రాజనగరం విలీన గ్రామాన్ని మున్సిపల్ అధికారులు.

Collector Collector

రాజనగరం విలీన గ్రామాన్ని మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదు

ఐక్యవేదిక అధ్యర్య ములో కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తాం

వనపర్తి నేటిదాత్రి:

వనపర్తి మున్సిపాలిటీ కి విలీన గ్రామన్ని రాజనగరం అమ్మ చెరువు కట్టను అఖిలపక్ష ఐక్యవేదిక నాయకులు పరిశీలించారు
గత బీ ఆర్ ఎస్ ప్రభుత్వంలో చేపట్టిన చెరువుల పునరుద్దీకరణ పనులు ఇంకా పూర్తి కాలేదని, కట్ట పైనుండి వెళ్లే దారిలో బ్రిడ్జి కావాల్సి ఉందని దాని వల్ల ప్రజలకు ఇబ్బందిగా ఉందని, దానిని వెంటనే పూర్తి చేయాలని, కట్ట పై వెలిసిన టవర్ లైట్లు రావడం లేదని వనపర్తి మున్సిపాలిటీ ఇంజనీరింగ్ అధికారులు పట్టించుకోవడంలేదని మున్సిపల్ ఇంజనీర్ అధికారులపై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తామని ఐక్యవేదిక అధ్యక్షులు సతీష్ యాదవ్ చెప్పారు చెరువు కట్టపై శానిటేషన్ పనులు చేయడం లేదని, తుమ్మ చెట్లు పెరిగి నాయని రాత్రిపూట వెళ్లే వాహనాల ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నార ని సతీష్ తెలిపారు విష సర్పాలు తిరుగుతున్న సమయంలో రాత్రి పుట వాహనాల ప్రజలు కట్ట పై ప్రయాణిస్తుంటారని రోడ్డు ప్రమాదం ఏర్పడుతుందని సతీష్ తెలిపారు. 12వ వార్డు రాజనగరాన్ని వనపర్తి మున్సిపాలిటీ పూర్తిస్థాయిలో పట్టించుకోవడం లేదని కమిషనర్ కు కలెక్టర్ ఆదేశాలు ఇవ్వాలని, విలీన గ్రామాలైన మర్రికుంట శ్రీనివాసపురం, నాగవరం రాజనగరం, జంగమయ్య పల్లి వార్డులను అభివృద్ధి చేయాలని జిల్లా ఐక్యవేదిక అధ్యక్షులు సతీష్ యాదవ్ కలెక్టర్ ను ఒక ప్రకటనలో కోరారు
జిల్లా అధ్యక్షులు సతీష్ యాదవ్ వెంట తో పట్టణ అధ్యక్షుడు రామస్వామి, వెంకటేశ్వర్లు, కొత్త గొల్ల శంకర్, గౌనికాడి యాదయ్య, బొడ్డుపల్లి సతీష్,కురుమూర్తి,శివకుమార్, గుంట్ల వెంకటేష్, రాజు,కృష్ణయ్య, శ్రీనివాసులు రాజనగరం గ్రామ ప్రజలు ఉన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!