గణపయ్య పూజలో పాల్గొన్న లైన్ మెన్ బోగీ ఐలయ్య దంపతులు
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి
మొగుళ్లపల్లి మండల కేంద్రంలోని సాంబమూర్తి దేవాలయంలో వినాయక చవితిని పురస్కరించుకొని అక్కడ కొలువు దీరిన గణనాదున్ని లైన్ మెన్ బోగీ ఐలయ్య సునీత దంపతులు సందర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కలను సమర్పించారు. ఈ సందర్భంగా లైన్ మెన్ ఐలయ్య మాట్లాడుతూ విఘ్నాలు తొలగించే వినాయకుడి చల్లని చూపు ప్రజలందరిపై ఉండాలని, గణనాథుడి ఆరాధనతో ప్రతి ఇంటా సంతోషం, ఐశ్వర్యం, అభివృద్ధి నిండుగా ఉండాలని ఆ గణనాథుడిని వేడుకుంటున్నట్లు ఐలయ్య తెలిపారు. వినాయక చవితి పండగ మనలో భక్తి, శక్తి మాత్రమే కాక ఐకమత్యం,స్నేహభావాన్ని పెంపొందిస్తుందన్నారు.