డ్రగ్స్, గంజాయి, రోడ్డు ప్రమాదాలపై కళాజాత

• గంజాయి మత్తులో యువత
• అవగాహన కల్పించిన కళాజాత

నిజాంపేట: నేటి ధాత్రి

నేటి కాలంలో యువత గంజాయి, డ్రగ్స్ మత్తులో చెడు వ్యసనాలకు అలవాటు పడుతున్నారని యువతరం మారాలని, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని కళాజాత ద్వారా అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ మేరకు నిజాంపేట మండలం నందగోకుల్ గ్రామంలో సారధి కళాకారులచే పాటలు పాడుతూ గ్రామీణ ప్రాంత ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జిల్లా కలెక్టర్, జిల్లా పౌరసరఫరాల శాఖ ఆదేశాల మేరకు గ్రామీణ ప్రాంతాలకు వెళ్లి ప్రజలకు రోడ్డు భద్రత, గంజాయి వ్యసనం, ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కళాకారులు ఎల్ల సిద్దులు, ఆస రామారావు, కారంగుల మాధవి, శివోల్ల కృష్ణ, బీట్ల ఎల్లయ్య, సందుర్గ శేఖర్, తుమ్మల ఎల్లయ్యలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!