పరకాల నేటిధాత్రి
పరకాల మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ గా పని చేస్తున్న ప్రియాంక తన తండ్రి జ్ఞాపకార్థంగా చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.దానిని పరకాల ఎంపిడిఓ పెద్ది ఆంజనేయులు ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవిలో వివిధ పనుల నిమిత్తం కార్యాలయానికి వచ్చే ప్రజల కోసం జూనియర్ అసిస్టెంట్ చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయం అని అన్నారు.ఈ కార్యక్రమంలో నడికుడ యంపిడిఓ శ్రీనివాస్,మండల పంచాయతీ అధికారి ఇమ్మడి భాస్కర్, కార్యాలయ పర్యవేక్షకులు శైలశ్రీ,ఏపిఓ ఇందిర,టెక్నికల్ అసిస్టెంట్ సుమలత, కార్యాలయ సిబ్బంది, ఈజియస్ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు, తదితరులు పాల్గొన్నారు.