*పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలి*
*జహీరాబాద్ నేటి ధాత్రి:*
జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్యరావు సోమవారం జరా సంఘం మండలంలోని పలు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పాలనపై ప్రజలు విసిగిపోయారని, కాంగ్రెస్ అభ్యర్థులు ఓడిస్తేనే ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెరవేరుతాయని ఆయన అన్నారు. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు.
