శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దర్శించుకున్న ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య…
యాదగిరిగుట్ట యాదగిరిగుట్ట: శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానంలో ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య, భక్తిశ్రద్ధలతో స్వామివారిని దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం ఆలయ అర్చకులు ప్రత్యేక ఆశీర్వచనం అందజేయగా,ఆలయ అధికారులు లడ్డు ప్రసాదం అందజేశారు. రాష్ట్ర ప్రజలందరూ సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో సుభిక్షంగా జీవించాలని ఆయన ఆకాంక్షించారు. రాష్ట్రంలో శాంతి, అభివృద్ధి మరింత వృద్ధి చెందాలని స్వామివారిని ప్రార్థించారు.దర్శన కార్యక్రమంలో ఐలయ్య మిత్రులు గడ్డమీది మాధవులు, కౌన్సిలర్ బబ్బురి శ్రీధర్ గౌడ్, గున్న సంజీవరెడ్డి, భూపతి రెడ్డి, రామకృష్ణ గుప్తా తదితరులు పాల్గొన్నారు.
