మొగుళ్ళపల్లి మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మల్టీస్పెషల్టి మెగా హెల్త్ క్యాంప్
————————–మొగుళ్లపల్లి నేటి ధాత్రి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన-ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా తేదీ 28 మార్చి 2026 శనివారం రోజున మండల ప్రజలకు మెరుగైన వైద్య సేవలో అందుబాటులోకి తీసుకురావడానికి గాను శనివారం రోజున (ఉదయం 9.00 గంటల నుండి మధ్యాహ్నం 12.00 గంటల వరకు) మల్టీ స్పెషాలిటీ మెగా హెల్త్ వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతుంది .ఈ శిబిరంలో డెంటల్, ఆప్తలిమిక్, ఆర్థోపెడిక్, జనరల్ మెడిసినన్ , పీడియాట్రిక్, గైనక్ సంబంధిత వైద్య నిపుణులు వస్తారు అని ప్రాథమిక ఆరోగ్యంగా కేంద్ర వైద్యాధికారిణి డాక్టర్ నాగరాణి ,డాక్టర్ నవత గార్లు ఆస్పత్రి సిబ్బందితో సమావేశం ఏర్పరిచి మండల ప్రజలకు తెలియజేసినారు. ఈ శిబిరాన్ని అన్ని గ్రామ ప్రజలు మరియు ప్రజా ప్రతినిధులు పాల్గొని వైద్య సేవలు సద్వినియోగం చేసుకోవాలని కోరినారు.
ఈ యొక్క శిబిరానికి వివిధ వైద్య విభాగాలకు చెందిన ప్రముఖ వైద్య నిపుణు రానున్నారని తెలియజేస్తున్నారు.
ఈ శిబిరానికి ముఖ్యంగా ఈ క్రింది వైద్య నిపుణులు అందుబాటులో ఉంటారు.
1.స్త్రీ వైద్య నిపుణులు (గైనకాలజిస్ట్):- మహిళా ఆరోగ్య సమస్యలు మరియు గర్భిణీ స్త్రీలకు పరీక్షలు చేయబడును.
2.ఎముకల వ్యాధి నిపుణులు (ఆర్థోపెడిక్ ):-కీళ్ల నొప్పులు ఎముకల బలహీనత వంటి సమస్యలకు చికిత్స అందజేస్తారు.
3.MD జనరల్ మెడిసిన్:-అన్ని రకాల జబ్బులకు పరీక్ష చేయబడును .
4.నేత్ర వైద్య నిపుణులు (ENT):-కంటి చూపు సమస్యలు ఉన్నవారికి పరీక్షలు చేయబడును.
5.పిల్లల వైద్య నిపుణులు (పీడియాట్రిక్):-చిన్నపిల్లలకి ఆరోగ్య సమస్యలు గూర్చి చికిత్స చేయబడును.
6దంత వైద్య నిపుణులు (డెంటల్):-పంటి సమస్యలు ఉన్న వారికి పరీక్ష చేయబడును. ఈ ప్రత్యేక వైద్య శిబిరంలో నిపుణులైన డాక్టర్లు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులు పంపిణీ చేయనున్నట్లు తెలియజేసినారు. ఇంకేమైనా పెద్ద సమస్యలు ఉన్నట్లయితే పై ఆసుపత్రికి పంపించబడును.కావున మొగుళ్ళపల్లి మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు ముఖ్యంగా మహిళలు, మరియు వృద్ధులు చిన్నపిల్లలు, కంటి సమస్యలు ఉన్నవారు, పంటి సమస్యలు ఉన్నవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.
వైద్యాధికారిణి
ప్రాథమిక ఆరోగ్య కేంద్రం
మొగుళ్ళపల్లి
