నవరాత్రులు నీకు ఘనంగా పూజలయ్య గణేశా

*గణనాథుడి మండపం వద్ద ఘనంగా మహిళల ప్రత్యేక కుంకుమ పూజలు

*అన్నదానం చేపట్టిన మండప నిర్వాహకులు

రుద్రంగి, నేటిధాత్రి:
రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలోని సాయి నగర్ యూత్ ఆధ్వర్యంలో ,తూర్పు వాడ ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో ఎన్.బి యువతేజo యూత్ ఆధ్వర్యంలో, శివసేన యూత్ ఆధ్వర్యంలో, లక్ష్మీనరసింహ యూత్ ఆధ్వర్యంలో ప్రతిష్టించిన
గణనాథుడి మండపం వద్ద మంగళవారం అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఎంపీపీ గంగo స్వరూప రాణి, జెడ్పిటిసి గట్ల మినయా, రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆది శ్రీనివాస్ వినాయకునికి ప్రత్యేక పూజలు చేసి అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. డీజే బాయ్స్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా కుంకుమ పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో
పెద్ద ఎత్తున మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తిశ్రద్ధలతో విఘ్నేశ్వర స్వామిని కొలిచారు. ఈ కార్యక్రమంలో గణేష్ మండలి సభ్యులు,తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!