బాల కార్మిక వ్యవస్థను రూపుమాపుదాం.

Child labor Child labor

బాల కార్మిక వ్యవస్థను రూపుమాపుదాం
ఆపరేషన్ ముస్కాన్-11కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం

చిన్న పిల్లలతో వెట్టిచాకిరి చెపిస్తే క్రిమినల్ కేసులు తప్పవు.

జిల్లా ఎస్పీమహేష్ బి. గితే ఐ.పీ.ఎస్

సిరిసిల్ల టౌన్ (నేటి ధాత్రి):

బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రభుత్వం జులై 01 నుండి 31తేదీ వరకు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆపరేషన్ ముస్కాన్-11కార్యక్రమాన్ని అన్ని శాఖల అధికారులు సమన్వయంతో విజయవంతం చేయాలని జిల్లా ఎస్పీ అధికారులకు ఆదేశించారు.
ఆపరేషన్ ముస్కాన్-11కార్యక్రమంలో భాగంగా శనివారం రోజున వివిధ శాఖల అధికారులతో జిల్లా పోలీస్ కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్ లో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈసందర్బంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ….ఆపరేషన్ స్మైల్ -11లో పాలుపంచుకొంటున్న ప్రతి ఒక్క అధికారి సమన్వయంతో పక్కా ప్రణాళిక రుపొందించుకోని బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించేలా విధులు నిర్వహించాలన్నారు.

ప్రతీ ఒక్కరి జీవితంలో బాల్యం అమూల్యమైనదని దానిని అనుభవించటం ప్రతీ పౌరుని హక్కు అని,క్షణికావేషంలో పిల్లలు తొందరపాటులో చిన్న చిన్న విషయాలకే తల్లి దండ్రులను విడిచి ఇంటికి దూరంగా ఉంటున్నారని,ఇట్టి అవకాశాన్ని ఆసరాగా తీసుకొని కొందరు వారిని ప్రమాదకర పనుల్లో వారితో పనులు చేయిస్తూ వారి జీవితాలతో ఆడుకుంటున్నారని అలాంటి వారిని గుర్తించి వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని తెలిపారు.

 

 

 

 

 

 

 

Child labor
సిరిసిల్ల,వేములవాడ డివిజన్ స్థాయిలో ఒక ఎస్.ఐ మహిళా పోలీస్ అధికారి, నలుగురు సిబ్బంది, వివిధ డిపార్ట్మెంట్ అధికారులతో ఏర్పాటు చేసిన రెండు టీమ్స్ జిల్లాలో పిల్లలతో పనిచేసే అవకాశాలు ఉన్న పలు పరిశ్రమలు,హోటల్స్,వ్యాపార సముదాయాలు, గోదాములు,మెకానిక్ షాపులు,హోటల్స్, ఇటుక బట్టిలు తదితర ప్రాంతాల్లో వ్యూహాత్మక తనిఖీలు నిర్వహించాలని సూచించారు. స్కూల్స్ కు వెళ్లకుండా వివిధ కారణాల వల్ల డ్రాపౌట్ అయిన పిల్లల తల్లి దండ్రులకు నచ్చ చెప్పి తిరిగి వారిని పాఠశాలకు పంపే ఏర్పాటు చేసి వారికి కొత్త జీవితాన్ని ఇవ్వాలన్నారు. ఎక్కడైనా బాల కార్మికుల కనిపిస్తే పోలీస్ వారికి సమాచారం తెలపాలని విజ్ఞప్తి చేశారు.18సంవత్సరాల లోపు పిల్లలతో పని చేయుస్తున్న వారిపై 2024 సంవత్సరంలో నిర్వహించిన ఆపరేషన్ స్మైల్, ముస్కాన్ లో 21 మందిపై క్రిమినల్ కేసులు,ఈ సంవత్సరం జనవరిలో నిర్వహించిన అపరేషన్ స్మైల్ కార్యక్రమంలో 08 మందిపై క్రిమినల్ కేసులు నమోదు చేయడం జరిగిందని ఈసందర్భంగా గుర్తు చేశారు.ఈసమావేశంలో అదనపు ఎస్పీ చంద్రయ్య,సిరిసిల్ల ఆర్.డి.ఓ వెంకటేశ్వర్లు, dwo లక్ష్మీరాజాం,drdo శేషాద్రి, సి.ఐ లు నటేష్,నాగేశ్వరరావు,అసిస్టెంట్ లేబర్ అధికారి నజీర్ హమ్మద్, మెడికల్ &హెల్త్ నుండి డాక్టర్ నయుమ్ జహా, విద్య శాఖ నుండి కోర్దినేటర్ సతీష్ కుమార్,షీ టీం ఏ.ఏఎస్.ఐ ప్రమీల,పోలీస్ అధికారులు,సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!