రజతోత్సవం.. గులాబీ జయ కేతనం!

`తెలంగాణ జన జాతర…బీఆర్‌ఎస్‌ 25 ఏళ్ల వేడుక

`ఉద్యమ ప్రస్థానంలో ఉరకలెత్తిన తెలంగాణ పార్టీ

`ముక్కోటి తెలంగాణ చేత జై తెలంగాణ అని జై కొట్టించిన పార్టీ

`ప్రజలంతా గుండెల్లో పెట్టుకున్న జెండా గులాబీ జెండా

`తెలంగాణ అంతా గులాబీ మయం

రజతోత్సవ సభకు అడుగడుగునా ఆటంకాలు ఏర్పరచి, సభ జరగకుండా అడ్డంకులు సృష్టించాలని కాంగ్రెస్‌ ప్రభుత్వం చేసిన కుట్రలను తిప్పి కొట్టి, బీఆర్‌ఎస్‌ పార్టీ రజతోత్సవ సభ గురించి తరతరాలు చెప్పుకునేలా నిర్వహిస్తామంటున్న ‘‘బీఆర్‌ఎస్‌’’ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ‘‘ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు’’, ‘‘నేటిధాత్రి’’ ఎడిటర్‌ ‘‘కట్టా రాఘవేంద్రరావు’’ తో జనజాతర గురించి పంచుకున్న విషయాలు ఆయన మాటల్లోనే..

`వరంగల్‌ నిండా బీఆర్‌ఎస్‌ జన సందోహం

`ఎటు చూసినా గులాబీ రెపరెపలే

`ఎక్కడ విన్నా గులాబీ పాటలే

`తెలంగాణ అంతటా రజతోత్సవ చర్చలే

`గులాబీ దండు కదులుతోంది…వడి వడిగా వరంగల్‌ చేరుతోంది

`గులాబీ సైనికుల తెలంగాణ కవాతు కోసం కళకళలాడుతోంది

`జనం గుండెలు నిండుగా గులాబీ వనం విరబూస్తోంది

`ఎప్పుడెప్పుడు గులాబీ జాతర అని ఎదురుచూస్తోంది

`లక్షలాది మంది వరంగల్‌ సభకు వస్తున్నారు

`కేసీఆర్‌ అంటేనే తెలంగాణ జీవం

`కేసీఆర్‌ మాటలే తెలంగాణకు వేదం

`ఆవిరైపోతున్న నీళ్లు కన్నీళ్లు పెట్టుకుంటున్నాయి

`తెలంగాణను ఎడారిగా మార్చిన కాంగ్రెస్‌ పై నీళ్లే కన్నెర్ర చేస్తున్నాయి

`అడుగంటుతున్న భూ గర్భజలాలు ఆక్రోషిస్తున్నాయి

`ఎడారిగా మారిన బీళ్లు కాంగ్రెస్‌ను నోళ్లు తెరిచి తిడుతున్నాయి

`నమ్మినందుకు తెలంగాణ తల్లికి చుక్క నీరందక వాగులు, వంకలు శాపాలు పెడుతున్నాయి

`మళ్ళీ కేసిఆర్‌ పాలన వస్తే గాని మాగాణ కళకళలాడతాయని గుర్తు చేస్తున్నాయి

`కేసిఆర్‌ పాలనే తెలంగాణకు స్వర్ణయుగం

`మళ్ళీ కేసిఆర్‌ పాలన కోసం ఎదురుచూస్తోంది తెలంగాణ జనం

హైదరాబాద్‌,నేటిధాత్రి:

రామ దండు గురించి రామాయణంలో చదవాం..పెద్దలు చెప్పగా విన్నాం..ఇప్పుడు కేసిఆర్‌ దండు కళ్లారా చూడండి. గులాబీ దండు గురించి రేపటి తరానికి చెప్పండి. భవిష్యత్తులో రామ దండు గురించేకాదు, గులాబీ దండు గురించి కూడా చెప్పుకుంటారు. వరంగల్‌లో జరిగే బిఆర్‌ఎస్‌ వజ్రోత్సవ సభను చూస్తే కాంగ్రెస్‌ పార్టీకి, బిజేపికి ముచ్చెటమటలు పట్టాలి. ఉక్కపోతలు పోయాయి. కంటిమీద కునుకు కూడా లేకుండా చేయాలి. అదే మా లక్ష్యం. అదే బిఆర్‌ఎస్‌ పార్టీ సభతో మా రజతోత్సవం. మళ్లీ తెలంగాణలో గులాబీ జయకేతనం కోసం తొలి అడుగుకు శ్రీకారం. బిఆర్‌ఎస్‌ పార్టీ 25 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భం. బిఆర్‌ఎస్‌ రజతోత్సవం అంటే పార్టీ పండుగ మాత్రమే కాదు. తెలంగాణ జన జాతర. ఉద్యమ కాలంలో ఎలా అయితే ప్రజలు బిఆర్‌ఎస్‌కు సభలకు బ్రహ్మరధం పట్టేవారో..ఇప్పుడు కూడా తెలంగాణ ప్రజల్లో, బిఆర్‌ఎస్‌ అభిమానుల్లో అదే జోష్‌ కనిపిస్తోంది. అదే ఊపుతో తెలంగాణ మొత్తం వరంగల్‌ వైపు కదులుతోంది. ముఖ్యంగా తెలంగాణ రైతాంగం ఎడ్ల బండ్ల నిండా గులాబీ జెండాలు ఎగరేసుకుంటూ, రెపరెపలాడుతున్న జెండాలతో కొన్ని వేల బండ్లు వరంగల్‌ వైపు జతన్నాధ రధచక్రాలు కదులుతున్నట్లు దూసుకువస్తున్నాయి. తెలంగాణ చైతన్యాన్ని మేలు కొలుపేలా కేసిఆర్‌ రధ చక్రాలుగా రైతులు పరుగులందుకుంటూ వస్తున్నారు. కేసిఆర్‌కు జేజేలు కొట్టుకుంటూ వస్తున్నారు. ఇదీ బిఆర్‌ఎస్‌ అంటే. అదే కేసిఆర్‌ తెలంగాణ ప్రజల్లో చైతన్యమంటే..అదే తెలంగాణ ప్రజలకు కేసిఆర్‌ అందించిన చైతన్యమంటే అంటున్న ఉద్యమ కారుడు, సీనియర్‌ బిఆర్‌ఎస్‌ నాయకుడు, బిఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రదాన కార్యదర్శి, ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్‌రావు, నేటి దాత్రి ఎటిటర్‌ కట్టా రాఘవేంద్రరావుతో చెప్పిన రజత్సోవసభ విశేషాలు ఆయన మాటల్లోనే.
..ఉద్యమ కాలంలో ఉరకల్తెని పార్టీ బిఆర్‌ఎస్‌. ఇప్పటికీ బిఆర్‌ఎస్‌ అంటే తెలంగాణలో ప్రజలకు ఒక ఆర్తి. కేసిఆర్‌ అంటేనే ఒక నమ్మకం. ఒక వ ఇశ్వాసం. ప్రజల మేలు కోరే ఏకైక నాయకుడుగా గుర్తింపు వుంది. అయినా తెలంగాణ రాజకీయాల్లో కేసిఆర్‌ను మించిన నాయకుడు లేడు. తెలంగాణ కోసం కొట్లాడిన నాయకుడు కేసిఆర్‌. తెలంగాణ సాదన కోసం బిఆర్‌ఎస్‌ పార్టీ పెట్టిన నాయకుడు కేసిఆర్‌. తన రాజకీయ జీవితాన్ని ఫణంగా పెట్టిన నాయకుడు కేసిఆర్‌. తెలంగాణ వస్తుందో..రాదో తెలియని సమయంలో పిడికిలెత్తి జై తెలంగాణ అని గర్జించిన నాయకుడు కేసిఆర్‌. బిఆర్‌ఎస్‌ పార్టీ పెట్టినా జై తెలంగాణ అంటూ ఎవరు వస్తారో..రారో తెలియని అమోమయ పరిసి ్దతుల్లో బిఆర్‌ఎస్‌ జెండా ఎగరేసిన నాయకుడు కేసిఆర్‌. తర్వాత కొన్ని లక్షల మంది కేసిఆర్‌ను తయారు చేసి, మూడున్నర కోట్ల మంది తెలంగాణ ప్రజల చేత జై తెలంగాణ అని నినదింపజేసిన నాయకుడు కేసిఆర్‌. ఎంత కొట్లాడినా తెలంగాణ రాకపోతే విఫలనాయకుడిగా మిగలడం కన్నా, తెలంగాణ తెచ్చిన నాయకుడుగానే చరిత్రలో నిలవాలన్న సంకల్పంతో అడుగులేసిన ఏకైక నాయకుడు కేసిఆర్‌. తన చావుతోనైనా తెలంగాణ వస్తుందంటే చావు నోట్లో తలపెట్టేందుకు కూడా ఏ మాత్రం ఆలోచించని గొప్ప నాయకుడు కేసిఆర్‌. కేసిఆర్‌ చచ్చుడో..తెలంగాణ వచ్చుడో అని కఠినమైన నిర్ణయం తీసుకొని ఆమరణ దీక్ష చేపట్టిన నాయకుడు కేసిఆర్‌. తెలంగాణ సమాజమంతా వద్దని వారించినా, తెలంగాణ తేకపోతే నా ఉద్యమం వృధా..నేను తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాట నిలుపుకోలేని నాయకుడుగా బతకలేనని నిర్ణయం తీసుకున్న నాయకుడు కేసిఆర్‌. బహుషా ప్రపంచ చరిత్రలోనే కేసిఆర్‌ లాంటి ఉద్యమ కారుడు మరొకరు లేకపోవచ్చు. ఉద్యమాలు చేసిన వాళ్లు ఎందురో వున్నారు. కాని ఫలితం ఆశించకుండా ఉద్యమాలు చేసిన వాళ్లున్నారు. కాని ఫలితమే తెలంగాణ అంతిమ లక్ష్యం కావాలని కొట్లాడిని ఏకైక నాయకుడు కేసిఆర్‌. అందుకే తెలంగాణ సాధించగలిగారు. అంతటి బలమైన సంకల్పాన్ని పూనారు. అంతిమంగా తెలంగాణ సాధించి తెలంగాణ ప్రజల చేతుల్లో పెట్టారు. తెలంగాణ ఆత్మ గౌరవాన్ని రెపరెపలాడిరచారు. ఇలాంటి నాయకుడు నిన్నటి తెలంగాణ చరిత్రలో ఎవరూ లేరు. భవిష్యతు తెలంగాణకు అవసరం లేదు. ఎందుకంటే బంగారం లాంటి తెలంగాణను తయారు చేసి కేసిఆర్‌ ఎప్పుడో పెట్టారు. తెలంగాణ తేవడమే కాదు, తెచ్చినతెలంగాణను బంగారు తెలంగాణ చేసిన నాయకుడు కూడా కేసిఆర్‌. ఇలా రెండు రకాల విజయాలను తెలంగాణకు అందించిన గొప్ప పాలకుడు కేసిఆర్‌. ప్రపంచ రాజకీయ ముఖ చిత్రంలోనే కేసిఆర్‌ లాంటి నాయకుడు మరొకరు వుండరు. అందుకే తెలంగాణ అంటేనే కేసిఆర్‌..కేసిఆర్‌ అంటేనే తెలంగాణ..అలా అందమైన, అధ్భుతమైన, పాడి పంటలతో అలరాలుతూ, రైతులు రాజులుగా వర్ధిల్లుతున్న తెలంగాణను ఇప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆగం చేస్తోంది. కేసిఆర్‌ పదేళ్ల పాలనలో రైతులంతా సుఖ సంతోషాలతో వున్నారు. మూడేళ్లలోనే కాళేశ్వరం నిర్మాణం చేసి, తెలంగాణలో ప్రతి మూలన చివరి ఆయ కట్టు వరకు సాగు నీరిచ్చిన అపర భగీరధడు కేసిఆర్‌. తెలంగాణ తెచ్చిన ఆరు నెలల్లోనే మిషన్‌ కాకతీయ తెచ్చి, తెలంగాణలోని చెరువులన్నీటింటికీ పూర్వ వైభవం తెచ్చారు. చెరువులు బాగు చేయించారు. పూర్వం చెరువు ఎలా వుండేదో అలా తీర్చిదిద్దారు. రైతులే స్వయంగా పాలు పంచుకొని, బండ్లల్లో, ట్రాక్టర్లలో చెరువు మట్టి తీసుకెళ్లి, పొలాల్లో చల్లుకున్నారు. నిండిన చెరువు నుంచి ఊటలు మళ్లి, బావులు నిండడంతో సాగును పండుగ చేసుకున్నారు. ఇరవై నాలుగు గంటల కరంటు ఇచ్చి రైతు కష్టం తీర్చాడు. అర్ధరాత్రి, అపరాత్రి ఇచ్చిన కరంటు మూలంగా ఏ ఒక్క రైతు చనిపోకుండా చూసుకున్నారు. ఇరవైనాలుగు గంటల నాణ్యమైన విద్యుత్‌ అందించడంతో రైతు తన వెసులుబాటును చూసుకొని, అవసరమైన మేరకు పొలానికి నీరు పెట్టుకున్నారు. పదేళ్లు బంగారు పంటలు పండిరచుకున్నారు. కాంగ్రెస్‌ పార్టీ వస్తూ వస్తూనే రైతుకు కష్టం తెచ్చింది. రైతుల కళ్లలో కన్నీరు నింపింది. కాంగ్రెస్‌ కృత్రిమకరువును తెచ్చి రైతను అరిగోస పెడుతోంది. భూగర్భంలో చుక్క నీరు లేకుండా చేయడంతో ఆవిరైతున్న నీళ్లు రైతుకు అందక కన్నీళ్లు పెట్టుకుంటున్నాయి. తెలంగాణను మళ్లీ ఎడారిగా మార్చిన కాంగ్రెస్‌ ప్రభత్వంపై ఆవిరైతున్న నీళ్లే కన్నెర్ర చేస్తున్నాయి. తెలంగాణలో అడుగుంటున్న భూగర్భజలాలు కాంగ్రెస్‌ పాలకుల మీద ఆక్రోషం వెల్లగక్కుతున్నాయి. ఒక్క ఛాన్స్‌ ప్లీజ్‌..ఒక్క ఛాన్స్‌ ప్లీజ్‌ అంటూ తెలంగాణ ప్రజలను వేడుకుంటే కనికరించి, గెలిపించినందుకు తెలంగాణ తల్లి ఒడిలో చుక్క నీరులేకుండా చేస్తున్నారు. మళ్లీ ఒట్టిపోతున్న వాగులు, వంకలు కాంగ్రెస్‌ ప్రభుత్వానికి శాపాలు పెడుతున్నాయి. ఎడారిగా మారిన పొలాల బీళ్లు నోరు తెరిచి, కాంగ్రెస్‌ ప్రభుత్వ నిర్వాకాన్ని చూసి నోళ్లు తెరిచి తిడుతున్నాయి. అందుకే కళ్లు మండుతున్న రైతు బిఆర్‌ఎస్‌ రజతోత్సవసభలో ప్రభుత్వంపై సభ స్పూర్తి, సాక్షిగా, మళ్లీ కేసిఆర్‌ పాలన కోసం కంకణం కట్టుకున్నామని చెప్పేందుకు తరలివస్తున్నారు. జై తెలంగాణ నినాదాలు చేసుకుంటూ దండు కట్టి వస్తున్నారు. అలా వస్తున్న రైతులను చూస్తే జనం గుండెల నిండా గులాభీ వనం విరబూసినట్లు కనిపిస్తోంది. కనువిందు చేస్తోంది. బిఆర్‌ఎస్‌ శ్రేణులో సంబురం నింపుతోంది. ఎప్పుడెప్పుడు బిఆర్‌ఎస్‌ రజతోత్సవ సభ అని ఎదరుచూసి, అందరూ బయలుదేరుతున్నారు. ఇప్పటికే దూరపు జిల్లాల నుంచి లక్షల మంది రైతులు మూడు రోజుల ముందే భయలుదేరి వస్తున్నారు. మిగతా రైతులు బయలుదేరుతున్నారు. లక్షలాది మంది ప్రజలు వరంగల్‌ నగరానికి చేరుకుంటున్నారు. ఎందుకంటే కేసిఆర్‌ అంటేనే తెలంగాణ జీవం. కేసిఆర్‌ మాటలే తెలంగాణకు వేదం. రజతోత్సవ సభకు అడుగడుగునా అడ్డంకులు సృష్టించాలని చూశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం చేసిన ఆ కుట్రలన్నీంటినీ తిప్పి కొట్టి సభ ఏర్పాటు చేసుకుంటున్నాం. బిఆర్‌ఎస్‌ పార్టీ రజత్సోవం అంటే తరతరాలు గర్వంగా చెప్పుకునేలా నిర్వహిస్తాం.. వచ్చే ఎన్నికల్లో కేసిఆర్‌ నాయకత్వానా గులాబీజెండాను ఎగరేస్తాం..బిఆర్‌ఎస్‌కు ఎదురులేదు..కేసిఆర్‌ నాయకత్వానికి తిరుగులేదని ఎలుగెత్తి చాటుతాం…కేసిఆర్‌ కీర్తి ప్రపంచం చెప్పుకునేలా నడుచుకుంటాం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!