ఏజెన్సీ ప్రాంతంలో1/70 చట్టానికి అనుగుణంగానే.

Land law

ఏజెన్సీ ప్రాంతంలో1/70 చట్టానికి అనుగుణంగానే భూభారతిని చట్టాన్ని అమలు చేయాలి

కొత్తగూడ, నేటిధాత్రి:

 

 

 

ఆదివాసి సంక్షేమ పరిషత్ మహబూబాబాద్ జిల్లా కమిటీ సమావేశం కొత్తగూడ మండల కేంద్రంలో జరిగింది.

ఈ సమావేశంలో కొత్తగూడ మండల నూతన కమిటీని జిల్లా అధ్యక్షులు తాటి సుధాకర్ ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎంపిక చేయడమైనది.

ఆగబోయిన ప్రశాంత్ అధ్యక్షులు, దనసరి నారాయణ ప్రధాన కార్యదర్శి, కంగల సురేందర్, సుంచ బాలరాజు ఉపాధ్యక్షులు కార్యదర్శిలు మోకాళ్ళ చంద్రబాబు దనసరి రాజేష్ (చిన్న), దనసరి రాజబాబు, చింత రాజు కమిటీ సభ్యులు గా ఎన్నుకోవడం జరిగింది అనంతరం ఆదివాసి సంక్షేమ పరిషత్ జిల్లా అధ్యక్షులు తాటి సుధాకర్ మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా పోడు వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్న కొంతమంది నిరుపేద ఆదివాసి రైతులకు ఇప్పటివరకు అడవి హక్కు పత్రాలు ప్రభుత్వం మంజూరు చేయకపోవడం దురదృష్టకరమని అన్నారు.

హక్కు పత్రాలు మంజూరు కానటువంటి వారికి ప్రభుత్వం తక్షణమే అడవి హక్కు పత్రాలు మంజూరు చేయాలని ఈ సందర్భంగా వారు కోరినారు.

హక్కు పత్రాలు లేకపోవడంతో ప్రభుత్వ బ్యాంకుల ద్వారా పెట్టుబడులకు రుణాలు తీసుకోలేని పరిస్థితి దాపురించింది దీంతో నిరుపేద ఆదివాసి రైతులు వడ్డీ వ్యాపారస్తులు ఆశ్రయించి వారి దగ్గర విత్తనాలు ఎరువులు అధిక వడ్డీలకు ఇస్తూ రైతుల్ని దోపిడీ చేయడమే కాకుండా వారు పండించిన పంటని అలా సులాలకు కొన్న వడ్డీ వ్యాపారులు వారు లాభపడుతూ నిరుపేద ఆదివాసి రైతుల జీవితాలను అప్పుల ఊబిలోకి నేడుతున్నారు ఏజెన్సీ ప్రాంతంలోని దళారులు కోట్లకు పరిగెడుతున్నారు నిరుపేద ఆదివాసి రైతులు సేట్ల దగ్గర అప్పు కోసం వరుస కడుతున్నారు ఏజెన్సీ ప్రాంతంలో ఇంత జరుగుతున్నా కూడా వ్యవసాయ శాఖ అధికారులు కళ్ళు మూసుకొని దళారులను ప్రోత్సహిస్తున్నారు ఇది ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో ఆదివాసీల భూములు మొత్తం కూడా వడ్డీ వ్యాపారులు సేట్లకి తాకట్టు పెట్టాల్సిన పరిస్థితి దాపురిస్తుందని వారు ఆవేదన చెందినారు.

అతికరేట్లకు విత్తనాలు సప్లై చేస్తున్న సేట్లను అధిక వడ్డీకి డబ్బులు ఇస్తున్న వడ్డీ వ్యాపారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నా.

ఏజెన్సీ ప్రాంతంలో భూభారతి అవగాహన సదస్సులో గిరిజనేతరుల ఆధ్వర్యంలో ఉన్నటువంటి భూముల పైన విచారణ చేపట్టాలని ఆ భూములు 1/70 చట్టం అమల్లో రాకముందు నుండి వారి ఆధ్వర్యంలో ఉన్నాయా అనే విషయాన్ని కూడా ప్రభుత్వం

ఈ అవగాహన సదస్సులో ఏజెన్సీ ప్రాంతంలోని భూములపై కూడా అవగాహన కల్పించాలని అంతేకాకుండా భూభారతి ముసుగులో 1970 సంవత్సరం తర్వాత ఏజెన్సీ ప్రాంతాలకు వలస వచ్చిన గిరిజనేతరాలకు హక్కులు కల్పిస్తామంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు.

 

అదేవిధంగా ఈనెల 27న గంగారం మండలం కమిటీ ఎన్నుకోవడం జరుగుతుందని ఆదివాసి యువకులు అధిక సంఖ్యలో హాజరుకావాలని వారు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో తాటి ప్రవీణ్ మహాబూబాబాద్ డివిజన్ అధ్యక్షులు ఆదివాసి సంక్షేమ పరిషత్ ధనసరి రమేష్ దనసరీ వినోద్ గట్టి కార్తీక్ చింత సాంబయ్య అలెం సారంగపాణి తదితరులు పాల్గొన్నారు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!