okka cc camera vanda manditho samanam, ఒక్క సీసీ కెమెరా వంద మందితో సమానం

ఒక్క సీసీ కెమెరా వంద మందితో సమానం

సుబేదారి ఇన్‌స్పెక్టర్‌ పి.సదయ్య

నగరంలో ఇంటి యజమానులు ప్రతి ఇంటికి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సుబేదారి ఇన్‌స్పెక్టర్‌ పి.సదయ్య ప్రజలకు సూచించారు.సీసీ కెమెరాలతో ఇంటికి ఎంతో భద్రత వుంటుందని, ఒక్కో సీసీ కెమెరా వందమందితో సమానం అని అన్నారు.నగరంలో రోజురోజుకు దొంగలు పెట్రేగాపోతూ తాళాలు వేసిన ఇండ్లను టార్గెట్‌గా చేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్నారని వీరి బారి నుండి రక్షించుకోవడానికి ప్రతి ఒక్క ఇంటి యజమాని సీసీ కెమెరాలను తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలని కోరారు.30-40 లక్షలు పెట్టి ఇంటిని నిర్మించుకొని 20 వేల రూపాయలకు వచ్చే సీసీ కెమెరాను ఏర్పాటు చేసుకోవడంలో నిర్లక్ష్యం చేస్తున్నారని అలా కాకుండా ఇంటి భద్రత కొరకు సీసీ కెమెరాలను తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలని సదయ్య నగర ప్రజలను కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *