
False allegations
తెలంగాణ ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయే ప్రాజెక్ట్ కాళేశ్వరం
కాళేశ్వరం ప్రాజెక్టు పై తప్పుడు ఆరోపణలు మానుకోవాలి
కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ కాదు అది
కాంగ్రెస్ పార్టీ కమిషన్ రిపోర్ట్
పిసి గోష్ రిపోర్ట్ తప్పులతడక
కాంగ్రెస్ ప్రభుత్వం పై మాజీ మంత్రి ,డోర్నకల్ మాజీ శాసనసభ్యులు డిఎస్ రెడ్యానాయక్ ఫైర్
మరిపెడ నేటిధాత్రి.
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గ కేంద్రమైన మరిపెడ మండల కేంద్రంలోని జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గుడిపూడి నవీన్ రావు గెస్ట్ హౌస్ లో నవీన్ రావు అధ్యక్షతన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి,డోర్నకల్ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు డిఎస్ రెడ్యానాయక్ మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీని సమాజంలో బదనాం చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంది అన్నారు, అది కాళేశ్వరం కమీషన్ కాదు, కాంగ్రెస్ పార్టీ కమిషన్ గా పని చేస్తుందన్నారు, పీసీ ఘోష్ కాంగ్రెస్ కార్యకర్తలాగ పనిచేసి కాంగ్రెస్ లీడర్లు మాట్లాడిన విషయాలనే రిపోర్టులో పొందు పరిచాడు అన్నారు, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆధ్వర్యంలో కట్టిన తెలంగాణ ప్రజల వరప్రదాయని ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ అన్నారు, లక్ష ఎకరాలకు తాగు,సాగునీరు ఇచ్చె ప్రాజెక్టు ను ఎండ బెట్టే కుట్రకు తెర లేపింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు,తెలంగాణ రైతాంగం పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్త శుద్ధి లేదు, రైతులపై కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వర్షాలు లేక పంటలు ఎండుతుంటే కనీసం రైతులకు సాగు నీరు ఇవ్వాలన్న సోయి లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంది అన్నారు, కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందని ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ ముఖ్యంగా రైతులను ఆగం చేస్తున్న ఈ కాంగ్రెస్ పార్టీకి రైతుల గొస తగులుతుందన్నారు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను కప్పి పుచ్చుకునేందుకు రేవంత్ రెడ్డి చేస్తున్న దురదృష్టపు పాలన అన్నారు,కేసీఆర్ ను తెలంగాణ సమాజంలో తక్కువ చేయాలని తెలంగాణ ప్రజల గుండెల్లో కేసీఆర్ ముద్రను చెరిపేయాలని ఆలోచన కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉందన్నారు ,కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి వరంగల్, నల్గొండ, కరీంనగర్, ఖమ్మం జిల్లాల రైతులు రెండు కార్లు పంటలు పండి రైతులు సంతోషం వ్యక్తం చేసే వారు అన్నారు, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినంక కాళేశ్వరం ద్వారా వచ్చే నీటిని రాకుండా చేసి రైతులను ఆగం చేస్తుందన్నారు, తెలంగాణ ప్రజలకు ఇచ్చిన 420 హామీల ను ఎప్పుడు అమలు చేస్తారన్నారు,ఎన్నికల్లో గెలిచేందుకు కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది అన్నారు,రైతులకు 100శాతం ఋణ మాఫీ చేస్తామని చెప్పి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాక చేతులెత్తేసిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు,
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇస్తామని చెప్పి అధికారంలో కి వచ్చి బీసీలను మభ్య పెట్టే విధంగా డిల్లీ లో ధర్నా లు అంటూ నాటకాలు ఆడుతున్నారన్నారు,మహిళలకు 2500 ఇస్తామని చెప్పి ఇంతవరకు ఇచ్చిన దిక్కులేదు గాని కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తాడట ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వo, వికలాంగులు 6000 రూపాయల పెన్షన్ ఇస్తామని చెప్పి వికలాంగులను మోసం చేసింది అన్నారు,బిఆర్ఎస్ కార్యకర్తలు కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసే ఆరోపణలు ఎప్పటికప్పుడు తిప్పికొడుతూ వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి భారీ మూల్యం తప్పదు అన్నారు, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ తెలంగాణ ప్రభుత్వం వస్తుందని రైతులు,నిరుద్యోగ విద్యార్థులు, మహిళలు అందరు ఎదురుచూస్తున్నారని, ముఖ్యంగా రైతులు ఈ ప్రభుత్వం పోయి కేసీఆర్ ప్రభుత్వమే రావాలని కోటి ఆశలతో ఎదురుచూస్తున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గుడిపూడి నవీన్ రావు,మాజీ ఎంపీపీ గడ్డం వెంకన్న,గాదె అశోక్ రెడ్డి, కేసముద్రం మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ రాంపల్లి రవి గౌడ్, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు తేజావత్ రవీందర్,కాలు నాయక్,కొమ్ము చంద్రశేఖర్, మాజీ ఎంపిటిసి కొమ్ము నరేష్,బిఆర్ఎస్ పార్టీ మాజీ కౌన్సిలర్లు రేఖ వెంకటేశ్వర్లు, వెంకన్న,సీనియర్ నాయకులు బాలాజీ నాయక్,గండి మహేష్ గౌడ్,గంధసిరి కృష్ణ,దుస్స నరసయ్య, అజ్మీర రెడ్డి, మండలంలోని వివిధ గ్రామాల బిఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.