వనపర్తి లో మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ వర్ధంతి లో తెలుగుదేశం పార్టీ నేతలు

వనపర్తి నేటిధాత్రి :
వనపర్తి తెలుగుదేశం నేతలు మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎన్టీ రామారావు వర్ధంతిని ఘనంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా నాగర్ కర్నూల్ పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బి రాములు మాజీ జెడ్పిటిసి గొల్ల వెంకటయ్య యాదవ్ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా బి రాములు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీని స్థాపించి 9 నెలల్లోనే ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయ్యారని చేశారు అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 200 సీట్లు ఎమ్మెల్యే స్థానాలు ఎన్టీ రామారావు గెలిపించి రికార్డు స్థాయిలో దేశంలోనే పేరు గాంచిన వ్యక్తి అని కొనియాడారు రాష్ట్రంలో మహిళలకు విశ్వవిద్యాలయాలు రైతులకు సబ్సిడీ రెండు రూపాయల కిలో బియ్యం పథకం ఎన్టీ రామారావు అనేక సంక్షేమ అభివృద్ధి పనులు పేద ప్రజలకు చేశారని గుర్తు చేశారు ప్రతి ఎమ్మెల్యే ప్రతి గ్రామం సందర్శించి అక్కడున్న సమస్యలు తెలుసుకొని పరిష్కరించాలని ఎన్టీ రామారావు నిబంధనలు పెట్టారని ఆయన పేర్కొన్నారు గ్రామస్థాయిలో కూడా ప్రజలు చైతన్యవంతులయ్యారని ఎన్టీ రామారావు తెచ్చిన పథకాల వల్లనే కేంద్రంలో నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వంలో ఏంటి రామారావు కీలక పాత్ర పోషించారని బి రాములు అన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నేతలు హోటల్ బలరాం బాలరాజ్ న్యాయవాది శాకీర్ హుస్సేన్ బాలకృష్ణ ఫ్యాన్స్ అభిమాని దస్తగిరి ఎండి గౌస్ కొత్త గొల్ల శంకర్ గంధం కృష్ణయ్య ఫారూఖ్ మేదరి బాలయ్య గంధం కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు అనంతరం పండ్లు పంచిపెట్టారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!