బ్రెయిన్ ట్యూమర్ బాధితురాలికి ఎల్ఓసి అందజేత.

MLA MLA

బ్రెయిన్ ట్యూమర్ బాధితురాలికి ఎల్ఓసి అందజేత…

రామకృష్ణాపూర్ నేటిధాత్రి:

 

క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని గద్దెరాగడి ఏరియాలో గల ఎన్టీఆర్ నగర్‌కు చెందిన ఎనగందుల స్వాతి అనే పేద మహిళ బ్రెయిన్ ట్యూమర్‌తో తీవ్రంగా బాధపడుతూ తగిన చికిత్స అందుకోలేని పరిస్థితిలో ఉన్న సమాచారం చెన్నూరు శాసన సభ్యులు గడ్డం వివేక్ వెంకటస్వామి కి తెలియడంతో వెంటనే స్పందించి, ఆమె చికిత్స కోసం అవసరమైన ఎల్ఓసి ని మంజూరు చేశారు. ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి ఆదేశాల మేరకు బుదవారం బాధిత మహిళకు ఆమె నివాసంలో ఎల్ఓసి ని కాంగ్రెస్ పార్టీ మంచిర్యాల జిల్లా అధికార ప్రతినిధి వొడ్నాల శ్రీనివాస్ అందజేశారు.అనంతరం ఆయన మాట్లాడారు.పేద ప్రజల పట్ల ఎమ్మెల్యే వివేక్ కు ఉన్న ప్రేమ వెలకట్టలేనిదని అన్నారు.స్వాతి కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే వివేక్ కు ధన్యవాదాలు తెలియజేస్తూ, తక్షణ చికిత్స కోసం ఆసుపత్రికి ప్రయాణమయ్యారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి మొట్టె సుధాకర్, యూత్ కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షులు గుర్రం అనిల్ కుమార్, యువజన నాయకులు కునారపు శివకుమార్ , ఊటూరి చంద్రయ్య, యాదగిరి తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!