష పూర్తి చేసుకున్న హనుమాన్‌ మాలాదారులు సోమవారం ఇరుముడి మహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకున్నారు. నర్సంపేట డివిజన్‌లోని దుగ్గొండి మండలం చంద్రయ్యపల్లి గ్రామంలోని హనుమాన్‌ భక్తులు మాలాధారణతో మండల దీక్ష పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా గ్రామంలోని హనుమాన్‌ దేవాలయంలో గణపతి హోమం, నవగ్రహాల పూజలను వేదపండితులు గణేశ్‌శర్మ ఆధ్వర్యంలో ఉదయం నుండి నిర్వహించుకున్నారు. అనంతరం ఇరుముడి మహోత్సవాన్ని పూర్తి చేసుకున్నారు. గ్రామంలోని మహిళలు, కుటుంబసభ్యులతో కలిసి ఇరుముడి…

Read More